S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

11/28/2017 - 04:12

విజయవాడ (బెంజిసర్కిల్), నవంబర్ 27: నేటి వరకట్నం ఇచ్చి పెళ్లి చేసుకునే రోజుల నుండి, నాటి కన్యాశుల్కం తీసుకుని పెళ్లి చేసుకునే రోజులు మహిళాలోకానికి దగ్గరలోనే ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు.

11/28/2017 - 04:09

గుంటూరు, నవంబర్ 27: ప్రభుత్వం మాతా, శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. మహిళా సంక్షేమంపై సోమవారం శాసనసభలో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. బాలామృతం పథకానికి నెలకు 20 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని, మధ్యాహ్న భోజన పథకాన్ని 12.50 కోట్లతో కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

11/28/2017 - 04:08

అమరావతి, నవంబర్ 27: రాష్ట్రంలో బాలల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేశారు. సోమవారం ఏపీ అసెంబ్లీలోని కాన్ఫరెన్స్ హాలులో 13 జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులతో ఆయన మాట్లాడారు. ప్రస్తుత సమాజంలో బాలబాలికలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలంటూ స్పీకర్ కోడెలకు 13 జిల్లాల నుంచి వచ్చిన 64 మంది విద్యార్థులు వినతిపత్రం అందజేశారు.

11/28/2017 - 04:08

అమరావతి, నవంబర్ 27: నాలుగురోజులు పాటు ఇచ్చిన సెలవులు మీకు సరిపోలేదా? ఇంకా హాలిడే మూడ్‌లోనే ఉంటే ఎలా? మీలో ఎవరికీ సీరియస్‌నెస్ లేదు. విపక్షం లేని సభను సమస్యల పరిష్కారానికి వేదికగా మార్చుకోవాలన్న శ్రద్ధ మీలో చాలామందికి కనిపించడం లేదు. వచ్చే ఎన్నికల్లో గెలవని వారి రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడుతుంది. గుర్తుంచుకోండ’ని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు.

11/28/2017 - 04:07

విజయవాడ (క్రైం), నవంబర్ 27: సంక్రాంతి, క్రిస్మస్‌కు సంబంధించిన చంద్రన్న కానుకలు క్రిస్మస్ కంటే ముందే ఇస్తామని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ఎం లింగారెడ్డి సోమవారం విలేఖరుల సమావేశంలో చెప్పారు. ప్రభుత్వం 300 నుంచి 350 కోట్లు ఖర్చు చేస్తోందని, ప్రతిపైసా సద్వినియోగం చేస్తామన్నారు. దుర్వినియోగం అయినట్లు తెలిస్తే ఎంతటి వారినైనా వదిలేది లేదని హెచ్చరించారు.

11/28/2017 - 04:06

గుంటూరు, నవంబర్ 27: కడపలో ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థుల మనోవేదనపై మానవతా దృక్పధంతో స్పందించి కేంద్రమే నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఏకగ్రీవంగా తీర్మానించింది. తీర్మానాన్ని సోమవారం ముఖ్యమంత్రి సభలో ప్రవేశపెట్టగా ఉభయసభలు ఆమోదించాయి.

11/28/2017 - 04:06

విజయవాడ, నవంబర్ 27: అమరావతి సచివాలయంలోని మొదటి బ్లాకులో సోమవారం రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర సాధారణ పరిపాలనా శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్ కార్యక్రమంలో పాల్గొని రాజ్యాంగ పీఠికను చదివి వినిపించారు. నవంబరు 26వ తేదీ రాజ్యాంగ దినోత్సవం కాగా ఆరోజు ఆదివారం సెలవు దినం కావడంతో ఈ వేడుకలను 27వ తేదీ సోమవారం సచివాలయంలో నిర్వహించారు.

11/28/2017 - 04:05

విజయవాడ, నవంబర్ 27: శాసనసభ సమావేశాల్లో ఎంతో కీలకమైన జీరో అవర్‌లో సభ్యుల ప్రశ్నలను మంత్రులు ఎంతో తేలిగ్గా తీసుకుంటున్నారు.. ప్రతి ప్రశ్నకు రొటీన్‌గా ఒకే సమాధానం.. నోట్ చేసుకున్నాం.. సంబంధిత మంత్రికి తెలియజేస్తాం అని చెప్పటం మినహా నెలలు గడుస్తున్నా సమాధానాలు రావటం లేదు.. ఇక చర్యలు ఏమీ ఉండటం లేదంటూ ప్రస్తుత సమావేశాల్లో రెండోసారి సోమవారం పలువురు తీవ్ర అసంతృప్తితో పెదవి విరిచారు.

11/28/2017 - 03:57

విజయవాడ, నవంబర్ 27: ‘కొండ నాలుకకు మందు వేస్తే.. ఉన్న నాలుక ఊడిన చందంగా’ రేషన్ సరుకుల సరఫరాలో ప్రవేశపెట్టిన ఈపోస్ విధానంలో వేలిముద్రల కోసం తిరిగి తిరిగి తెల్లకార్డుదారుల కాళ్లు అరిగిపోతున్నాయి కానీ రేషన్ మాత్రం దక్కడం లేదంటూ ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో అధికారపక్ష టీడీపీ, మిత్రపక్ష బిజెపి సభ్యులు మూకుమ్మడిగా ధ్వజమెత్తారు.

11/28/2017 - 03:56

కర్నూలు, నవంబర్ 27: కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో వైకాపా అధినేత జగన్ స్వరం పెంచారు. గత 18 రోజులుగా ప్రభుత్వంపై విమర్శలు, తాను అధికారంలోకి వస్తే అమలుచేసే హామీలు, తండ్రి దివంగత రాజశేఖర్‌రెడ్డిపై పొగడ్తలతో ప్రసంగాలు కొనసాగించిన ఆయన 19వ రోజు కర్నూలు జిల్లా కోడుమూరు బహిరంగసభలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలకు దిగారు.

Pages