-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
మడకశిర, ఏప్రిల్ 28: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కరవు కవల పిల్లలని, చంద్రబాబు ఎప్పుడు అధికారం చేపట్టినా కరవు కూడా వస్తోందని పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు.
కర్నూలు, ఏప్రిల్ 28: వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరు కారణంగానే ఆ పార్టీకి నష్టం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి విమర్శించారు. కర్నూలు నగరంలోని టిడిపి కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ అహంభావం కారణంగానే ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీకి దూరమవుతున్నారని తెలిపారు.
విజయవాడ: ఎపి ప్రభుత్వం నిర్వహించే ఎంసెట్ తేదీ విషయంలో ఎలాంటి మార్పు లేదని, ముందు నిర్ణయించినట్లు ఈనెల 29నే ఎంట్రన్స్ నిర్వహిస్తామని ఎంసెట్ కన్వీనర్ సాయిబాబా గురువారం తెలిపారు. దేశవ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలను ‘నీట్’ (నేషనల్ ఎలిజిబిలటీ ఎంట్రన్స్ టెస్ట్) ద్వారానే జరపాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా తీర్పు ఎంసెట్కు వర్తించదని ఆయన స్పష్టం చేశారు.
కాకినాడ: ఇక్కడ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేస్తున్న మోహన్కు 80 కోట్ల రూపాయల మేరకు అక్రమాస్తులున్నట్లు ఎసిబి అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. కాకినాడతో పాటు చిత్తూరు, నెల్లూరు, హైదరాబాద్లో మోహన్, ఆయన బంధువుల ఇళ్లపై ఎసిబి అధికారులు ఏకకాలంలో దాడులు ప్రారంభించారు. తెలంగాణ,కర్నాటకలోనూ సోదాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్: తనపై వైకాపా అధినేత జగన్ చేస్తున్న ఆరోపణలపై చర్చకు తాను ఎప్పుడూ సిద్ధమేనని టిడిపి యువనేత నారా లోకేష్ ప్రకటించారు. బహిరంగ చర్చకు జగన్ రెడీయేనా? అని సవాల్ విసిరారు. జగన్ అవినీతిపై ‘రాజా ఆఫ్ కరెప్షన్’ పుస్తకంపైన, తమ కుటుంబంపై జగన్ ముద్రించిన పుస్తకంపైన ప్రజల్లో చర్చ పెట్టాలని లోకేష్ అన్నారు. అవినీతిపరుడైన జగన్కు అపాయింట్మెంటు ఇచ్చేందుకు దిల్లీలో నేతలు వెనుకంజ వేస్తున్నారన్నారు.
దిల్లీ: వైకాపా ఎమ్మెల్యే రోజా మళ్లీ వ్యక్తిగత ఆరోపణలపై ప్రత్యర్థులపై దాడికి దిగారు. ఈసారి ఆమె ఎపి సిఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్పై విమర్శలు సంధించారు. ఆమె గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లో లోకేష్ ఓ పప్పు సుద్ద అన్నారు. జిహెచ్ఎంసి ఎన్నికల్లో తెరాస నేతలపై లోకేష్ తొడగొట్టారని, ఆ తర్వాత తెలంగాణలో టిడిపి బలమెంతో తేలిపోయిందన్నారు. ఇపుడు మళ్లీ బహిరంగ చర్చకు సిద్ధమా?
గుంటూరు: అక్రమ సంపాదనతో ఆర్థిక నేరస్థుడిగా గుర్తింపు పొందిన వైకాపా అధినేత జగన్తో కేంద్రమంత్రులు ఫొటోలు దిగడం సరికాదని ఎపి మంత్రి పత్తిపాటి పుల్లారావు గురువారం ఇక్కడ మీడియాతో అన్నారు. ‘సేవ్ డమొక్రసీ’ పేరుతో దిల్లీయాత్ర చేస్తున్న జగన్కు అపాయింట్మెంట్ ఇచ్చేందుకు రాష్టప్రతి సంశయిస్తున్నారని అన్నారు. ఆర్థిక నేరస్థుడు చెప్పే మాటలను ఎవరూ వినాల్సిన పనిలేదన్నారు.
ఒంగోలు: యాసిడ్ ఇంజక్షన్ ఇచ్చి ఓ వివాహితను హతమార్చిన కేసులో అయిదుగురు నిందితులను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మృతురాలి భర్త, రెండో భార్యతో పాటు మరో ముగ్గురు మహిళలను అరెస్టు చేసి పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వివాహితను హతమార్చేందుకు ముగ్గురు మహిళలు భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నారని సమాచారం.
విజయవాడ: శ్రీహరికోట షార్ సెంటర్ నుంచి గురువారం పిఎస్ఎల్వి సీ 33 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్తవ్రేత్తలను ఎపి సిఎం చంద్రబాబు అభినందించారు. దేశీయ నావిగేషన్ వ్యవస్థకు ఈ రాకెట్ దిక్సూచిలా పనిచేస్తుందని ఆయన అన్నారు.
విజయవాడ: సాగునీరు, పరిశ్రమలు, ఉపాధి రంగాల్లో రాయలసీమను ముందంజలో నిలిపేలా కృషి చేస్తున్నట్లు ఎపి సిఎం చంద్రబాబు తెలిపారు. శ్రీశైలం వైకాపా ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి గురువారం ఉదయం టిడిపిలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సీమ ప్రగతి కోసం తాను శ్రమిస్తుంటే ఓర్వలేనితనంతో వైకాపా అడ్డుపడుతోందన్నారు. పట్టిసీమ సాగునీటి పథకం పూర్తికాకుండా వైకాపా నీచరాజకీయాలు చేస్తోందన్నారు.