S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/01/2017 - 02:23

కాకినాడ, ఏప్రిల్ 30: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో అన్ని రకాల నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తుందని, పార్టీని నమ్ముకుని పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యత లభిస్తుందని ఎపి టిడిపి అధ్యక్షుడు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి కిమిడి కళా వెంకట్రావు తెలియజేశారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలోని రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఆదివారం కళా వెంకట్రావు విలేఖరులతో మాట్లాడారు.

05/01/2017 - 02:21

విజయనగరం, ఏప్రిల్ 30: పట్టణంలోని రెండు రైల్వే వంతెన పనులకు ఆమోదం లభించడంతో ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతిరాజు అన్నారు.

05/01/2017 - 02:19

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 30: రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలులో శిక్ష అనుభవిస్తున్న ఎస్‌కె సుభానీ అనే ఖైదీకి డిగ్రీలో బంగారు పతకం లభించింది. గుంటూ రు జిల్లా క్రోసూరుకు చెందిన సుభానీ ఐదేళ్ల క్రితం రాజమహేంద్రవరం సెంట్రల్‌జైలుకు వచ్చాడు. జైలుకు వచ్చిన తరువాత విద్యపై దృష్టిసారించిన సుభానీ జైలులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్శిటీ దూర విద్య అధ్యయన కేంద్రం ద్వారా డిగ్రీలో చేరాడు.

05/01/2017 - 02:13

అనంతపురం, ఏప్రిల్ 30 : రాష్ట్ర రాజకీయాల్లో తానంటూ ఒకడిని ఉన్నానంటూ, తన ఉనికిని చాటుకునేందుకే వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దీక్షలు చేస్తుంటారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

04/30/2017 - 22:56

గుంటూరు, ఏప్రిల్ 30: రాష్ట్ర రాజకీయం ప్రస్తుతం రైతుల చుట్టూ పరిభ్రమిస్తోంది. గిట్టుబాటు ధర కోసం రెండు నెలలుగా ఉద్యమించి మద్దతు ధర సాధించుకున్న మిర్చి రైతులకు ఇంకా చేదు అనుభవాలే ఎదురవుతున్నాయి.

04/30/2017 - 22:54

విజయవాడ, ఏప్రిల్ 39: నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నగదు బహుమతులను ప్రకటించిన ఆశించిన మేరకు నగదు రహిత లావాదేవీలు పుంజుకోవడం లేదు. చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్‌ను నగదు రహితంగా పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి పదే పదే చెబుతున్నప్పటికీ, కార్డుదారుల నుంచి స్పందన అంతగా లభించడం లేదు.

04/30/2017 - 22:54

విజయవాడ (కార్పొరేషన్), ఏప్రిల్ 30: నవ్యాంధ్ర రాజధాని అమరావతి డిజైన్ల పై మాకీ అండ్ అసోసియేట్స్ సంస్థ చేసిన ఆరోపణలు అవాస్తవమని, సిఆర్‌డిఎ పై నిరాధార ఆరోపణలు చేసిన ఆ సంస్థపై న్యాయపరమైన చర్యలు తీసుకొనేందుకు కసరత్తు చేస్తున్నట్టు ఎపిసిఆర్‌డిఎ పేర్కొంది.

04/30/2017 - 22:53

గుంటూరు, ఏప్రిల్ 30: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రైతుదీక్ష పేరుతో మరోసారి డ్రామాలాడుతున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు.

04/30/2017 - 22:52

అమరావతి, ఏప్రిల్ 30: ఎనర్జీలో నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతి నంబర్ వన్ స్థానంలో నిలవాలని రాజధాని ప్రాంత నగరాభివృద్ధి సంస్థ (సిఆర్‌డిఏ)ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. నగర నిర్మాణంలో ‘గ్రీన్ ఎనర్జీ’ అంతర్భాగంగా ఉండేలా ప్రతి భవనం ఉండాలని, ఇలాంటి విధానానికి రూపకల్పన చేయాలని సూచించారు.

04/30/2017 - 09:12

సింహాచలం, ఏప్రిల్ 29: వైశాఖ శుద్ధ తదియ పర్వదినం సందర్భంగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి వారి నిజరూప దర్శనం (చందనయాత్ర) శనివారం కన్నుల పండువగా జరిగింది. వరాహ వదనం, మానవ శరీరం, సింహవాలంతో విలక్షణ మూర్తిగా దర్శనమిచ్చిన వరాహ లక్ష్మీ నారసింహుని కనులారా వీక్షించిన భక్తులు ఆనందంతో పరవశించిపోయారు.

Pages