S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/02/2017 - 00:12

అమరావతి, మే 1: రానున్న ఎన్నికల్లో మెజారిటీ పార్లమెంటు, దానితోపాటు అధిక సంఖ్యలో శాసనసభ స్థానాలు సాధించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభించిన లోక్‌సభ నియోజకవర్గ ఇన్చార్జిల వ్యవస్థ మంత్రులను పరుగులు పెట్టిస్తోంది.

05/02/2017 - 00:12

విజయవాడ, మే 1: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అవినీతిపై యుద్ధానికి సిద్ధమయ్యారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఉన్నతస్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. తమ ప్రభుత్వంలో అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమన్నారు. అవినీతిని అదుపులో ఉంచాలని.. ఇందుకోసం స్పెషల్ కోర్ట్స్ యాక్ట్‌ను రూపొందించాలన్నారు.

05/01/2017 - 03:42

నూజెండ్ల, ఏప్రిల్ 30: అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే జంక్షన్ భూసేకరణ సర్వేను ఆదివారం గుంటూరు జిల్లా నూజెండ్ల మండల రైతులు అడ్డుకున్నారు. నూజెండ్లలోని జెమిని పాల కేంద్రం సమీపంలో ఎక్స్‌ప్రెస్ హైవే అధికారుల బృందం భూములు సర్వే చేస్తున్నారనే సమాచారంతో సుమారు 200 మంది రైతులు అక్కడికి చేరుకున్నారు. వెంటనే సర్వే ఆపాలని అధికారుల బృందానికి హెచ్చరికలు చేశారు.

05/01/2017 - 03:40

అనంతపురం కల్చరల్, ఏప్రిల్ 30 : వేమన సాహిత్యం తెలుగు ప్రజలకు తరగని సంపద అని, తెలుగు జాతికి కీర్తి, స్ఫూర్తినింపిన కవియుగ చక్రవర్తి వేమన అని ప్రముఖ సాహితీ విమర్శకులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత రాచపాళెం చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలో ఆదివారం సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ‘ప్రజాకవి వేమన సాహితీ సమాలోచన సదస్సు’ నిర్వహించారు.

05/01/2017 - 03:38

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 30: సాంస్కృతిక ప్రాచీన ప్రాశస్థ్యం కలిగిన చారిత్రక రాజమహేంద్రవరం గోదావరి తీరం కళాకారులతో కోలాహలంగా మారింది. రాజమహేంద్రవరం శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో ఆదివారం కందుకూరి నాటక రంగస్థల పురస్కారాలు, ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం, నంది నాటకోత్సవ బహుమతుల ప్రదానోత్సవంగా వైభవంగా జరిగింది.

05/01/2017 - 03:10

గుంటూరు (కల్చరల్), ఏప్రిల్ 30: పిన్న వయస్సులోనే తన తపో, ధ్యాన, జ్ఞానశక్తిని సమస్త మానవాళి కోసం ధారపోసి, ఆసేతు హిమాచల పర్యంతం కాలినడకన రెండు పర్యాయాలకు పైగా పర్యటించిన జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్య అద్వైత సిద్ధాంతం మన ప్రాచీన హైందవ సనాతన ధర్మానికి దేదీప్యమానంగా వెలిగే దీపస్తంభమని విశాఖ శారదా పీఠం అధిపతి స్వరూపానందేంద్ర సరస్వతీస్వామి శ్లాఘించారు.

05/01/2017 - 03:06

విజయవాడ, ఏప్రిల్ 30: అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మిక లోకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శ్రమ జీవుల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని సిఎం గుర్తుచేశారు. శ్రమ సంస్కృతిని ప్రతి ఒక్కరు గౌరవించాలని, కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా మార్చడానికి తను శ్రమనే నమ్ముకున్నానని తెలిపారు.

05/01/2017 - 03:05

గుంటూరు, ఏప్రిల్ 30: ఒకపక్క కరవుతో అల్లాడుతూ, మరోపక్క గిట్టుబాటు ధరలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వారి సమస్యలను గాలికొదిలేసి మందీమార్బలాన్ని వెంటేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలు చేయటం ఎంతవరకు సమంజసమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆక్షేపించారు.

05/01/2017 - 03:04

అమరావతి, ఏప్రిల్ 30: ప్రభుత్వంలో ఐదుగురు సీనియర్ మంత్రులు ఉన్నప్పటికీ యువనేత లోకేష్ నెంబర్-టూగా రూపాంతరం చెందుతున్నారు. వివిధ శాఖలతో ముడిపడిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ చినబాబును తెలంగాణ మంత్రి కెటిఆర్ మాదిరిగా ఆ స్థానానికి చేర్చేందుకు దోహదపడుతోంది. మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత లోకేష్ ఇప్పటివరకూ వరుసగా నిర్వహిస్తున్న సమీక్షల వివరాలేమీ బయటకు రావడం లేదు.

05/01/2017 - 02:37

విశాఖపట్నం, ఏప్రిల్ 30: విశాఖపట్నం బీచ్‌రోడ్డులో ఆదివారం రాత్రి జరిగిన ఘోర ప్రమాదంలో ప్రముఖ రచయిత దూసి ధర్మారావు దుర్మరణం చెందారు. ఆర్కే బీచ్‌లో ఆదివారం సాయంత్రం ఓ ప్రైవేట్ పాఠశాల బస్సు బ్రేకులు ఫెయిలయ్యాయి. నొవాటెల్ హోటల్ వైపు నుంచి బీచ్ రోడ్డుకు వస్తున్న బస్సు ఒక్కసారిగా బీచ్‌రోడ్‌పై ఉన్న సందర్శకులపైకి దూసుకెళ్లింది.

Pages