S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

05/03/2016 - 04:44

రామభద్రపురం, మే 2: గృహనిర్మాణశాఖ ఎఇ రూ.పది కోట్ల మేరకు అక్రమాస్తులు కూడబెట్టారు. పక్కాసమాచారంలో ఏకకాలంలో పలు చోట్ల దాడులు నిర్వహించిన అధికారులు అతని బంధువుల పేర ఉన్న భారీ భవంతులు, లాకర్లలోని బంగారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.

05/03/2016 - 04:43

ఒంగోలు, మే 2: జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు అధికారులు ఆర్‌టిఒ కార్యాలయం బయట ఉన్న ఏజెంట్ల కార్యాలయాలపై సోమవారం దాడులు నిర్వహించారు. అవినీతి ఆరోపణలపై కాకినాడ డిటిసి ఆదిమూలం మోహన్ ఎసిబికి చిక్కిన నేపధ్యంలో రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు విజిలెన్స్ అధికారులు ఆర్టీఎ ఏజెంట్ల కార్యాలయాలపై దాడులు నిర్వహించారు. రాష్ట్రప్రభుత్వం బ్రోకర్ల వ్యవస్ధను చాలా ఏళ్ల కిందట రద్దుచేసింది.

05/03/2016 - 04:42

అనంతపురం, కడప జిల్లాల్లో సోమవారం వడదెబ్బకు ఐదుగురు మృతిచెందారు. కడప జిల్లా నందలూరులో కత్తికట్టు జయరామ్ (43), రైల్వేకోడూరు మండలం బయనపల్లెకు చెందిన కె సుబ్బరాయుడు (65), అనంతపురం జిల్లా పెదపప్పూరు మండలం తబ్జుల గ్రామానికి చెందిన నాగిరెడ్డి (70), ఓబులదేవరచెరువు మండలం తంగేడుకుంట గ్రామానికి చెందిన షేక్‌హుస్సేన్ (11), గోరంట్లకు చెందిన వెంకటేశు (55) వడదెబ్బకు ప్రాణాలు కోల్పోయారు.

05/03/2016 - 04:40

విజయవాడ (ఇంద్రకీలాద్రి), మే 2: ఆగస్టులో రానున్న కృష్ణా నది పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు మొత్తం 415 కోట్ల రూపాయల ఖర్చుతో ఆలయాల్లో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్టు దేవాదాయ ధర్మాదాయ శాఖ చీఫ్ ఇంజనీర్ ఎస్‌ఎస్ సుబ్బారావు తెలిపారు. సోమవారం ఉదయం ఆయన ఇక్కడ ‘ఆంధ్రభూమి’తో మాట్లాడుతూ కృష్ణా పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.

05/03/2016 - 04:40

తెనాలి, మే 2: గుంటూరు జిల్లా తెనాలిలోని పప్పుల మిల్లుల్లో జోనల్ ఫుడ్ కంట్రోలర్ ఎన్ పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం సోమవారం తనిఖీలు నిర్వహించి 220 బస్తాల నిషిద్ధ కెమికల్స్ పౌడర్‌ను సీజ్ చేశారు. జిఎఫ్‌ఓ పూర్ణచంద్రరావు కథనం ప్రకారం.. తెనాలి పరిసర ప్రాంతాల్లోని పప్పుల మిల్లుల్లో ప్రభుత్వం నిషేధించిన సిల్కా, గ్లాసి, సోమ్ రకాల పౌడర్లను పప్పుల నిల్వలకు వాడుతున్నట్లు వారికి సమాచారం అందింది.

05/03/2016 - 04:39

కడప,మే 2: తెలుగుదేశం పార్టీ తీరుపై ఇక ప్రత్యక్ష పోరాటానికి రాయలసీమ బిజెపి నేతలు సిద్ధపడుతున్నారు. సీమలో విలయతాండవం చేస్తున్న కరవును రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, తాగునీరు, పశువులకు దాణా కరవై కబేళాలకు తరలిస్తున్నా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా కూడా లేదంటూ ఆందోళనకు బిజెపి నేతలు వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది.

05/02/2016 - 18:05

విజయవాడ: నగరంలోని పాత ప్రభుత్వాసుపత్రిలో మూడు రోజుల శిశువు అనుమానాస్పదంగా మరణించడంపై సమగ్ర విచారణ జరపాలని వైద్య,ఆరోగ్య శాఖామంత్రి కామినేని శ్రీనివాస్ ఆదేశించారు. ఈ సంఘటన గురించి తెలిశాక లండన్‌లో ఉన్న ఆయన ఆస్పత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడారు. శిశువుమృతిపై స్థానిక కాంగ్రెస్, వైకాపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన ఆస్పత్రి ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

05/02/2016 - 18:04

ఏలూరు: నడిరోడ్డుపై వెళుతున్న వారిపై ఓ ఉన్మాది విచక్షణారహితంగా కత్తితో దాడి చేయడంతో బాలుడు మరణించాడు. నిడదవోలు మండలం శెట్టుపేటలో సోమవారం ఈ ఘటన జరిగింది. కత్తిపోట్లకు తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది.

05/02/2016 - 16:53

విజయవాడ: కొన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 400 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఎపి మంత్రిమండలి అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే 20వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటన్నింటికీ కలిపి త్వరలో నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉంది.

05/02/2016 - 16:52

విజయవాడ: తెలంగాణలో చేపడుతున్న కొన్ని సాగునీటి ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని ఎపి సర్కారు నిర్ణయించింది. ఈమేరకు సోమవారం ఇక్కడ సిఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశంలో తీర్మానించారు. ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కేంద్రం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఎపి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేయాలని కూడా నిర్ణయించారని సమాచారం.

Pages