S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

06/24/2017 - 02:28

విజయవాడ, జూన్ 23: సాంఘిక, గిరిజన, సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు వారికి పౌష్టికాహారం అందించేందుకు త్వరలో డైట్ ఛార్జీలను పెంచనున్నట్లు సాంఘిక గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనంద్ బాబు వెల్లడించారు. విజయవాడలోని ఒక హోటల్‌లో 16వ నోడల్ ఏజెన్సీల సమావేశాన్ని మంత్రి నక్కా ఆనంద్ బాబు శుక్రవారం నిర్వహించారు.

06/24/2017 - 02:27

అమరావతి, జూన్ 23: మూడురోజుల పాటు ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేసిన ఉపాధ్యాయుల బదిలీ మార్గదర్శకాల వ్యవహారంలో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఇద్దరు ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. మూడురోజుల నుంచి ఉపాధ్యాయులు కీలకమైన డిమాండ్లతో రోడ్డెక్కిన వైనం ప్రభుత్వానికి చెమటలు పట్టించింది.

06/24/2017 - 02:22

విజయవాడ (క్రైం), జూన్ 23: పాస్‌పోర్టుల జారీలో కీలకమైన వెరిఫికేషన్ సేవల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం అత్యున్నత సేవలు అందించినందుకు కేంద్ర పురస్కారం దక్కింది. దేశంలోనే ఏపి పోలీసు అగ్రగామిగా నిలిచింది.

06/24/2017 - 00:13

విజయవాడ, జూన్ 23: తెల్ల రేషన్ కార్డునే ఆదాయ ధ్రువీకరణ పత్రంగా ఇకపై వ్యవహరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పాఠశాలల్లో ప్రవేశం, ఫీజు రీ-యింబర్సుమెంట్, ఉపకార వేతనాలు, వివిధ కార్పొరేషన్ల నుంచి రుణం, వివిధ ప్రభుత్వ పథకాలు పొందేందుకు ఆదాయ ధ్రువీకరణ పత్రాలను దాఖలు చేయాల్సి వస్తున్నది.

06/24/2017 - 00:13

విజయవాడ, జూన్ 23: వివిధ వైద్య కళాశాలల్లో పీజీ మెడికల్ సీట్లను కన్వీనర్ కోటా కింద పొందిన విద్యార్థులు ఏడాది పాటు ప్రభుత్వ వైద్య సంస్థల్లో తప్పనిసరిగా పని చేయాల్సి ఉంటుంది. ఈమేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

06/24/2017 - 00:11

విజయవాడ (క్రైం), జూన్ 23: గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల జిఎస్‌టి కమిషనర్‌గా సీనియర్ ఐఆర్‌ఎస్ అధికారి ఎం శ్రీహరిరావు నియమితులయ్యారు. ఈమేరకు శుక్రవారం గుంటూరులోని జిఎస్‌టి పన్ను చెల్లింపు సర్వీస్ కమిషనరేట్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఈయన చెన్నై సర్వీస్ టాక్స్ అప్పీల్స్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తూ బదిలీ అయ్యారు. 1991 సివిల్ సర్వీసెస్ బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి.

06/24/2017 - 00:10

విజయవాడ (కార్పొరేషన్), జూన్ 23: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం మరో అవార్డు సొంతం చేసుకొంది. సహజ సిద్దమైన ప్రకృతి వాతావరణానికి ఎటువంటి విఘాతం కలిగించకుండా పర్యావరణ అనుకూల భవంతుల నిర్మాణాలు చేపట్టిన విషయంపై ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజిబిసి) తన ప్రతిష్టాత్మక అవార్డును ప్రకటించింది.

06/24/2017 - 00:10

విజయవాడ, జూన్ 23: అమరావతిని స్మార్ట్ సిటీగా ఎంపిక చేయడం పట్ల భారతీయ జనతాపార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. స్మార్ట్ సిటీగా అమరావతిని ఎంపిక చేయడంతో ఈ నగరాన్ని రూ.1000 కోట్లతో అభివృద్ధి చేసే అవకాశం లభిస్తుందన్నారు. దీనివల్ల అమరావతి శోభాయమానంగా వెలుగొందే అవకాశం లభించిందన్నారు.

06/24/2017 - 00:09

విజయవాడ, జూన్ 23: వివిధ సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలుచేస్తూ వాటి ఫలితాలు అర్హులైన వారందరికీ అందేలా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను బలోపేతం చేస్తానని శుక్రవారం గొల్లపూడిలోని సంస్థ కార్యాలయంలో చైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన వేమూరి ఆనందసూర్య అన్నారు. అతి సామాన్య నిరుపేద బ్రాహ్మణుల అర్చకుల సంక్షేమం, అభ్యున్నతి కోసం పాటుపడతానన్నారు.

06/24/2017 - 00:09

విజయవాడ, జూన్ 23: ఏపిఎస్‌ఆర్‌టిసి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు యాజమాన్యం కేవలం బస్ సర్వీస్‌లపైనే కాకుండా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిస్తోంది. ప్రధానంగా కొరియర్ పార్శిల్ విభాగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నది.

Pages