-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
గుంటూరు, ఆగస్టు 7: రాజధాని అమరావతి ప్రాంతం పుష్కర శోభను సంతరించుకుంటోంది. పుష్కర పనుల్లో ఒకింత జాప్యం జరుగుతున్నప్పటికీ జిల్లాలోని ప్రాచీన శైవక్షేత్రాలతోపాటు నవ్యాంధ్ర రాజధాని ప్రతిపాదిత గ్రామాల్లోని కృష్ణాతీరంలో నాలుగు ప్రత్యేక ఘాట్లను తీర్చిదిద్దుతున్నారు. గుంటూరు జిల్లాలోని విజయపురి సౌత్ నుంచి చిలమూరు, రేపల్లె తీరంలోని పెనుమూడి రేవు.. ఎగువన అమరావతి, ధరణికోట సీతానగరం..
విశాఖపట్నం, ఆగస్టు 7: ప్రతిష్ఠాత్మకమైన వివిధ విద్యా సంస్థలను విశాఖలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినప్పటికీ అవి ఇతర జిల్లాలకు తరలిపోతున్నాయి. తాజాగా విశాఖలో ఏర్పాటు చేయాలనుకున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంటేషన్ మేనేజ్మెంట్ (ఐఐపిఎం) కృష్ణాజిల్లా కొండపల్లికి తరలించాలని నిర్ణయించారు.
రాజమహేంద్రవరం, ఆగస్టు 6: గోదావరి నది అంత్య పుష్కరాలు ఏడవ రోజైన శనివారం భక్తులు అత్యధికంగా పుణ్య స్నానాలు ఆచరించారు. శ్రావణ మాస ప్రాశస్థ్యం కూడా తోడవ్వడంతో రద్దీ పెరిగింది. మరో వైపు గోదావరి నది వరద ఉద్ధృతి కూడా పెరుగుతోంది. అఖండ గోదావరి నదిలో సుమారు 71వేల మంది శనివారం పుణ్య స్నానాలు ఆచరించారు. పుష్కర ఘాట్ భక్తులతో పోటెత్తింది.
అనంతపురం, ఆగస్టు 6: రాష్ట్ర విభజనకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీయేనని, అడ్డగోలుగా విభజనకు సహకరించిన పార్టీ నాయకులు ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విమర్శించారు. అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం మాట్లాడుతూ విభజన పాపాన్ని కడిగేసుకునేందుకు రాష్ట్భ్రావృద్ధికి సహకరించాలని హితవు పలికారు. విభజన హామీలు నెరవేర్చేదాకా పోరాడుతామన్నారు.
అనంతపురం సిటీ, ఆగస్టు 6: రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుడంతో పాటు, రైతులు పండించిన పంటలకు మార్కెటింగ్ కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తెలిపారు అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్యను సిఎం ప్రారంభించారు. వర్షం నీటిని ఒడిసి పట్టేందుకు చేపట్టిన సంజీవనితో మంచి ఫలితాలు వచ్చాయన్నారు.
రాజమహేంద్రవరం, ఆగస్టు 6: గోదావరి నది వరద ఉద్ధృతి నెమ్మదిగా పెరుగుతోంది. అఖండ గోదావరి నది ఎగువ ప్రాంతంలో కురుస్తోన్న భారీ వర్షాలకు గోదావరి నదికి వరద తాకిడి మొదలైంది. దీంతో క్రమేణా ప్రవాహ ఉద్ధృతి పెరుగుతోంది. శనివారం సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజి వద్ద 10.9 అడుగుల నీటి మట్టం నమోదైంది. భద్రాచలం వద్ద గంట గంటకూ వరద నీటి మట్టం పెరుగుతోంది.
అనంతపురం సిటీ, ఆగస్టు 6: రాష్టవ్య్రాప్తంగా యూనివర్సిటీల పరిధిలో ఖాళీగా ఉన్న 1104 అధ్యాపకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మానవవనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. శనివారం అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో రాష్ట్రంలోని అన్ని వర్శిటీల ఉపకులపతుల సమావేశం నిర్వహించారు.
విశాఖపట్నం, ఆగస్టు 6: దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న బిసిల సమస్యల పరిష్కారం కోసం మిలిటెంట్ ఉద్యమం చేపట్టనున్నామని, ఇందుకు బిసిలంతా సిద్ధంగా ఉన్నారని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రభుత్వానికి హెచ్చరించారు. విశాఖలో శనివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
విశాఖపట్నం(కల్చరల్), ఆగస్టు 6: జనరంజకమైన గీతాలతో సినీ అభిమానుల్ని ఆకట్టుకున్న ప్రసిద్ధ కవి డాక్టర్ జాలాది పేరిట జాలాది చారిటబుల్ ట్రస్టు నెలకొల్పిన జాతీయస్థాయి పురస్కార ప్రదానోత్సవం 9న కళాభారతిలో నిర్వహిస్తున్నట్టు ఎయు రిజిస్ట్రార్ వి.ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
విజయనగరం(టౌన్), ఆగస్టు 6: భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన అధికారి ఎసిబి పన్నిన వలలో చిక్కిన సంఘటన శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలివి. జిల్లాలోని డెంకాడ మండలం బడ్డుకొండపేట గ్రామంలో రామకృష్ణ అనే వ్యక్తి మూడున్నర ఎకరాల భూమిని గ్రామస్తులు నుండి కొనుగోలు చేశారు. ఈభూమి విలువ సుమారు 80లక్షల రూ.లు.