S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/30/2017 - 06:23

హైదరాబాద్, ఏప్రిల్ 29: సుప్రీం కోర్టు పోలీసు సంస్కరణలపై జారీ చేసిన మార్గదర్శకాలకు లోబడి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు తక్షణమే రాష్ట్ర సెక్యూరిటీ కమిషన్, పోలీసు కంప్లైంట్స్ అథారిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. వచ్చే మూడు నెలల్లో ఆదేశాలను అమలు చేయాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ రామలింగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు.

04/30/2017 - 06:16

అమరావతి, ఏప్రిల్ 29: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇప్పటివరకూ జరిపిన విదేశీ పర్యటనలకు, మేలో జరపతలపెట్టిన అమెరికా పర్యటన భిన్నంగా ఉండబోతోంది. ప్రపంచశ్రేణి దిగ్గజ సంస్థల అధిపతులతో ఆయన భేటీ కాబోతున్న నేపథ్యంలో, అనూహ్య ఫలితాలు సాధిస్తారన్న అంచనా వ్యక్తమవుతోంది. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ మీటింగుల ద్వారా అనేకమంది ప్రముఖులతో బాబు బృందం భేటీ కానుంది.

04/30/2017 - 06:14

అమరావతి, ఏప్రిల్ 29: కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంపిక వ్యవహారంపై సస్పెన్స్ మరికొంతకాలం కొనసాగేలా ఉంది. శనివారం రెండు విడతలుగా భూమా, శిల్పా వర్గాలతో భేటీ అయిన నాయకత్వం, ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. అప్పటివరకూ వారి మధ్య ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయాలని నిర్ణయించింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం..

04/30/2017 - 06:12

కిడ్నాప్, హత్య ఆరోపణల నిరూపణ
ఖరారు చేసిన పెన్సిల్వేనియా కోర్టు

04/30/2017 - 06:10

బదిలీ చేసేందుకు సిద్ధమన్న సిఎం జూన్ నాటికి అందరికీ గ్యాస్ కనెక్షన్లు
తొలి ఒడిఎఫ్ జిల్లాగా పశ్చిమగోదావరి అవినీతిని సహించేది లేదని హెచ్చరిక

04/30/2017 - 06:09

తాడేపల్లిగూడెం: అవినీతి రహిత పాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతవరం జిల్లా పరిషత్ హైస్కూలులో శనివారం ఏర్పాటుచేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గ్రామంలో ఏర్పాటుచేసిన సౌకర్యాలను ప్రస్తావించిన ముఖ్యమంత్రి తమ పాలనపై ఎంతమంది సంతృప్తిగా ఉన్నారో చేతులెత్తాలని కోరారు.

04/29/2017 - 04:11

అనంతపురం/గుత్తి/గుంతకల్లు, ఏప్రిల్ 28: తెల్లారితే శనివారం.. పవిత్రమైన రోజు.. గ్రామంలో నిర్మించిన శ్రీరాముడి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠ.. ఆలయ నిర్వాహకులు భక్తిశ్రద్ధలతో అన్ని ఏర్పాట్లు చేశారు. గ్రామంలో చాలా రోజుల నుంచి ఉత్సవ కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. ఇంటింటా భక్తిప్రపత్తులతో సంబరాలకు సిద్ధమయ్యారు. గ్రామంలో సందడి నెలకొంది.

04/29/2017 - 04:10

విజయవాడ, ఏప్రిల్ 28: రాష్ట్రంలో ఇసుక అక్రమార్కులపై ఉక్కుపాదం మోపుతామని రాష్ట్ర గనుల శాఖ మంత్రి సుజయ కృష్ణ రంగారావు స్పష్టం చేశారు. ఇసుక మాఫియా కట్టడిపై, ఇసుక విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మంత్రివర్గ ఉప సంఘం వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సమావేశమైంది.

04/29/2017 - 04:08

విశాఖపట్నం, ఏప్రిల్ 28: ఆంధ్రా మెడికల్ కళాశాల్లోని పరిపాలనా విభాగం సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డి.్భస్కరకుమార్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణపై ఏసిబి అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. సుమారు 90 లక్షల రూపాలు అక్రమాస్తులు వెలుగు చూశాయని, వీటి మార్కెట్ విలువ సుమారు మూడు కోట్ల రూపాయలు ఉంటుందని ఏసిబి డిఎస్పీ రామకృష్ణ ప్రసాద్ తెలిపారు.

04/29/2017 - 04:06

విజయవాడ, ఏప్రిల్ 28: రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై ఉన్న 1130 బ్లాక్ జోన్స్‌ను గుర్తించి నెల రోజుల్లో సరిచేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో రహదారి భద్రతపై శుక్రవారం ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ బ్లాక్ జోన్స్ వద్ద అసలు సమస్య ఏమిటో గుర్తించి సత్వరమే సరి చేయాలన్నారు. పోలీస్, రవాణా శాఖలు సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించాలన్నారు.

Pages