S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/18/2018 - 02:32

తిరుపతి, ఫిబ్రవరి 17: రాష్ట్ర విభజన అశాస్ర్తియంగా జరిగిందంటున్నారు. శాస్ర్తియత లేకపోతే ఎందుకు మార్పులు చేయలేకపోయారు. చిత్తశుద్ధి ఉంటే మార్చేందుకు ముందుకు రండి.. మద్దతిస్తాం. అంటూ కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేష్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పిలుపునిచ్చారు. కేంద్రమాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో శనివారం తిరుపతిలో విభజన చట్టం-హామీలు-అమలు అన్న అంశంపై సదస్సు నిర్వహించారు.

02/18/2018 - 02:31

విజయవాడ (కార్పొరేషన్), పిబ్రవరి 17: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు జన్మదినం సందర్భంగా ఏపీ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. శనివారం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయంలో ఏపీ టీఆర్‌ఎస్ నాయకులు కొణిజేటి ఆదినారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

02/17/2018 - 05:30

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 16: ‘మీరు సాగుచేస్తున్న వ్యవసాయ భూమిలో రెండో వరసలోని మూడో మొక్క ఆకుపై పురుగు ఆశించింది... మీ భూమిలో ఫలానా ప్రాంతంలో నీటి తడి తక్కువగా ఉంది... మీ చేలో మొక్కల ఆకులు కొంత మేర రంగు మారుతున్నాయి కాబట్టి, ఫలానా తెగులు వ్యాప్తిచెందవచ్చు...’ ఇలాంటి సందేశాలు నేరుగా రైతు మొబైల్‌కు సంక్షిప్త సందేశం (ఎస్‌ఎంఎస్) ద్వారా లభిస్తే...

02/17/2018 - 05:29

శ్రీకాళహస్తి, ఫిబ్రవరి 16: మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి తరువాత ప్రారంభమైన ఆది దంపతుల కల్యాణ వేడుకలు శుక్రవారం తెల్లవారుజాము వరకు వేడుకగా జరిగాయి. ఆలయం నుంచి గజ వాహనంపై గంగాదేవి సమేతుడైన సోమస్కందమూర్తి, సింహ వాహనంపైన జ్ఞాన ప్రసూనాంబ రావడం.. హిమవంతుడితో చండికేశ్వరుడి రాయబారం ప్రక్రియలను అర్చకస్వాములు రక్తికట్టించారు.

02/16/2018 - 16:17

విజయవాడ : చెన్నైలో ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ అత్యాచారానికి గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడకు చెందిన యువతి.. కామచిపు జిల్లా తాళంబూరులోని ఓ ఐటీ ప్రముఖ కంపెనీలో పనిచేస్తోంది. సోమవారం రాత్రి విధులు ముగించుకొని తన రూమ్‌కు వెళ్తుండగా శేమంచ్ఛేరి ప్రాంతంలో మలుపు తిరుగుతుండగా ఆమెపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఐరన్‌ రాడ్‌తో దాడి చేశారు.

02/16/2018 - 13:06

కర్నూలు: పత్తికొండ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత చెరుకులపాడు నారాయణరెడ్డి దారుణ హత్య కేసులో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యామ్ బాబు‌కు డోన్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. చెరుకులపాడు నారాయణరెడ్డి గత ఏడాది మే 22వతేదీన దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే.

02/16/2018 - 16:36

గుంటూరు: నగరంలోని జీజీహెచ్ ఆసుపత్రిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం సందర్శించారు.జీజీహెచ్‌లో పరిస్థితులపై సూపరింటెండెంట్‌ నుంచి వివరాలు తెలుసుకున్నారు.

02/16/2018 - 11:51

పలమనేరు: చిత్తూరు జిల్లా పలమనేరు మండలం మొరంలో విషాదం చోటు చేసుకుంది. డ్రైనేజీని శుభ్రం చేసేందుకు అందులోకి దిగిన ఏడుగురు కార్మికులు ఊపిరాడక మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వర హేచరీస్ కోళ్లఫారం కంపెనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

02/16/2018 - 04:16

అమరావతి: అనంతపురం నుంచి కృష్ణపట్నం వరకు తమిళనాడు తరహా అతి పెద్ద ఇండస్ట్రియల్ క్లస్టర్ ఏర్పాటవుతున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. చిత్తూరు జిల్లాలోని ఎలక్ట్రానిక్ క్లస్టర్ మొదలుకొని, అనంతపురం జిల్లాలోని ఆటోమొబైల్ పరిశ్రమ వరకు రానున్న కాలంలో దేశంలోనే అతి పెద్ద పారిశ్రామిక ప్రాంతంగా అవతరిస్తుందని తెలిపారు.

02/16/2018 - 03:52

హైదరాబాద్, ఫిబ్రవరి 15: కేంద్రప్రభుత్వం సాయం అందించడంపై ఎవరూ యాగీ చేయాల్సిన పనే్లదని ఆంధ్రప్రదేశ్ బిజెపి అధికార ప్రతినిధి సుదీష్ రాంబొట్ల పేర్కొన్నారు. గురువారం నాడు బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. కేంద్రం ఏం సాయం చేస్తోందో ఎప్పటికపుడు విష్పష్టంగా చెబుతోందని అన్నారు.

Pages