S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/29/2017 - 04:05

విశాఖపట్నం, ఏప్రిల్ 28: ఆపరేషన్ ఆకర్ష్.. కొంత కాలంగా రాష్ట్ర రాజకీయ పార్టీల్లో వాడుకలో ఉన్న పదం. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలను, నాయకులను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత అదే కాంగ్రెస్ వారిని, వైకాపా వారిని తన గూటిలోకి చేర్చుకున్నారు. ఇప్పుడు బిజెపి ఈ ఆపరేషన్‌ను ప్రారంభించనుందా? దీనికి ఔననే సమాధానం వస్తోంది.

04/29/2017 - 04:05

విజయవాడ, ఏప్రిల్ 28: రాష్ట్రంలోని పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు ఆయా నియోజకవర్గాల్లో పర్యటించి రాజకీయ స్థితిగతులు, ప్రజల సమస్యలపై నివేదిక రూపొందించాలని ఆదేశించారు.

04/29/2017 - 04:04

కాకినాడ, ఏప్రిల్ 28: ఎపి ఎంసెట్-2017 అగ్రికల్చర్, మెడిసిన్ పరీక్షలు శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు, మధ్యాహ్నం 2.30నుండి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు నిర్వహించారు. 80వేల 843 మంది అభ్యర్ధులు ఈ పరీక్షలకు హాజరు కావల్సి ఉండగా, 75వేల 381 మంది హాజరయ్యారు. 5462 మంది గైర్హాజరు కాగా 93.24 శాతం హాజరు లభించింది.

04/29/2017 - 04:04

విశాఖపట్నం, ఏప్రిల్ 28: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం(చందనోత్సవం)లో విఐపి టిక్కెట్ల జారీ వివాదాలకు దారితీసింది. టిక్కెట్ల జారీలో ఎమ్మెల్యేలు దేవస్థానం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చందనోత్సవానికి విఐపి టిక్కెట్ల జారీకి దేవస్థానం నిర్ణయించింది.

04/29/2017 - 04:03

విజయవాడ, ఏప్రిల్ 28: ఇసుక మాఫియా రోజురోజుకు రెచ్చిపోతోందని, అన్ని నదులను మాఫియా తవ్వేస్తోందని కేంద్ర మాజీ మంత్రి, బిజెపి మహిళా మోర్చా ఇన్‌ఛార్జ్ పురంధ్రీశ్వరి అన్నారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఓవైపు ఉచిత ఇసుక అంటున్నారని, మరోవైపు లారీలతో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. చిత్తూరు జిల్లా ఏర్పేడు ఘటనలో 16 మంది మృతి చెందడం బాధాకరమన్నారు.

04/29/2017 - 04:03

విజయవాడ, ఏప్రిల్ 28: రాష్ట్రంలో సిండికేట్‌గా మారిన కార్పొరేట్ కళాశాలల పోటీని ఎదుర్కొంటూ సామాన్య, మధ్యతరగతి వర్గాలకు విద్యను అందుబాటులో ఉంచుతున్న ప్రైవేట్ జూనియర్ కళాశాలలను దెబ్బతీసే విధంగా వచ్చే విద్యా సంవత్సరానికి అనూహ్యరీతిలో అన్ని రకాల ఫీజులను ఒకేసారి మూడురెట్లు పైగా పెంచడం పట్ల శుక్రవారం నాడిక్కడ జరిగిన అనుబంధ జూనియర్ కళాశాలల యాజమాన్యాల సంఘం విస్తృత సమావేశం ఆగ్రహం వ్యక్తం చేసింది.

04/29/2017 - 03:52

విజయవాడ, ఏప్రిల్ 28: ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను మరింతగా ప్రజలలోకి తీసుకువెళ్లి, ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో సమాచార శాఖ కీలకమైన బాధ్యతలను నిర్వర్తించాల్సి వుందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలువ శ్రీనివాసులు చెప్పారు.

04/29/2017 - 03:49

విజయవాడ, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి), ప్రభుత్వ ఎక్స్‌అఫీషియో కార్యదర్శిగా కాంతిలాల్ దండే శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. స్థానిక ఎనికేపాడులోని ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ రంగంలో ప్రభుత్వ ప్రాధాన్యత, ఇళ్ల నిర్మాణాలకు అనుగుణంగా పని చేస్తానని ఆయన తెలిపారు.

04/29/2017 - 03:53

విజయవాడ(బెంజిసర్కిల్), ఏప్రిల్ 28: ఎన్నికల సమయంలో వెయ్యి హామీలను ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కహామీని కూడా అమలు చేయలేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. శుక్రవారం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలా అన్యాయం జరుగుతోందన్నారు.

04/29/2017 - 03:48

విజయవాడ, ఏప్రిల్ 28: అనంతపురం జిల్లా గుంతకల్లు మండలం వైటీ చెరువులో తెప్ప బోల్తాపడి చనిపోయిన దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాలవ శ్రీనివాసులు తెలిపారు. మొత్తం 15 మంది ప్రయాణిస్తున్న తెప్ప బోల్తాపడి 13 మంది చనిపోయిన ఈ ఘోర దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వెలిబుచ్చారని సచివాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో పేర్కొన్నారు.

Pages