S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/03/2017 - 00:58

విశాఖపట్నం, మే 2: రాష్ట్రంలో సిమెంట్ ధరలను మంత్రుల బృందమే దగ్గరుండి పెంచిందన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అకారణంగా సిమెంట్ ధరలను పెంచడాన్ని విపక్షాలు తీవ్రంగా దుయ్యబడుతున్నాయి. నిర్మాణ రంగ సంస్థలు ఈ ధరల పెంపును నిరసిస్తూ, సిమెంట్ కొనుగోళ్లను నిలిపివేయాలన్న ఆలోచన చేస్తున్నాయి. అసెంబ్లీలో బిజెపి ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు ధరల పెంపుపై తీవ్రంగా ధ్వజమెత్తారు.

05/03/2017 - 00:57

అనంతపురం సిటీ, మే 2: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం ఎపి ఈ-సెట్ ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఇందుకోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని హైదరాబాద్‌లో సైతం ఎపి ఈ-సెట్ 2017 సెంటర్లు ఏర్పాటుచేశారు. ఆన్‌లైన్‌లో 136 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు పరీక్ష నిర్వహిస్తారు.

05/03/2017 - 00:57

చిత్తూరు, మే 2: కుప్పం సిఐ వేధింపుల తాళలేక మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నాకి పాల్పడిన సంఘటన మంగళవారం చిత్తూరులో చోటు చేసుకుంది. కుప్పం పిఎస్‌లో పని చేస్తున్న మహిళా కానిస్టేబుల్ నిర్మల చిత్తూరు మహిళా స్టేషన్ సమీపంలో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం పోలీసు వర్గాల్లో కలకం సృష్టించింది. నిర్మల రెండేళ్లుగా విధులు నిర్వహిస్తున్నారు.

05/03/2017 - 00:56

నాగార్జున సాగర్, మే 2: నాగార్జునసాగర్ డ్యాం కుడి కాలువ నీటి విడుదల నిలిపివేతపై రెండు తెలుగు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదం పరస్పరం పోలీస్ స్టేషన్లలో కేసుల నమోదుకు దారితీసింది. తొలుత ఆంధ్ర ఇంజనీర్లు డ్యాం భద్రత విభాగానికి చెందిన ఎస్‌పిఎఫ్ ఆర్‌ఐ సురేష్‌పై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆంధ్ర పరిధిలోని విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదు చేశారు.

05/02/2017 - 04:12

నెల్లూరుసిటీ, మే 1: నెల్లూరు కార్పొరేషన్‌లో విలీనమైన శివారు గ్రామాలు, కాలనీలలో సమస్యలు తిష్టవేశాయని వాటి పరిష్కారం కోసం ఎంతవరకైనా పోరాటం చేస్తానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి తెలిపారు. నెల్లూరు కమిషనర్ డిల్లీరావుకు ఇచ్చిన 42 గంటల గడువు పూర్తి కావడంతో రూరల్ ఎమ్మెల్యే కమిషనర్ ఛాంబర్ ముందు నిరసన ప్రదర్శనకు దిగారు. వైసీపీ నేతలతో కలిసి గాంధీగిరి ప్రారంభించారు.

05/02/2017 - 04:09

రాజమహేంద్రవరం, మే 1: ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. వివరాల్లోకి వెళితే... సోమవారం మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రంగా ఉండగా, సాయంత్రానికి ఒక్కసారిగా పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచాయి. కొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై, భారీ వర్షం కురిసింది.

05/02/2017 - 04:08

హైదరాబాద్, మే 1: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయేషామీరా తల్లిదండ్రులకు న్యాయం చేయాలని, ఆయేషా హత్యకేసులో నిర్దోషిగా విడుదలైన సత్యం బాబు కోరారు. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేఖరులతో మాట్లాడుతూ నిర్భయ కేసులో ఎలాంటి న్యాయం జరిగిందో ఆయేషా కుటుంబానికి అలాంటి న్యాయమే జరగాలని అతడు తెలిపాడు. ఈ కేసులో మొదటి నుంచి తాను నిర్దోషినేనని చెబుతూ వచ్చానని, చివరికి న్యాయమే గెలిచింని చెప్పాడు.

05/02/2017 - 04:06

విశాఖపట్నం, ఏప్రిల్ 1: రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు 10 స్పోర్ట్స్ అకాడెమీలను ఏర్పాటు చేస్తున్నట్టు క్రీడలు, యువజన శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఊర్జా 2017, సిపిఎఫ్ ఫుట్‌బాల్ టాలెంట్ హంట్ టోర్నమెంట్ అండర్ 19 పోటీలను విశాఖలో సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

05/02/2017 - 04:04

అమరావతి, మే 1: తెలుగుదేశం పార్టీలో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) చైర్మన్ వ్యవహారం చిచ్చురేపుతోంది. చైర్మన్ పదవి తనకే ఇవ్వాలని, దానికోసం అవసరమైతే తన ఎంపి పదవికి రాజీనామా చేసేందుకైనా సిద్ధమంటూ నర్సరావుపేట లోక్‌సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావు నేరుగా ముఖ్యమంత్రికి రాసిన లేఖ కలకలం రేపుతోంది.

05/02/2017 - 04:00

విజయవాడ, మే 1: ప్రస్తుత వేసవికాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపధ్యంలో రాష్టవ్య్రాప్తంగా సిటీ, పల్లె వెలుగు బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఉపశమనం కల్గించే దిశగా ఎపిఎస్‌ఆర్‌టిసి వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ ఎం మాలకొండయ్యతో ఆర్‌టిసి చరిత్రలోనే తొలిసారిగా వినూత్న చర్యలు చేపట్టారు.

Pages