S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/29/2016 - 12:45

గుంటూరు: గుంటూరులో నిర్మించే తొలి ఫైవ్‌స్టార్ హోటల్ ‘మై ఫార్ట్యూన్’కు ఎపి సిఎం చంద్రబాబు శుక్రవారం శంకుస్థాపన చేశారు. 1.45 ఎకరాల స్థలంలో 12 అంతస్థుల హోటల్ నిర్మాణానికి ఐటిసి సుమారు 150 కోట్లరూపాయలను వెచ్చిస్తుంది. కార్యక్రమంలో స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు పుల్లారావు, రావెల, ఐటిసి ప్రతినిధులు పాల్గొన్నారు.

04/29/2016 - 12:42

విజయనగరం: అనుమానం పెనుభూతమై వెంటాడగా తాళికట్టిన భార్యను భర్త హతమార్చాడు. ఎల్.కోట మండలం రెల్లిగైరమ్మపేటలో శుక్రవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. వెంకటరమణ అనే వ్యక్తి అనుమానంతో భార్య అప్పలకొండను హత్య చేసినట్లు గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.

04/29/2016 - 06:52

విశాఖపట్నం, ఏప్రిల్ 28: విశాఖ జిల్లా దువ్వాడ సెజ్‌లోని బయోమ్యాక్స్ ఫ్యూయల్ కంపెనీలో సంభవించిన అగ్ని ప్రమాదం నేపథ్యంలో ఉత్పత్తిని నిలిపివేస్తూ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి గురువారం ఆదేశాలు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వెలువడేంతవరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని మండలి జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ బి.మధుసూదనరావు తెలిపారు.

04/29/2016 - 06:50

గుంటూరు, ఏప్రిల్ 28: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భూ మాఫియా చెలరేగిపోతోంది... వాగులు.. వంకలు.. చెట్లు.. పుట్టలను సైతం తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు.. చివరకు కొండలను సైతం తొలిచి లే-అవుట్‌లు వేస్తున్నారంటే పరిస్థితి ఏ రకంగా ఉందనేది ఊహించుకోవచ్చు.

04/29/2016 - 06:49

మార్కాపురం, ఏప్రిల్ 28: రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో మే 1వతేదీ నుంచి నిత్యం నీటి సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు రాష్ట్ర మున్సిపల్‌శాఖమంత్రి నారాయణ అన్నారు. గురువారం స్థానిక మున్సిపల్ సమావేశం హాల్‌లో అధికారులు, కౌన్సిలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

04/29/2016 - 06:48

కర్నూలు, ఏప్రిల్ 28: వరుస కట్టి పార్టీ మారుతున్న ఎమ్మెల్యేల తీరుతో ఎన్నికల వ్యవస్థపైనే ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని ప్రభావం భవిష్యత్తులో పోలింగ్‌పై చూపే ప్రమాదం ఉందని విశే్లషకులు అంచనా వేస్తున్నారు.

04/29/2016 - 06:47

గుంటూరు, ఏప్రిల్ 28: కాంగ్రెస్ కురువృద్ధుడు, ఏఐసిసి సభ్యుడు గాదె వెంకటరెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. 1967లో ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యేగా క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించిన గాదె మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కొలువులో పలు మంత్రి పదవులను సమర్థవంతంగా నిర్వహించారు.

04/29/2016 - 06:45

విజయవాడ, ఏప్రిల్ 28: మే 15 నాటి నుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాల పరిధిలోని ప్రధానమైన పలు శాఖల ద్వారా నిర్వహించే ఫైళ్ల నిర్వహణ ఇ-ఆఫీసు ద్వారానే నిర్వహించాల్సి ఉంటుందని ముఖ్యమంత్రి కార్యదర్శి, ఎక్స్ అఫిషియో ఐటి కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న పేర్కొన్నారు.

04/29/2016 - 06:44

విజయవాడ, ఏప్రిల్ 28: వైఎస్సార్ కాంగ్రెస్‌ను వీడుతున్న శాసనసభ్యులందరూ తక్షణం రాజీనామాలు చేసేందుకు సిద్ధమే, అయితే రోజుకొకరు వచ్చి చేరుతున్నారు. పదే పదే ఉప ఎన్నికలు ఎందుకు జగన్ మినహా 66 మంది వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదనిఇటీవలే తెలుగుదేశంలో చేరిన విజయవాడ పశ్చిమ శాసనసభ్యుడు జలీల్ ఖాన్ అన్నారు. ఖచ్చితంగా మే 15లోగా 50 శాతం మంది అంటే 34 మంది టిడిపిలో చేరిపోగలరన్నారు.

04/29/2016 - 06:43

గుంటూరు, ఏప్రిల్ 28: ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అనారోగ్యకరంగా ఉన్నాయని ఈ పరిస్థితుల్లో తాను ఇమడలేక ఇక వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం గుంటూరులోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Pages