-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
తిరుపతి, ఆగస్టు 29: దేశంలో నిరుపేదలెవరూ ప్రాణాంతక, ప్రమాదకర వ్యాధులతో మృత్యువాత పడకూడదనే లక్ష్యంతోనే ప్రధాని నరేంద్రమోదీ జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకాన్ని ప్రవేశపెట్టారని కేంద్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖామంత్రి జెపి నడ్డా స్పష్టం చేశారు. సోమవారం తిరుపతిలో సోమవారం జాతీయ ఆరోగ్య పరిరక్షణపై జాతీయ సెమినార్ను ఆయన ప్రారంభించారు.
ఏలూరు, ఆగస్టు 29 : ఖాతాదారులను మోసగించారన్న అభియోగాలు ఎదుర్కొంటూ పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులోని జిల్లా జైలులో రిమాండ్లోవున్న అగ్రిగోల్డ్ సంస్థ ఛైర్మన్ అవ్వా వెంకట రామారావు, ఎండి అవ్వా వెంకట శేషు నారాయణరావు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిద్దరినీ వైద్య పరీక్షల నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వీరిద్దరికీ పరీక్షలు నిర్వహించారు.
విశాఖపట్నం, ఆగస్టు 29: భారత నౌకాదళానికి చెందిన సూపర్ సోనిక్ యుద్ధ విమానం మిగ్ 29కె ఆయిల్ ట్యాంక్ విశాఖ సిఐఎస్ఎఫ్ క్వార్టర్స్ వద్ద జారిపడింది. రోజువారీ విన్యాసాల్లో భాగంగా విశాఖ ఐఎన్ఎస్ డేగా నుంచి సోమవారం ఉదయం బయలుదేరిన మిగ్ 29కె ఆయిల్ ట్యాంక్ ఒకటి ప్రమాదవశాత్తూ రన్వేపై జారి పడగా, విమాన బరువులో సమతౌల్యం నిమిత్తం పైలెట్ రెండో ఆయిల్ ట్యాంక్ను జారవిడిచారు.
విజయవాడ (బెంజిసర్కిల్), ఆగస్టు 29: ఆంధ్రప్రదేశ్కు పార్లమెంట్ సాక్షిగా బిజెపి హామీ ఇచ్చిన విధంగా ప్రత్యేక హోదా ఇచ్చితీరాలని ఎపిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు పి అశోక్బాబు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా సాధన కోసం అన్నివర్గాల వారిని, అధికారులను, ప్రజాప్రతినిధులను ఏకతాటిపైకి తెస్తామని ఆయన ప్రకటించారు. అందరితో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు.
అనంతపురం, ఆగస్టు 29: రాయలసీమలో పంట ఎండిపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, పల్లె రఘునాథ్రెడ్డి, సునీత అన్నారు. అనంతపురం నగరంలో సోమవారం వారు విలేఖరులతో మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాల్లో పంటలకు నీటి తడులు అందిస్తున్నామన్నారు.
కర్నూలు, ఆగస్టు 29 : రాయలసీమలో ప్రస్తుత ఖరీఫ్లో సాగుచేసిన పంటలు దయనీయస్థితికి చేరుకోవడంతో నాలుగు జిల్లాల్లో 24 గంటల పాటు వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నా భూగర్భ జలాలు అట్టడుగున ఉండటంతో నీటిని మోటార్లతో తోడటం ఇబ్బందికరంగా ఉంటుందని వాపోతున్నారు.
గుంటూరు, ఆగస్టు 29: అంగన్వాడీ వర్కర్లకు వేతనాలు పెంచుతూ కొత్త సచివాలయంలో తొలి ఫైలుపై స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత సంతకం చేశారు. వెలగపూడి సచివాలయం నాలుగో బ్లాక్ మొదటి అంతస్తులో సోమవారం ఉదయం 8.03 గంటలకు స్ర్తి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయాన్ని మంత్రి సుజాత , 9.09 గంటలకు ఉన్నత విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తన కార్యాలయాన్ని ప్రారంభించారు.
శ్రీశైలం, ఆగస్టు 29: శ్రీశైల మహాక్షేత్రంలో కొలువైన శ్రీ మల్లికార్జున స్వామి వారికి సోమవారం శాస్త్రోక్తంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. రాష్ట్రంలో తగినంత వర్షాలు కురవాలని, పాడి పంటలతో పల్లెలు కళకళలాడాలని, పచ్చని పొలాలతో పుడమితల్లి సస్యశ్యామలాంగా ఉండాలనే సంకల్పంతో శ్రీ మల్లికార్జున స్వామి వారికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించినట్లు దేవస్థానం ఇఓ నారాయణ భరత్ గుప్తా తెలిపారు.
విజయవాడ, ఆగస్టు 29: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పంటలు ఎండిపోకుండా 24 గంటలు నాణ్యమైన విద్యుత్ను అందించనున్నామని ఎనర్జీ ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్ తెలిపారు. వాస్తవానికి వర్షాభావ పరిస్థితుల వల్ల అక్కడ భూగర్భ జలాలు కూడా అడుగంటాయన్నారు.
విజయవాడ (స్పోర్ట్స్), ఆగస్టు 29: మన దేశం తరపున ఒలింపిక్స్లో పాల్గొన్న హాకీ క్రీడాకారిణి రజనికి రాష్ట్ర ప్రభుత్వం నజరానా ప్రకటించింది. రియో ఒలింపిక్స్లో పాల్గొన్న ఆమెకు 25లక్షల రూపాయల నజరానా ప్రకటించింది. అలాగే గ్రూప్-2 ఉద్యోగం ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. సోమవారం విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో రజనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రూ.25లక్షల చెక్కును అందచేశారు.