S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

02/22/2017 - 04:25

గుంటూరు, ఫిబ్రవరి 21: వ్యక్తిగత ప్రతిష్టలతో పార్టీని బలహీనపరిస్తే సహించేదిలేదు.. ఇప్పటికైనా మైండ్‌సెట్ మార్చుకోండి..మరో రెండేళ్లలో ఎన్నికలు వస్తున్నాయి.. ఇదే తీరున గ్రూపుల పోరుతో బజారున పడితే ఉపేక్షించేదిలేదని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలను సున్నితంగా మందలించారు. గుంటూరు జిల్లాలో పార్టీ పరిస్థితి దారుణంగా ఉంది..

02/22/2017 - 04:24

విజయవాడ, ఫిబ్రవరి 21: నందమూరి తారక రామారావు వర్దంతిని పురస్కరించుకుని రాష్ట్ర చలనచిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జనవరి 18 నుంచి ఫిబ్రవరి 15తేదీ వరకు గుంటూరు, కర్నూలు, విజయనగరంలలో జరిగిన నంది నాటక పోటీల్లో ఎంపికైన 15 ఉత్తమ నాటక, నాటికల పేర్లను సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మంగళవారం వెల్లడించారు.

02/22/2017 - 04:23

విజయవాడ, ఫిబ్రవరి 21: రాజధాని నిర్మాణం పేరిట రైతుల నుంచి వేల ఎకరాల భూమిని సేకరించి వివిధ కంపెనీలకు ధారాదత్తం చేయడం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా ఉందని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర కార్యాలయంలో రాజధాని రైతు, రైతు కూలీల పరిరక్షణ కమిటీ సమావేశం రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది.

02/22/2017 - 02:38

హైదరాబాద్, ఫిబ్రవరి 21: కర్నూలు జిల్లాలో హంద్రీ నదిలో రోడ్డు నిర్మించి అక్రమంగా ఇసుక తవ్వకాలు సాగించి అక్రమరవాణా చేయడంపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు మంగళవారం ఆ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ రోడ్డును నదిలో నిర్మించడంపై కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఈ రోడ్డుకు అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించింది.

02/22/2017 - 02:36

విజయవాడ, ఫిబ్రవరి 21: రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన చంద్రన్న బాట నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. నిర్దేశించిన లక్ష్యం మేరకు సిమెంట్ రోడ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తోంది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లోనూ సిసి రోడ్లు నిర్మించాలన్న ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

02/21/2017 - 04:08

శ్రీశైలం, ఫిబ్రవరి 20: శ్రీశైలంలో కొలువైన పరమశివుడి దర్శనానికి భక్తులు భారీగాతరలివస్తున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను కనులారా వీక్షించేందుకు సుదూర ప్రాంతాల నుంచి కాలినడకన భక్తులు శ్రీగిరి చేరుకుంటున్నారు. శివదీక్ష స్వీకరించిన శివస్వాములు, భక్తులు రాష్ట్రం నలుమూలల నుండి కాలినడకన, వాహనాల్లో శ్రీశైలం చేరుకొని స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్నారు.

02/21/2017 - 04:06

విజయవాడ, ఫిబ్రవరి 20: అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తికావచ్చాయని స్పీకర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో సోమవారం ఆయన సిఆర్‌డిఏ, పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాలను మార్చి మొదటి వారంలో నిర్వహించాలని ప్రతిపాదించామన్నారు.

02/21/2017 - 04:01

శ్రీశైలం, ఫిబ్రవరి 20: శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం స్వామి అమ్మవార్లు మయూర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల్లో భాగంగా ఉదయం స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, చండీశ్వరునికి ప్రత్యేక పూజలు, లోక కల్యాణం కోసం జపాలు, మండపారాధనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం ప్రదోషకాల పూజలు, హోమాలు, జపానుష్టానాలు జరిపించారు.

02/21/2017 - 04:00

విజయవాడ, ఫిబ్రవరి 20: దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో పని చేసే అర్చకులకు వారసత్వ హక్కును కల్పించి, వారి వయోపరిమితిని రద్దు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపి అర్చక సమాఖ్య కొనియాడింది. దీనిపై జీవో జారీ చేయడం చారిత్రకమని పేర్కొంటూ, 30 ఏళ్ళుగా పోరాడుతున్న తమకు న్యాయం చేసినందుకు అర్చక సమాఖ్య ప్రతినిధులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ‘బ్రాహ్మణ బంధు’ అనే బిరుదుతో గౌరవించుకుంటామని తెలిపారు.

02/21/2017 - 03:59

నందికొట్కూరు, ఫిబ్రవరి 20: శ్రీశైలం జలాశయం జలాశయం నుంచి హంద్రీనీవాకు ఈసారి రికార్డు స్థాయిలో 37 టిఎంసిల నీరు తరలించారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 835 అడుగులకు పడిపోవడంతో సోమవారం హంద్రీనీవాకు నీటి తరలింపు నిలిపివేశారు. జలాశయం నుంచి గత ఏడాది ఆగస్టు 7వ తేదీ హంద్రీనీవాకు నీటి తరలింపు ప్రారంభమైంది. కర్నూలు, అనంతపురం జిల్లాలకు రికార్డు స్థాయిలో 37 టిఎంసిల నీటిని తరలించారు.

Pages