-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
మదనపల్లె, జనవరి 22: ఆబ్కారీ శాఖ లో కానిస్టేబుల్ నుంచి డిప్యూటీ కమిషనర్ వరకు ముడుపులు చెల్లించనిదే పనులు జరగవు, నెలసరి వేతనాలు ఇవ్వాలంటే కార్యాలయ అధికారులకు లంచాలివ్వాల్సిందే, సిఐగా పదోన్నతి పొంది ఆర్నెళ్లు అవుతున్నా ఇంతవరకు ఎస్ఐ వేతనమే చెల్లిస్తున్నారు, ఇందుకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని అడిగినా, లంచం ఇస్తేనే..
నల్లమాడ, జనవరి 22 : రెడ్డి సామాజిక వర్గం కారణంగానే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని అనంతపురం పార్లమెంటు సభ్యులు జెసి దివాకర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపి జెసి ఆదివారం అనంతపురం జిల్లా నల్లమాడలో ఏర్పాటుచేసిన టిడిపి వ్యవస్థాపకులు, దింవగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
కాకినాడ, జనవరి 22: కాపుల రిజర్వేషన్ల కోసం తాను తలపెట్టిన సత్యాగ్రహ పాదయాత్రకు పోలీసుల అనుమతి కోరే ప్రసక్తే లేదని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి స్పష్టం చేశారు. ఈనెల 25వ తేదీ నుంచి సత్యాగ్రహ పాదయాత్రను తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం నుండి ప్రారంభిస్తానని చెప్పారు. కాకినాడ నగరంలోని కాపు జెఎసినేత వాసిరెడ్డి ఏసుదాసు నివాసంలో ఆదివారం ముద్రగడ విలేఖరులతో మాట్లాడారు.
రాజమహేంద్రవరం, జనవరి 22: హిందూ పండుగల విషయంలో ప్రజల్లో తలెత్తుతున్న గందరగోళాన్ని నివారించడానికి పంచాంగకర్తలంతా ఏకతాటిపైకి రావాలని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన పంచాంగకర్తల సమన్వయ సదస్సు పిలుపునిచ్చింది. పంచాంగ రచనలో ఏకాభిప్రాయానికి వచ్చి హిందుమతాన్ని కాపాడుకోవాలని కోరింది. భిన్న పంచాంగ గణిత-్ధర్మశాస్త్ర విధానాలపై ఈ సదస్సు జరిగింది.
శ్రీకాళహస్తి, జనవరి 22: కుంభాభిషేకాన్ని దర్శించడం పరమ పవిత్రమైన కార్యక్రమమని కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి అన్నారు. ఆదివారం ఆయన శిష్యులతో కలిసి శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వరాలయానికి, గాలిగోపురానికి కుంభాభిషేకం నిర్వహించడానికి శ్రీకాళహస్తికి వచ్చినట్లు తెలిపారు.
తిరుపతి, జనవరి 22: ఆంధ్రప్రదేశ్లో విమానయాన ప్రయాణికుల శాతం బాగా పెరిగిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి పి అశోక్పతిరాజు వెల్లడించారు. దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో వౌలిక వసతుల కల్పనకు రానున్న ఐదేళ్లలో రూ.15వేల కోట్లు ఖర్చు చేయడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. తిరుమల, తిరుపతిలో రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
హైదరాబాద్, జనవరి 21: నాణ్యమైన విద్యుత్లో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించినందుకు ఏపి ట్రాన్స్కోకు ప్రతిష్టాకరమైన గోల్డెన్ పీకాక్ హెచ్ఆర్ ఎక్సెలెన్స్ అవార్డు లభించింది. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో ఏపి ట్రాన్స్కో సిఎండి కె విజయానంద్ ఈ అవార్డును ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్ధాపకులు రవిశంకర్ చేతుల మీదుగా స్వీకరించారు. విజయానంద్ మాట్లాడుతూ ఆంద్రాలో విద్యుత్ పంపిణీ నష్టాలు 2.97 శాతానికి తగ్గాయన్నారు.
మడకశిర, జనవరి 21: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించుకోవడానికి తమిళులను స్ఫూర్తిగా తీసుకుని తెలుగు ప్రజలందరూ ఐక్యం కావాలని పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పిలుపునిచ్చారు.
రాజాం, జనవరి 21: ప్రపంచ చిత్రపటంలో రాజాం ఖ్యాతిని విద్యార్థులు ఇనుమడింప చేయాలని మహారాష్ట్ర గవర్నర్ చెన్నమనేని విద్యాసాగరరావు హితవు పలికారు. శనివారం జిఎంఆర్ఐటి ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మన చరిత్ర, మన విద్య, మన పరంపర మనకు మనమే విశే్లషించుకోవాలన్నారు.
విశాఖపట్నం, జనవరి 21: ప్రస్తుతం భారతదేశం అనుసరిస్తున్న ఆర్థిక సంస్కరణల రూపకర్త దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు అని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎన్ వెంకటాచలయ్య అన్నారు. లోక్నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖలో శనివారం ఏర్పాటు కార్యక్రమంలో ‘నాగరికత - సంస్కృతి - సమాజం’ అంశాలపై పివి స్మారకోపన్యాసం చేశారు.