S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/25/2017 - 04:27

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 24: ప్రస్తుతం జరగబోతున్న రాష్టప్రతి ఎన్నికలు కేవలం సైద్ధాంతిక పోరే కానీ ఇద్దరు దళితుల మధ్య పోరు కాదని ఎపిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. బిజెపికి మద్దతు ఇచ్చేవారందరూ మనువాదానికి మద్దతు ఇచ్చేవారేనని, ప్రస్తుతం బిజెపి తరఫున రాష్టప్రతి ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాలతో కూడిన మనువాదేనని ఆయన మండిపడ్డారు.

06/25/2017 - 04:27

విజయవాడ, జూన్ 24: రాష్టవ్య్రాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ అత్యాధునిక వైద్య పరికరాలతో మెరుగైన వైద్యం అందించడంతోపాటు ప్రధానంగా పరిశుభ్రతకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఏపి వైద్యసేవలు, వౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ ఆర్.లక్ష్మీపతి తెలిపారు.

06/25/2017 - 04:26

విజయవాడ, జూన్ 24: తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి పనిచేసి చూపించి ప్రజలను ఓట్లు అడుగుతుంటే, విపక్షాలు ప్రజలను నిలువునా మోసం చేసి ఓట్లు అడుగుతున్నాయంటూ రాష్ట్ర గనులశాఖ మంత్రి సుజయకృష్ణ రంగారావు ధ్వజమెత్తారు.

06/25/2017 - 04:26

విజయవాడ, జూన్ 24: కర్నూలు జిల్లా ఉండగా నంద్యాల ఉప ఎన్నిక నేపధ్యంలో అక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిలకడ తప్పి మాట్లాడారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు.

06/25/2017 - 04:22

అమరావతి, జూన్ 24: హిందుపురం ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి చంద్రబాబు వియ్యంకుడైన నందమూరి బాలకృష్ణ వచ్చే ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆ మేరకు సురక్షిత స్థానం కోసం అనే్వషణ ప్రారంభించినట్లు తెలిసింది. అందులో భాగంగా ప్రస్తుతం మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతినిధ్యం వహిస్తోన్న మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

06/25/2017 - 04:21

విజయవాడ, జూన్ 24: బ్రెయిన్‌డెడ్‌కు గురైన వ్యక్తి అవయవాలను కుటుంబ సభ్యులు మంచిమనసుతో దానం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి సుల్తానాబాద్‌కు చెందిన రైల్వే గ్యాంగ్‌మెన్ మేఘావత్ చిన్నస్వామి నాయక్ (44)కు ఆరు నెలల క్రితం తొలిసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. నాటి నుంచి చికిత్స పొందుతూ వస్తున్నాడు. తిరిగి రెండోసారి ఈనెల 21 తేదీ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది.

06/25/2017 - 04:20

అమరావతి, జూన్ 24: ముఖ్యమంత్రి ఆదేశాలు శిలాక్షరాలు. ఆయన ఎప్పుడు చెప్పినా, ఏ సందర్భంలో చెప్పినా అవి శిలాశాసనాల కిందే లెక్క. కానీ రాష్ట్రంలో సీనియర్ అధికారులు జనం సమక్షంలో సీఎం ఇచ్చిన హామీని వెక్కిరిస్తూ, అందుకు భిన్నంగా చేస్తున్న ప్రకటనలు అటు సీఎం, ఇటు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయన్న ఆందోళన అధికార పార్టీ వర్గాల్లో మొదలయింది.

06/25/2017 - 03:33

విజయవాడ (క్రైం), జూన్ 24: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఇప్పటి వరకు కనీ వినీ ఎరుగని స్థాయిలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన ఆరోపణలపై ప్రజారోగ్యశాఖ, మున్సిపల్ ఇంనీరింగ్ శాఖల ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సి) డాక్టర్ పాము పాండురంగారావును ఏసిబి అధికారులు శనివారం అరెస్టు చేశారు. కాగా ఆయనను ప్రభుత్వ సర్వీసు నుంచి తొలిగించాలని ఏసిబి ప్రభుత్వానికి సిఫార్సు కూడా చేసింది.

06/25/2017 - 03:31

విశాఖపట్నం, (జగదాంబ) జూన్ 24: రాష్ట్రంలో భూకుంభకోణాలకు పాల్పడిన ప్రతిఒక్కరిపై కేసులు పెట్టి జైలుకు పంపుతామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విశాఖ జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.

06/25/2017 - 03:29

విశాఖపట్నం, జూన్ 24: ఛత్తీస్‌గడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ తెలంగాణ, దక్షిణ కోస్తా మీదుగాను, దీన్ని ఆనుకుని ఉన్న పరిసరాల్లోనూ అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి చెదురు, మదురు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

Pages