S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/25/2016 - 01:32

అనంతపురం, మార్చి 24: రాయలసీమ జిల్లాల్లో గడచిన నాలుగైదు రోజులుగా కనీవిని ఎరుగని రీతిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అనంతపురం జిల్లాలో 11 సంవత్సరాల క్రితం, కర్నూలు జిల్లాలో 50 ఏళ్ల క్రితం, కడప జిల్లాలో 110 ఏళ్ల క్రితం నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల రికార్డులను గడచిన వారం రోజులుగా నమోదైన రికార్డులు బద్దలు చేశాయి.

03/25/2016 - 01:51

హైదరాబాద్, మార్చి 24: ఆంధ్రప్రదేశ్‌లో ఎస్‌సి, ఎస్‌టిల అభ్యున్నతికి ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి 2016-17 సంవత్సరం నుండి అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. దళితులు, గిరిజనుల సంక్షేమంపై గురువారం ఆయన సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. దళితులు, గిరిజనులు సమాజంలోని ఇతర వర్గాలతో సమానంగా ఎదిగేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

03/25/2016 - 04:25

అద్దంకి, మార్చి 24: అద్దంకి-నార్కట్‌పల్లి రాష్ట్ర రహదారిపై ప్రకాశం జిల్లా అద్దంకి మండలం చినకొత్తపల్లి వద్ద గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోరరోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వైద్యశాలకు తరలిస్తుండగా మరొకరు మృతిచెందాడు.

03/24/2016 - 17:13

ఒంగోలు: బంధువుల ఇంట్లో కర్మకాండకు హాజరై వెళుతుండగా కారు బోల్తాపడి నలుగురు మరణించిన ఘటన అద్దంకి మండలం చిన్నకొత్తపల్లి వద్ద గురువారం మధ్యాహ్నం జరిగింది. నెల్లూరు జిల్లా గూడురుకు చెందిన అయిదుగురు వ్యక్తులు గుంటూరు జిల్లా శ్రీరాంపురంలో కర్మకాండకు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో టైరు పేలడంతో కారు బోల్తాపడింది. సంఘటన స్థలంలో నలుగురు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆస్పత్రిలో చేర్పించారు.

03/24/2016 - 17:13

గుంటూరు: లా మొదటి సంవత్సరం పరీక్షలో చూచికాపీ కొడుతూ మాజీ ఎమ్మెల్యేతో పాటు మరో ఇద్దరు స్వ్కాడ్‌కు పట్టుబడ్డారు. గుంటూరు ఎసి కాలేజీలో గురువారం ఈ ఘటన జరిగింది. కాపీకి పాల్పడుతూ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ స్వ్కాడ్ అధికారులకు పట్టుబడడం ఇక్కడ చర్చనీయాంశమైంది.

03/24/2016 - 16:32

విజయవాడ: దేశద్రోహం కేసులో నిందితుడైన జెఎన్‌యు (దిల్లీ) విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్యకుమార్ సభ సందర్భంగా విజయవాడలో గురువారం ఘర్షణ వాతావరణం నెలకొంది. సభను జరగనివ్వమని ఓ వర్గం హెచ్చరిస్తుండగా, సభ జరిపి తీరుతామని ప్రత్యర్థి వర్గం సవాల్ విసరడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బహిరంగ సభలో ఇతరులను రెచ్చగొట్టేలా కన్నయ్య సహా ఎవరు మాట్లాడినా కేసులు నమోదు చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

03/24/2016 - 16:32

కడప: ఎర్రచందనం అక్రమరవాణాను నియంత్రించేందుకు త్వరలో కొత్త చట్టాన్ని అమలుచేయాలని యోచిస్తున్నట్లు ఎపి డిజిపి జెవి రాముడు గురువారం ఇక్కడ తెలిపారు. పోలీసు అధికారులతో జరిపిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఇసుకను అక్రమంగా తరలించేవారిని నియంత్రిస్తామని, పట్టణ ప్రాంతాల్లో నేరాలను అదుపుచేసేందుకు భారీగా సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు.

03/24/2016 - 16:20

చిత్తూరు: శ్రీకాళహస్తి మండంలం తొండమనాడు క్రాస్‌ దగ్గర చెట్టును కారు ఢీకొంది. ఈ ఘటనలో కారులో ఉన్నఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులు నెల్లూరు జిల్లా నవాబుపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

03/24/2016 - 16:18

హైదరాబాద్: త్వరలో టీడీపీలో మరిన్ని చేరికలు ఉంటాయని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. జగన్‌పై అపనమ్మకంతోనే వైసీపీ పార్టీ నాయకులు టీడీపీలో చేరుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

03/24/2016 - 12:33

చిత్తూరు: ఈతకు వెళ్లి చెరువులో మునిగి ఇద్దరు బాలురు మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా కలికిరి వద్ద గురువారం జరిగింది. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన దామోదర్, సరుూద్ అనే బాలురు కొంట్రేటికుంట చెరువులో ఈత కోసం దిగి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

Pages