S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

04/20/2016 - 17:01

విజయవాడ: బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు, ఆయన సోదరుడు బేబీనాయన బుధవారం ఇక్కడ ఎపి సిఎం చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు పార్టీ కండువాలను కప్పి వీరిని టిడిపిలోకి ఆహ్వానించారు. విజయనగరం జిల్లాకు చెందిన కేంద్ర మంత్రి అశోకగజపతిరాజు, రాష్ట్ర మంత్రి కిమిడి మృణాళిని, ఎపి టిడిపి అధ్యక్షుడు కె.కళా వెంకట్రావు, పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

04/20/2016 - 15:09

నెల్లూరు: జిల్లాలోని గూడూరు ప్రాంతంలో పలు చోరీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని ఆరుగురు సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. వీరు తమిళనాడుకు చెందినవారని, ఈ ముఠాపై గతంలో పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. వీరి నుంచి 25 లక్షల రూపాయలు విలువచేసే బంగారు నగలు, రెండు లక్షల రూపాయలు వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.

04/20/2016 - 15:08

కడప: ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో మార్కులు తక్కువగా వచ్చాయని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. సంబేపల్లి మండలం చెంచురెడ్డిగారిపల్లెలో బుధవారం ఈ ఘటన జరిగింది. తన అక్క కంటే తక్కువ మార్కులు వచ్చాయని పూజితను ఆమె తల్లిదండ్రులు మంగళవారం మందలించారు. దీంతో ఆమె పురుగుమందు తాగింది. వెంటనే ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించింది.

04/20/2016 - 15:08

విజయవాడ: నియోజకవర్గం అభివృద్ధి చెందాలన్న ఆకాంక్షతోనే టిడిపిలో చేరుతున్నానని బొబ్బిలి ఎమ్మెల్యే సుజయకృష్ణ రంగారావు బుధవారం ఇక్కడ తెలిపారు. డబ్బులు ఇవ్వడం వల్లే వైకాపా ఎమ్మెల్యేలు టిడిపిలో చేరుతున్నారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. వైకాపాలో బొత్స సత్యనారాయణ చేరడం వల్లే తాను ఆ పార్టీని వీడుతున్నానన్న వాదన అవాస్తవమన్నారు.

04/20/2016 - 15:07

నెల్లూరు: ప్రతి విషయాన్నీ రాజకీయం చేస్తూ అభివృద్ధిని అడ్డుకోవడమే వైకాపా నేత జగన్ ఎజెండాగా కనిపిస్తోందని మాజీ ఎమ్మెల్యే, టిడిపి నేత ఆనం వివేకానందరెడ్డి బుధవారం ఇక్కడ మీడియాతో అన్నారు. ప్రత్యేక హోదాపై ఎలాంటి అవగాహన లేకుండానే జగన్ ఇష్టానుసారం ఆరోపణలు చేస్తున్నారన్నారు. సిఎం చంద్రబాబును విమర్శించే స్థాయి జగన్‌కు లేదన్నారు.

04/20/2016 - 12:35

రాజమండ్రి: ఇటీవల స్థానికంగా సంచలనం సృష్టించిన సామూహిక అత్యాచారం కేసులో ప్రేమ్‌కుమార్, సతీష్, మణికంఠ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. పరారీలో ఉన్న మరో నిందితుడు పలివెల రాజు అనే నిందితుడి కోసం గాలిస్తున్నారు. మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ముగ్గురు నిందితులు పోలీసులకు తెలిపారు. ఈ నలుగురు నిందితులపైన ఇదివరకే రౌడీషీట్లు ఉన్నాయి.

04/20/2016 - 12:34

విజయవాడ: ఎపి సిఎం చంద్రబాబు బుధవారం ఇక్కడ సంచార వైద్య చికిత్స సేవల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన జన్మదినం సందర్భంగా అన్ని జిల్లాల్లోనూ ‘చంద్రన్న సంచార వైద్య సేవలు’ పథకాన్ని ప్రారంభించారు. రోగులకు ఉచిత సిటి స్కాన్ సేవలు, చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వంటివి ఈ పథకంలో ఉంటాయి.

04/20/2016 - 12:33

ఏలూరు: పట్టణ శివారులో ఓ ప్రైవేటు వైద్యకళాశాల సమీపంలో బుధవారం ఉదయం మితిమీరిన వేగంతో వస్తున్న లారీ ఓ కారును, ఎడ్లబండిని ఢీకొనడంతో ముగ్గురు మరణించారు. గాయపడిన ముగ్గురిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో రెండు ఎద్దులు మరణించాయి.

04/20/2016 - 12:32

విజయవాడ: ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న ఎపి సిఎం, టిడిపి అధినేత చంద్రబాబును ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆయన ఫోన్‌లో మాట్లాడి బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

04/20/2016 - 12:32

కర్నూలు: ఉపాధి హామీ పథకం కింద చెరువు నిర్మాణం పనుల్లో పాల్గొంటున్న కూలీలపై ఒక్కసారి తేనెటీగలు దాడి చేయడంతో ఓ వ్యక్తి మరణించాడు. గడివేముల మండలం పెసరవాయి వద్ద బుధవారం ఉదయం తేనెటీగల దాడిలో దొరస్వామి అనే కూలీ ప్రాణాలు కోల్పోయాడు. తొమ్మిది మంది కూలీలు గాయపడడంతో వారిని ఆస్పత్రికి తరలించారు.

Pages