-
విజయవాడ, ఏప్రిల్ 13: రాష్ట్ర ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో తాజాగా చోటుచేసుకున్న
-
గుంటూరు, ఏప్రిల్ 13: స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసి కరోనా మహమ్మారి నుంచ
-
విజయవాడ: కరోనా వైరస్ సోకిన బాధితులకు ఎయిమ్స్ వైద్యులతో మాట్లాడి అత్యుత్తమ వైద
-
విజయవాడ: రాష్ట్రంలో సోమవారం సాయంత్రానికి 439 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్: వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్ను సమర్థిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అహంకారం ఓడిపోయిందని, తన ఆవేదన గెలిచిందని టిడిపి ఎమ్మెల్యే అనిత అన్నారు. ఎమ్మెల్యేల హక్కులను కోర్టు కాపాడిందని, దీంతో దళితులకు ఆత్మగౌరవం దక్కిందన్నారు. అసెంబ్లీలో విపక్షనేత జగన్ పిల్లచేష్టలకు పాల్పడుతున్నారని ఆమె విమర్శించారు.
హైదరాబాద్: ఈనెల 29, 30 తేదీల్లో ఎపి అసెంబ్లీ సమావేశాలకు విధిగా హాజరై, ద్రవ్య వినిమయ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాల్సిందిగా ఆదేశిస్తూ వైకాపా మంగళవారం విప్ జారీ చేసింది. ఇటీవల పార్టీ నుంచి వీడిన 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ ఆదేశాలు పాటించాలని విప్ జారీ చేశారు. లిఖిత పూర్వకంగా ఇచ్చిన విప్ ఆదేశాలను స్వయంగా అందుకోకపోయినా, ఎమ్మెల్యేల ఇళ్లకు వీటిని అతికించాలని వైకాపా అధిష్ఠానం నిర్ణయించింది.
హైదరాబాద్: వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్పై సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ద్విసభ్య ధర్మాసనం కొట్టివేసింది. అసెంబ్లీ నుంచి ఏడాదిపాటు తనను సస్పెండ్ చేయడంపై రోజా హైకోర్టును గతంలో ఆశ్రయించగా, స్పీకర్ ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేస్తూ ఏకసభ్య ధర్మాసనం మధ్యంతర తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు.
కాకినాడ: ప్రేమపేరుతో ఓ కానిస్టేబుల్ తనను వంచించడంతో మనస్తాపానికి గురైన యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. సఖినేటిపల్లి మండలం శృంగవరపుపాడులో మంగళవారం ఈ ఘటన జరిగింది. సతీష్ అనే కానిస్టేబుల్ ప్రేమపేరుతో వంచించడంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆమె సూసైడ్ నోట్ రాసింది. దీంతో కానిస్టేబుల్ సతీష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
విశాఖ: నగర శివారులోని మధురవాడ వద్ద స్వతంత్రనగర్లో ఓ యువకుడు హత్యకు గురైన ఘటన మంగళవారం ఉదయం వెలుగుచూసింది. ఎవరో దుండగులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.
తిరుపతి: పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి మంగళవారం ఉదయం తన కుటుంబ సభ్యులతో శ్రీవేంకటేశ్వర స్వామి వారిని సందర్శించుకున్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
గుంటూరు: కాకుమాను మండలం బికె పాలెంలోని ఓ దాబాలో మంగళవారం ఉదయం మంటలు చెలరేగి ఆరు నెలల చిన్నారి సజీవ దహనమైంది. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
విశాఖ: నక్కపల్లి మండలం ఉపమాక వద్ద మంగళవారం ఉదయం ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో గాయపడిన పదిమంది చిన్నారులను ఆస్పత్రికి తరలించారు.
విశాఖపట్నం: సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో సంప్రదాయాలకు అధికారులు తిలోదకాలిస్తున్నారని విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ మండిపడ్డారు. ఆలయ సంప్రదాయాను పక్కనపెట్టి దేవాలయాలను రాజకీయ వేదికలుగా మార్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని స్వామీజీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
గుంటూరు: తాత్కాలిక సచివాలయ పనుల ప్రారంభంలో తొలి ఆపరేటర్గా సేవలందించిన పశ్చిమ బెంగాల్కు చెందిన సామ్రాట్ రౌత్(20) సోమవారం ఉదయం 6గంటల సమయంలో ఓ మిషన్ కింద పడి దుర్మరణం చెందాడు. తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామంలో ఎల్ అండ్ టి, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు 45.12 ఎకరాల్లో తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు చేపట్టిన విషయం తెలిసిందే.