-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
విశాఖపట్నం, మే 1: రెండు సంవత్సరాలకోసారి టిడిపి మే 27,28,29 తేదీల్లో నిర్వహించుకునే పండుగ మహానాడు ఎక్కడ నిర్వహించాలన్న దానిపై స్పష్టత చేకూరింది. ఈ సారి టిడిపి మహానాడు విశాఖలో నిర్వహించాలని ఇప్పటికే నిర్ణయించినప్పటికీ వేదిక ఎంపిక విషయంలో తర్జన భర్జన కొనసాగుతూ వచ్చింది.
విజయవాడ, మే 1: ప్రతి కార్మికుడికి ఆత్మ గౌరవం ఉంటుందని దాన్ని యాజమాన్యాలు గుర్తెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తలను తమ ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదరించి ప్రోత్సహిస్తుందన్నారు. రాష్ట్రంలో నేనే ఒక కార్మికుడినని ఏదైనా సన్మానం చేయవలసి వస్తే ముందుగా తనకే సన్మానం చేయవలసి ఉంటుందని, రాత్రింబవళ్లు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు.
అమరావతి, మే 1: కియా మోటార్స్ కార్ల పరిశ్రమతో కరవు జిల్లా అనంతపురం రూపురేఖలే పూర్తిగా మారిపోనున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోస్యం చెప్పారు. ఆటోమోటివ్ రంగంలో అతి పెద్ద సంస్థగా ఉన్న కియా మోటార్స్ ఏపీకి రావడం ఒక చరిత్రాత్మక అంశంగా పేర్కొన్నారు. 13వేల కోట్ల పెట్టుబడి, 11వేల మందికి ఉద్యోగావకాశాలు దక్కనున్నాయని చెప్పారు.
విజయవాడ (కార్పొరేషన్), మే 1: ఎపి సిఆర్డిఏ, రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాకీ అసోసియేట్స్ చేసిన అసత్య ప్రచారాలపై తీవ్రంగా స్పందించిన సిఆర్డిఏ ఆ సంస్థకు లీగల్ నోటీసు జారీ చేసింది. సోమవారం ఆ సంస్థతో పాటు సంస్థ అధిపతి పుమిహికో మాకీలకు వేరువేరుగా లీగల్ నోటీసులు పంపినట్టు సిఆర్డిఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
విజయవాడ, మే 1: కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. కార్మిక దినోత్సవం సందర్భంగా మీడియాతో సోమవారం మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. అసంఘటిత కార్మిక కుటుంబాల సంక్షేమం కోసం చంద్రన్న బీమా పథకాన్ని తీసుకువచ్చామని తెలిపారు.
విజయవాడ (క్రైం), మే 1: కార్మిక పక్షపాతి తెలుగుదేశం ప్రభుత్వమని రాష్ట్ర కార్మిక శాఖామంత్రి పితాని సత్యనారాయణ ఉద్ఘాటించారు. టిడిపి అనుబంధ టిఎన్టియుసికి నేడు పటిష్ట నాయకత్వం ఉందన్నారు. సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికుల సంక్షేమ కార్యక్రమాలతోపాటు చంద్రన్న భీమా పథకం కింద నేడు రాష్ట్రంలో సమర్థవంతంగా అమలవుతోందని చెప్పారు.
విజయవాడ, మే 1:రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పోలవరం ప్రాజెక్టుకు 250 రూపాయల చొప్పున, సాధారణ ప్రజలకు 310 రూపాయల చొప్పున సిమెంట్ బస్తాలను సరఫరా చేసేందుకు సిమెంట్ కంపెనీలు అంగీకరించాయి. రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, కామినేని శ్రీనివాస్ సభ్యులుగా ఉన్న మంత్రివర్గ ఉపసంఘం సోమవారం వివిధ సిమెంట్ తయారీ కంపెనీల ప్రతినిధులతో చర్చించింది.
విజయవాడ (రైల్వేస్టేషన్), మే 1: దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ మీద నడిచే రైళ్లలో రెండు ఎక్స్ప్రెస్ రైళ్లకు అదనంగా కొన్ని హాల్ట్లు కల్పిస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసిందని చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఎం ఉమాశంకర్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైలు నెంబరు 22663 చెన్నై- ఎగ్మూర్ నుంచి జోద్పూర్ వెళ్లే సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒంగోలు స్టేషన్లో నిమిషం పాటు ఆగుతుందని తెలిపారు.
కాకినాడ, మే 1: ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయపరంగా అగ్రస్థానంలో ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో సూక్ష్మ సేద్యం (మైక్రో ఇరిగేషన్), బిందు సేద్యాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోంది. వ్యవసాయ ఉద్యానవన పంటల అభివృద్ధి, అధిక ఉత్పత్తి సాధన కోసం 2003 నవంబరులో మైక్రో ఇరిగేషన్ పథకాన్ని అప్పటి ప్రభుత్వం ప్రారంభించింది.
కడప, మే 1: పసుపు, మిర్చి రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఓ పక్క పంటకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పరిహారం చెల్లిస్తుంటే మరోపక్క వైఎస్ జగన్మోహన్రెడ్డి దొంగదీక్షలు చేస్తూ రైతులను రెచ్చగొడుతున్నారని మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, సి.ఆదినారాయణరెడ్డి విమర్శించారు. సోమవారం కడపలో విలేఖరులతో మాట్లాడుతూ సిమెంటు ధర పెంపుపై జగన్ దీక్ష చేస్తే బాగుంటుందన్నారు.