తాజా వార్తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

  • దిల్లీ: అంతర్జాతీయ తీవ్రవాద సంస్థ ‘ఐసిస్’తో సంబంధాలు ఉన్న నలుగురు అనుమానిత వ్యక్తులను ఉత్తరాఖండ్‌లో పోలీసులు గురువారం అరెస్టు చేశారు. గణతంత్ర వేడుకల సమయంలో దేశంలో ఉగ్రవాదుల దాడులకు అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించటంతో పోలీసులు దిల్లీ సహా పొరుగు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో నలుగురిని అరెస్టు చేసి క్షుణ్ణంగా ప్రశ్నిస్తున్నారు. వీరికి ఐసిస్‌తో సంబంధాలున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని హరిద్వార్‌లో అర్ధ కుంభమేళాలో దాడి చేసేందుకు ఈ నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తున్నారని పోలీసులు తెలిపారు.

  • హైదరాబాద్: దళిత విద్యార్థి రోహిత్ ఆత్మహత్య అనంతరం ఐదో రోజు గురువారం కూడా హెచ్‌సియులో బంద్ కొనసాగుతోంది. విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు దిల్లీ సి.ఎం. కేజ్రీవాల్, సిపిఐ నేతలు సురవరం సుధాకర్‌రెడ్డి, మాజీ ఎం.పి. అజీజ్ పాషా తదితరులు ఈ రోజు వర్శిటీకి వస్తున్నారు. రాజకీయ నేతల తాకిడి అధికం కావడంతో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.