S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

08/30/2016 - 15:53

ఏలూరు : ఉండిలో రొయ్యలచెరువులో మంగళవారం ఇనుప పడవకు కరెంట్‌షాక్ తగిలి ఇద్దరు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు ఉండి వాసులు లింగయ్య, సురేష్‌గా గుర్తించారు. రొయ్యలచెరువు యజమానులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

08/30/2016 - 15:39

విజయవాడ: భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు 9 టీఎంసీలు నీరు చేరింది. మరో పది టీఎంసీల నీరు చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.పోలవరం కుడికాలువ ద్వారా నీటి సరఫరాను నిలిపివేశారు.

08/30/2016 - 14:34

ఏలూరు : ఏలూరులోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న అగ్రి గోల్డ్ చైర్మన్ అవ్వా వెంకట రామారావు, ఎండీ శేషుకుమార్ అస్వస్థతకు గురయ్యారు. వెంటనే జైలు సిబ్బంది జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వేరొక ఆసుపత్రికి తరలించాలని సూచించడంతో తిరిగి జిల్లా జైలుకు తరలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని జైలు వర్గాలు తెలిపాయి.

08/30/2016 - 13:42

విజయవాడ : కంచి కామకోటి పీఠాధిపతి స్వామి జయేంద్ర సరస్వతి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని సూర్యారావుపేటలోని ఆంధ్రా ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సోడియం లెవల్స్‌ పడిపోవడంతో మంగళవారం ఉదయం స్వామి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సోడియం లెవెల్స్‌ పెంచేందుకు వైద్యులు చికిత్స అందించారు. జయేంద్ర సరస్వతి ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరాతీశారు.

08/30/2016 - 13:37

విజయవాడ: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరినట్లు మాజీ మంత్రి దేవినేని నెహ్రూ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావుతో కలిసి మంగళవారం ఉదయం నెహ్రూ, ఆయన కుమారుడు అవినాష్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తెదేపాలో చేరారు. తెలుగుదేశం పార్టీలోకి రావడం పుట్టింటికి వచ్చినట్లుగా భావిస్తున్నాని నెహ్రూ అన్నారు.

08/30/2016 - 12:29

విజయవాడ: కంచి కామకోటి పీఠాధిపతి స్వామి జయేంద్ర సరస్వతి మంగళవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో ఐదుగురు వైద్యుల పర్యవేక్షణలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడంలో జయేంద్ర సరస్వతి ఇబ్బంది పడుతున్నారని వైద్యులు వెల్లడించారు. ఆయన ప్రస్తుతం కోలుకుంటున్నారని ఆంధ్రా ఆసుపత్రి అధినేత డాక్టర్ పీవీ రమణమూర్తి తెలిపారు.

08/30/2016 - 12:13

తిరుపతి: తిరుమల కల్యాణకట్టలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న తంగవేలు ఇంట్లో మంగళవారం ఉదయం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. తిరుపతితో పాటు మరో ఆరు ప్రాంతాల్లో ఆయన ఆస్తులపై ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. సోదాల్లో భారీగా నగలు, నగదు, ఆస్తిపత్రాలను ఎసిబి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

08/30/2016 - 12:13

గుంటూరు: ఇక్కడికి సమీపంలోని ఓబుళనాయుడుపాలెంలో టిడిపి బిసి సెల్ ఉపాధ్యక్షుడు ఏమినేడి వెంకటేశ్వరరావు (40) తన ఇంట్లో హత్యకు గురయ్యారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆయనను మంగళవారం తెల్లవారు జామున దుండగులు హత్య చేసి ఉంటారని రక్తపుమడుగులో మృతదేహం పడిఉండాడాన్ని గమనించిన పోలీసులు తెలిపారు. హత్యకు దారితీసిన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

08/30/2016 - 12:12

విజయవాడ: కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, ఆయన కుమారుడు అవినాష్ మంగళవారం ఉదయం ఇక్కడ టిడిపి అధినేత, ఎపి సిఎం చంద్రబాబును కలిశారు. ఎపి టిడిపి అధ్యక్షుడు కళా వెంకట్రావును వెంటబెట్టుకుని నెహ్రూ, ఆయన తనయుడు చంద్రబాబును కలియడంతో టిడిపిలో ఆయన చేరడం లాంఛనప్రాయమైంది. వచ్చే నెల రెండో వారంలో నెహ్రూ అధికారికంగా టిడిపిలో చేరతారని సమాచారం.

08/30/2016 - 06:19

విజయవాడ, ఆగస్టు 29: రాష్ట్రంలో తెలుగు భాషా ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలుగుభాషా దినోత్సవం సందర్భంగా నగరంలోని తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో సోమవారం జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పాలనలో పటిష్ఠంగా తెలుగుభాష అమలుకు నెలరోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Pages