-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విజయవాడ, అక్టోబర్ 29: అన్ని ప్రభుత్వ శాఖల కంటే అత్యంత పురాతనమైనది, ప్రాముఖ్యత సంతరించుకున్న రెవెన్యూ శాఖలో ఉద్యోగులపై క్షేత్రస్థాయిలో పని ఒత్తిడి తగ్గించాలని, మానసిక క్లేశం లేని పని వాతావరణం కల్పించేందుకు ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి అధ్యక్షతన తక్షణం ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించాలని ఆదివారం నగరంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ 16వ రాష్ట్ర కౌన్సిల్ మ
రాజమహేంద్రవరం, అక్టోబర్ 29: ఏలేరు ఆయకట్టుకు ఎట్టకేలకు పురుషోత్తపట్నం జలాలు తాకాయి. ఇప్పటివరకు పుష్కర ఎత్తిపోతల పథకం కాలువల ద్వారా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం జలాలను విడిచిపెట్టారు. ఈ పథకంలో పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ ద్వారా ఏలేరు రిజర్వాయర్కు గోదావరి జలాలను అనుసంధానం చేసే విధంగా డిజైన్ చేశారు. ఆగస్టు 15న రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదరాబాదరా ఈ పథకాన్ని జలసిరిలో భాగంగా జాతికి అంకితం చేశారు.
అయినవిల్లి, అక్టోబర్ 29: కాపులకు బిసి రిజర్వేషన్లు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి డిసెంబర్ 6వ తేదీ ఆఖరని, ఆ తరువాత కాపుల ఉద్యమంతో భూకంపం సృష్టిస్తామని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామంలో నిర్వహించిన కాపు సమారాధనలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.
కాకినాడ, అక్టోబర్ 29: ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషిచేసేందుకు ప్రారంభించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోందని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. ఇంటింటికి దేశంలో ప్రజల నుండి అందిన అర్జీల పరిష్కారానికి రాష్టస్థ్రాయిలో పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
విశాఖపట్నం(స్పోర్ట్స్), అక్టోబర్ 29: రెండో ఎలైట్ జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్ పోటీల్లో రైల్వే, సర్వీసెస్ జట్లు టైటిల్ కోసం పోరాడుతున్నాయి. రైల్వే జట్టులో నలుగురు బాక్సర్లు, సర్వీసెస్ జట్టులో అయిదుగురు బాక్సర్లు ఫైనల్స్కు చేరుకోవడంతో ఆధిపత్యం కోసం రెండు జట్లు ఫైనల్స్లో హోరాహోరీ తలపడనున్నాయి. వీరికి దీటుగా హర్యానా, మిజోరాం బాక్సర్లు కూడా టైటిల్ రేస్లో గట్టి పోటీ ఇవ్వనున్నారు.
విజయవాడ, అక్టోబర్ 29: వివిధ శాఖల్లో అవినీతి, పురోగతికి సంబంధించి క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన 1100 కాల్ సెంటర్కు అనూహ్య స్పందన లభిస్తోంది. తమ సమస్య పరిష్కారం అయిన తర్వాత మళ్లీ కాల్ సెంటర్కు ఫోన్ చేసి కృతజ్ఞతలు చెబుతున్న పరిస్థితి కాల్ సెంటర్ అధికారులను, ప్రభుత్వాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఒకే ఒక్క ఫోన్ కాల్ వారి జీవితాలను మార్చేసింది.
విజయవాడ (ఇంద్రకీలాద్రి), అక్టోబర్ 29: ఇంద్రకీలాద్రిపై కొలువైన అమ్మవారి సన్నిధిలో ఈ నెల 31 నుండి భవానీ దీక్షలు ప్రారంభం కానున్నాయి. పాతబస్తీ బ్రాహ్మణ వీధి ఇంద్రకీలాద్రి పరిపాలన కార్యాలయంలో దుర్గగుడి ట్రస్ట్బోర్డు కమిటీ చైర్మన్ వై గౌరంగబాబు, ఇవో ఎ సూర్యకుమారి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.
విజయవాడ, అక్టోబర్ 29: వరుసగా రెండు ప్రతిష్ఠాత్మకమైన టైటిళ్లను గెలిచిన కిడాంబి శ్రీకాంత్ దేశానికే గర్వకారణమయ్యాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలతో ముంచెత్తారు. ఫ్రెంచ్ ఓపెన్ గెలిచి తిరుగులేని క్రీడాకారునిగా నిలిచిన శ్రీకాంత్కు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. శ్రీకాంత్ సాగిస్తున్న విజయ పరంపర దేశ క్రీడారంగానికే స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
నెల్లూరు, అక్టోబర్ 29: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేయబోయేది ప్రజా సంకల్ప యాత్ర కాదని, అంతిమ యాత్ర అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. నెల్లూరులో నిర్మిస్తున్న పేదల ఇళ్లను ఆయన మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా అనర్హుడని, అసెంబ్లీకి రాడని, ప్రజా సమస్యలమీద ఏనాడూ మాట్లాడిన దాఖలాలు లేవని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
విజయపురిసౌత్, అక్టోబర్ 29: ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం జలాశయానికి వరద నీటి ఉద్ధృతి తగ్గింది. దీంతో శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ జలాశయానికి ఆదివారం సాయంత్రానికి నీటి విడుదలను పూర్తిగా నిలిపివేశారు. సాగర్ జలాశయం నీటిమట్టం 575.60 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 270.6242 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుండి ఎస్ఎల్బిసి ద్వారా 1800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.