S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/11/2017 - 00:53

అమరావతి, మే 10: ఇప్పటివరకూ మిత్రపక్షాలయిన తెలుగుదేశం-్భరతీయ జనతా పార్టీ మధ్య జరుగుతున్న అంతర్గత కలహాలు జగన్ పుణ్యాన ఇకపై బహిరంగమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీని జగన్ కలవకుండా ఇప్పటివరకూ అడ్డుకోవడంలో విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ ఆశలు, బుధవారం నాడు ఆవిరయిపోయిన వైనం రాష్ట్రంలో సరికొత్త రాజకీయ సమీకరణకు తెరలేపినట్టయింది.

05/11/2017 - 00:52

ఖమ్మం, మే 10: రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బిజెపినేనని, వ్యాపారుల పక్షం ఉంటూ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న అధికార టిఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ అన్నారు.

05/11/2017 - 00:52

విజయవాడ, మే 10: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రోద్బలంతో భారతదేశంలో హిందూ మతతత్వ వాదం అన్నిటా పెట్రేగి పోతున్నదని ఇందులో భాగంగా ఒక దేశం- ఒక మతం , ఒక దేశం - ఒక భాష, ఒక దేశం - ఒకే పార్టీ అనే నినాదాల సంఘ్ పరివార శక్తులు రకరకాలుగా ఉన్మాదంతో ముందుకు సాగుతున్నాయంటూ సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు.

05/11/2017 - 00:51

విజయవాడ, మే 10: రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఫలితంగా అనావృష్టితో రైతులు కరవు సాయం కోసం రోడ్డెక్కుతుంటే, మరోవైపు ఎన్నో వ్యయ ప్రయాసలతో ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారంటూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ధ్వజమెత్తారు.

05/11/2017 - 00:51

విజయవాడ (క్రైం), మే 10: ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. బాబు భద్రతకు సంబంధించి నిఘా వర్గాలు ఢిల్లీలోని ఏపి భవన్ రెసిడెంట్ కమిషనర్‌కు తాజా హెచ్చరికలు జారీ చేశాయి. ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు అక్కడి పోలీసుల ఆదేశాలు పక్కన పెట్టి స్వంతంగా సూచించిన మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారని, దీనివల్ల ఆయన ప్రాణానికి ముప్పు ఏర్పడితే తమకు సంబంధం లేదంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.

05/10/2017 - 08:14

విజయవాడ, మే 9: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు అమెరికాలో అరుదైన గౌరవం, గుర్తింపు లభించాయి. భారత్-యూఎస్ భాగస్వామ్యానికి రాష్ట్ర స్థాయిలో కృషి చేస్తున్నందుకు గాను 2017 సంవత్సరానికి యునైటెడ్ స్టేట్స్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్‌ఐబిసి) చంద్రబాబుకు ‘ట్రాన్స్‌ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్’ పురస్కారం ప్రకటించింది.

05/10/2017 - 08:13

కాకినాడ, మే 9: కోనసీమ మీదుగా ఉభయ గోదావరి జిల్లాలను ఏకం చేసే కోటిపల్లి-నర్సాపూర్ రైల్వే లైన్ నిర్మాణం పనులకు సంబంధించి రెవెన్యూ, రైల్వే అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేసి, రైల్వే లైన్ నిర్మాణం పనులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

05/10/2017 - 07:40

విజయవాడ, మే 9: రైల్వే అధికారులు ఎంతో వపర్‌ఫుల్.. పార్లమెంట్ సభ్యులు కాదుకదా ముఖ్యమంత్రి, రైల్వే మంత్రి చివరకు ప్రధాన మంత్రి చెప్పినా వారు బేఖాతరు చేస్తున్నారని నర్సరావుపేట ఎంపి రాయపాటి సాంబశివరావు అధికారులపై విరుచుపడ్డారు.

05/10/2017 - 07:34

విజయవాడ, మే 9: రాష్ట్రంలో ఉన్న పెట్రోలు బంకుల్లో నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అధునాతన చిప్స్ ఏర్పాటు చేసి, మోసాలకు పాల్పడుతున్నారని ర్టా పౌరసరఫరాల మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. అయితే అధికారుల దాడుల్లో పెట్రోల్ బంకుల అక్రమాలు బయటపడితే వాటి లైసెన్స్‌ను రద్దు చేయిస్తామని హెచ్చరించారు.

05/10/2017 - 07:33

విజయవాడ, మే 9: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల ఆధీనంలోని గోశాలలకు చెందిన ఎద్దులను విక్రయించడాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్కృతంలో గోవు అంటే ఆవు, ఎద్దు రెండూ అని, ఆవును కామధేనువుగా, ఎద్దును నందీశ్వరునిగా పూజిస్తారని ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Pages