S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/26/2016 - 03:59

హైదరాబాద్, మార్చి 25: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా గత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించేందుకు ప్రభుత్వం పట్టుబడితే వైఎస్‌ఆర్‌సిపి అడ్డుపడిందని తెలుగుదేశం పార్టీ నేత జూపూడి ప్రభాకర్ అన్నారు.

03/26/2016 - 02:15

ఏలూరు, మార్చి 25: కొల్లేరు ప్రాంత ప్రజల సమస్యలను త్వరలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్లి, అక్కడి ప్రజలకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగేటట్లు చేస్తానని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి నిర్మలా సీతారామన్ హామీయిచ్చారు. పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొల్లేరువాసుల సమస్యను నిబంధనల మేరకు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

03/26/2016 - 02:10

సింహాచలం, మార్చి 25: ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి దేవాలయం స్ఫూర్తితో ప్రధాన దేవాలయాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకమైన ప్రణాళికలు రచిస్తుంది దేవాదాయ ధర్మాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్ అన్నారు. సింహాచల క్షేత్రంలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. శ్రీశైలం దివ్యక్షేత్రం అభివృద్ధిపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నామని ఆయన అన్నారు.

03/26/2016 - 02:08

ఖాజీపేట, మార్చి 25: అప్పుల బాధ తాళలేక కన్నకొడుకుకు ఉరివేసి ఆపై తండ్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన శుక్రవారం కడప జిల్లా ఖాజీపేట మండలం అప్పనపల్లెలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు.. అప్పనపల్లె గ్రామ పంచాయతీకి చెందిన సావిత్రమ్మతో బొబ్బిశెట్టి వీరభద్రయ్య(27)కు ఆరేళ్లక్రితం వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చేనేత మగ్గం నేసుకుంటూ జీవనం సాగించేవారు.

03/26/2016 - 02:07

విశాఖపట్నం, మార్చి 25: భూ సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా తమ పనులు తాము చేసుకునే విధంగా ప్రభుత్వం సౌలభ్యం కల్పించాలని ఎపి రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

03/26/2016 - 02:07

నెల్లూరు, మార్చి 25: పెన్నానదిలో ఈతకెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన సంఘటన శుక్రవారం నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది. కోవూరు పట్టణంలో ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న షేక్ ఫయాజుద్దీన్(14), పల్లం వర్షిత్(13), షేక్ లతీఫ్(13) అనిల్ కలిసి శుక్రవారం నెల్లూరులో జరిగే తల్పగిరి రంగనాథుని రథోత్సవం చూసి తర్వాత రంగడి ఆలయం వెనుక తిక్కన పార్కువద్ద ఈతకొట్టడానికి నదిలో దిగారు.

03/26/2016 - 02:06

తిరుపతి, మార్చి 25: రానున్న మూడు నెలల్లో రాష్ట్ర మహిళా కమిషన్‌ను బలోపేతం చేయడానికి చర్యలు చేపడతామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. శుక్రవారం స్థానిక పద్మావతి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళ సంక్షేమం, రక్షణ నిమిత్తం తప్పనిసరిగా స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

03/26/2016 - 02:05

విశాఖపట్నం, మార్చి 25: పత్రికా రంగంలో విశేష సేవలందించే వారికిచ్చే గంటా చిన రోశయ్య, నారాయణమ్మ స్మారక అవార్డుకు ప్రఖ్యాత సంపాదకులు పొత్తూరి వెంకటేశ్వర రావు ఎంపికయ్యారు. పత్రికారంగానికి ఎనలేని సేవలందించిన పొత్తూరి వెంకటేశ్వర రావును 2015 సంవత్సరానికి ఉత్తమ జర్నలిస్టుగా ఎంపిక చేసినట్టు కన్వీనర్, రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖలో శుక్రవారం వెల్లడించారు.

03/26/2016 - 02:04

భద్రాచలం, మార్చి 25: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు జన మిలీషియా కమాండర్ సుధ్రం మృతి చెందాడు. కొండగావ్ జిల్లా మర్ధపాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాకస్‌మెట్ట- కుజూర్ అటవీ ప్రాంతంలో డిఆర్‌జీ, మర్ధపాల్ పోలీసులు ఎస్సీ జెఎస్ వట్టి ఆధ్వర్యంలో కూంబింగ్ నిర్వహించారు. పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అంబూష్ చేయగా వాటిని జవాన్లు తిప్పికొట్టారు.

03/26/2016 - 02:03

విజయవాడ, మార్చి 25: రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై గ్రామస్థాయి, పట్టణస్థాయి నుండి చైతన్యపర్చి పోరాటాలు సాగించి పాలకుల మెడలు వంచాలని పిసిసి అధ్యక్షులు, మాజీమంత్రి ఎన్.రఘువీరారెడ్డి అన్నారు. స్థానిక గవర్నరుపేట ఆంధ్రరత్నభవనం నందు నూతనంగా నెలకొల్పబడిన మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయాన్ని శుక్రవారం సాయంత్రం రఘువీరారెడ్డి ప్రారంభించారు.

Pages