S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/25/2017 - 04:45

విజయవాడ, జూన్ 24: హైదరాబాద్‌లోని ఏపి ఎన్‌జివో అసోసియేషన్ భవనం బైలా ప్రకారం ఏపి ఎన్‌జివో అసోసియేషన్ సొంత ఆస్తి అని ఎపి ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు పి అశోక్‌బాబు స్పష్టం చేశారు. ఏపి ప్రభుత్వ ఉద్యోగుల నుండి ఒక్కొక్క రూపాయి చందాల రూపంలో సేకరించుకుని కొనుగోలు చేసిన ఆస్తిపై చట్టరీత్యా తెలంగాణ ఉద్యోగుల సంఘానికి గాని, తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వానికి గాని ఎటువంటి హక్కు లేదన్నారు.

06/25/2017 - 04:41

రాజమహేంద్రవరం, జూన్ 24: పోలవరం ప్రాజెక్టు నేపధ్యంలో గోదావరి డెల్టాలకు స్థిరీకరణ తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణా ప్రభుత్వం గోదావరి ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ద్వారా అదనంగా సుమారు 650 టిఎంసిల నీటి వినియోగానికి ప్రణాళిక రూపొందించి ప్రాజెక్టుల నిర్మాణానికి కార్యాచరణ చేపట్టింది.

06/25/2017 - 04:40

విజయవాడ, జూన్ 24: ‘‘48 గంటలపాటు టీవీ ఛానల్స్ కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న వార్తలకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. మీడియాను తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ గౌరవభావంతో చూస్తుందని’’ టిడిపి ఎమ్మెల్సీ, ఆ పార్టీ జాతీయ కార్యాలయ సమన్వయ కార్యదర్శి టిడి జనార్దన్ ఓ ప్రకటనలో తెలిపారు.

06/25/2017 - 04:40

విశాఖపట్నం, జూన్ 24: విశాఖ వేదికగా మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమం జరగనుంది. ఎపి సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమం నవంబర్ 7 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించేందుకు నిర్ణయించారు. ‘గ్రీన్ టెక్నాలజీ ఫర్ ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్’ ప్రధానాంశంగా సైన్స్ కాంగ్రెస్ నిర్వహించనున్నారు.

06/25/2017 - 04:39

కొత్తగూడెం, జూన్ 24: సింగరేణి వ్యాప్తంగా పదిరోజులుగా వారసత్వ ఉద్యోగాల పథకం అమలు కోసం నిర్వహిస్తున్న సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు జాతీయ కార్మిక సంఘాల నాయకులు శనివారం ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని ఆరు జిల్లాలోని 11 ఏరియాల పరిధిలోని సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు.

06/25/2017 - 04:39

ఆత్మకూరు, జూన్ 24: సిఎం చంద్రబాబు అభద్రతా భావనలోకి చేరుకున్నారని రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లురెడ్డి ఎద్దేవ చేశారు. నంద్యాల పట్టణంలో ఇఫ్తార్ విందు సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు అద్దం పడుతున్నాయన్నారు.

06/25/2017 - 04:38

కాకినాడ, జూన్ 24: స్మార్ట్‌సిటీగా తొలి దశలోనే ఎంపికైన తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరం సమస్యలతో సతమతం అవుతోంది. స్మార్ట్‌సిటీ పర్యవేక్షణ బాధ్యతలను చూడాల్సిన కాకినాడ కార్పొరేషన్‌కు సుమారు ఏడు సంవత్సరాలుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఈ దుస్థితి వాటిల్లింది. ఫలితంగా కాకినాడ కార్పొరేషన్ పరిపాలన దాదాపుగా స్తంభించింది.

06/25/2017 - 04:31

అమరావతి, జూన్ 24: కియా మోటార్స్ స్థాపనకు అవసరమైన అనుమతులు అన్నీ త్వరగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో కియా మోటార్స్‌కు సంబంధించి అనంతపురంలో కేటాయించిన భూముల చదును, నీరు, విద్యుత్ వంటి వౌలిక సదుపాయాలు ఏర్పాటు తదితర అంశాలను సమీక్షించారు.

06/25/2017 - 04:28

విజయవాడ (క్రైం), జూన్ 24: ప్రభుత్వం చేపట్టే ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని తప్పు పట్టడం ప్రతిపక్షాలకు అలవాటైందని, ఇది సరైన విధానం కాదని రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

06/25/2017 - 04:28

విజయవాడ, జూన్ 24: అమరావతి నిర్మాణంలో అత్యుత్తమ పద్ధతులు అవలంబించేందుకు, అత్యుత్తమ సౌకర్యాలు కల్పించేందుకు పురపాలక మంత్రి నారాయణ నేతృత్వంలోని సిఆర్డీఏ బృందం దేశ విదేశాల్లోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తోంది. అందులో భాగంగా శనివారం గుజరాత్ రాష్ట్రాన్ని సందర్శించింది.

Pages