S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/15/2020 - 06:12

గుంటూరు, మార్చి 14: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీపడేది లేదని, హింసకు, దుస్సంఘటనలకు పాల్పడితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఏ స్థాయి నాయకుడైనా, సామాన్యులైనా నిర్భయంగా వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చని తీసుకున్న ప్రతి ఫిర్యాదుకు సమాధానం ఇస్తామని పేర్కొన్నారు.

03/15/2020 - 06:22

కడప: ఎన్నికలకు ముందే కడప జిల్లా పరిషత్‌ను వైకాపా తన ఖాతాలో వేసుకుంది. జిల్లాలోని 50 జడ్పీటీసీ స్థానాల్లో 35 స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. దీంతో జిల్లా పరిషత్ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఎన్నిక ఇక లాంఛనమే. వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు, అధిష్టానం అండతో జిల్లా వ్యాప్తంగా తమ పార్టీకి పోటీ లేకుండా చేసుకున్నారు.

03/15/2020 - 05:55

విశాఖపట్నం, మార్చి 14: రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోందని, ఈ తరుణంలో ఎన్నికల నిర్వహణ సరికాదని, వాయిదా వేసే అవకాశాలను పరిశీలించాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేశారు.

03/15/2020 - 01:28

విజయనగరం: రాష్ట్రంలో ఒకటి, రెండు సంఘటనలు మినహా మిగిలిన చోట్ల స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరుగుతున్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. శనివారం సాయంత్రం ఇక్కడ విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబునాయుడు ఎన్నికలు సజావుగా జరగడం లేదని ఆరోపణలు చేయడం చూస్తుంటే పచ్చ కామెర్లవానికి లోకమంతా పచ్చగా కన్పించిన చందంగా ఉందన్నారు.

03/15/2020 - 01:25

రాజమహేంద్రవరం, మార్చి 14: నదులు మన సంస్కృతిలో భాగమని, వాటిని పరిరక్షించుకోవాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రకృతిని పవిత్రంగా చూసుకుంటే మన జీవన విధానం, ఆరోగ్యం సుభిక్షంగా ఉంటుందన్నారు. పవిత్ర నదులను కాలుష్య రహితంగా కాపాడుకోవాల్సివుందన్నారు. నదులను కాపాడుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్టేనన్నారు.

03/15/2020 - 01:19

విజయవాడ, మార్చి 14: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల ఘట్టం ముగిసే వరకు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిగా నిలుపుదల చేయిస్తున్నట్లుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ తెలిపారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చిందన్నారు. శనివారం నాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ

03/15/2020 - 01:17

అమరావతి, మార్చి 14: రాష్ట్రంలో కరోనా మహమ్మారి నెమ్మదిగా విస్తరిస్తోంది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిపై అధికార యంత్రాంగం నిఘా పెట్టింది. కొవిడ్-19 ప్రభావిత దేశాల నుంచి వచ్చే వారి వివరాలను నిశితంగా పరిశీలించి క్షేత్ర స్థాయిలో ఇళ్ల వద్దే వారికి వైద్య సేవలందించే ఏర్పాట్లు చేస్తున్నారు. మరి కొందర్ని ఐసోలేషన్ వార్డులకు తరలిస్తున్నారు.

03/15/2020 - 01:14

అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా నగరపాలక సంస్థలు, మునిసిపాల్టీల్లో నామినేషన్లు ఊపందుకున్నాయి. ప్రక్రియ ప్రారంభమై మూడు రోజులు గడిచినప్పటికీ శుక్ర, శని వారాల్లో రికార్డు స్థాయిలో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. స్థానిక సంస్థల్లో మునిసిపాల్టీలు, కార్పొరేషన్లకు పార్టీపరంగానే ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి.

03/13/2020 - 06:21

గుంటూరు: అవినీతి రహిత సమాజ స్థాపన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుందని ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ స్థాపించి 9సంవత్సరాలు పూర్తిచేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భాన్ని పురస్కరించుకుని వార్షిక ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

03/13/2020 - 06:19

కర్నూలు, మార్చి 12: కర్నూలులో కరోనా వైరస్ అనుమానిత కేసు నమోదైంది. కరోనా లక్షణాలు ఉన్నట్లు అనుమానిస్తున్న 66 ఏళ్ల వృద్ధురాలిని కర్నూలు ప్రభుత్వ వైద్యశాలలోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. రోగి రక్త నమూనాలను సేకరించి నిర్ధారణ కోసం పూణేకు పంపినట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. వృద్ధురాలు ఇటీవల జోర్డాన్ వెళ్లి వచ్చినట్లు తెలుస్తోంది.

Pages