S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/12/2016 - 07:26

ఆళ్లగడ్డ, మార్చి 11: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం బ్రహ్మోత్సవాలు ఈ నెల 13న ప్రారంభం కానున్నాయి. అహోబిల మఠం పీఠాధిపతి శ్రీవన్ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి ఆధ్వర్యంలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎగువ, దిగువ అహోబిలాల్లో 11 రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహిస్తారు. 13న ఎగువ అహోబిలంలో అంకురార్పణ జరుగుతుంది.

03/12/2016 - 07:26

మదనపల్లె, మార్చి 11: ఓ తల్లీబిడ్డ వ్యవసాయబావిలో శవాలుగా ప్రత్యక్షమైన సంఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం మదనపల్లె మండలం కోళ్ళబైలు పంచాయతీ దిగువమామిడిగుంతలపల్లెకు చెందిన సోమశేఖర్‌రెడ్డి కవిత దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు.

03/12/2016 - 07:25

తిరుమల, మార్చి 11: తిరుమల్లో త్వరలో రూ.7కోట్లతో రిలయన్స్ ఉచిత సేవలను అందించనున్నట్లు టిటిడి చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి తెలిపారు. శుక్రవారం తిరుమల్లో తనను కలిసిన విలేఖరులతో ఆయన మాట్లాడుతూ తిరుమల్లో ఈ-దర్శన్ కౌంటర్లు తొలగించడం బాధకరమని ఆయన టిటిడి అధికారుల తీరుపై పరోక్షంగా అసంతృప్తి వ్యక్తం చేశారు.

03/12/2016 - 07:24

గూడెంకొత్తవీధి, మార్చి 11: విశాఖ ఏజన్సీలోని జికెవీధి మండలం మొండిగెడ్డ తెలుగుదేశం పార్టీ ఎంపిటిసి డి.తెల్లన్నదొరను శుక్రవారం మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మారుమూల గిరిజన గ్రామమైన మొండిగెడ్డలోని తన ఇంట్లో ఉన్న తెల్లన్నదొరను మావోలు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

03/12/2016 - 07:24

విజయపురిసౌత్, మార్చి 11: కృష్ణా రివర్ బోర్డు ఆదేశాల మేరకు కృష్ణాడెల్టా ప్రాంతంలో మంచినీటి అవసరాల కోసం శుక్రవారం మధ్యాహ్నం నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి ప్రధాన జలవిద్యుత్ కేంద్రం ద్వారా నీటిని జెన్కో ఎస్‌ఈ రాజనర్సయ్య విడుదల చేశారు. రోజుకు 4 వేల క్యూసెక్కుల చొప్పున రెండు టిఎంసిల నీటిని మూడు రోజుల పాటు విడుదల చేయనున్నట్లు తెలిపారు.

03/12/2016 - 07:23

తిరుమల, మార్చి 11: టిటిడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి విశాఖపట్నంకు చెందిన మైత్రి ఐ ఎన్‌ఎఫ్‌ఆర్‌ఏ ఎండి తెల్లా శ్రీనివాసరావు శుక్రవారం రూ.కోటి 11రూపాయలను విరాళంగా అందించారు. విరామ సమయంలో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఆయన టిటిడి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని కలిసి అన్నదానం ట్రస్టుకు డి డి రూపంలో విరాళాన్ని అందించారు.

03/12/2016 - 07:01

వైకాపా ఎమ్మెల్యేల ధ్వజం

03/12/2016 - 07:00

* సామర్థ్యాల శిక్షణవైపు మొగ్గు!
* హామీల అమలుపై అయోమయంలో టిడిపి

03/12/2016 - 06:57

హైదరాబాద్, మార్చి 11: ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు అదనపు ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాజమండ్రి అర్భన్ ఎస్పీ కార్యాలయంలో ఉన్న డి.సిద్దారెడ్డిని డిజిపి కార్యాలయానికి, తిరుపతి అర్భన్‌లో ఉన్న ఎస్.త్రిమూర్తులును తిరుమలకు బదిలీ చేసింది.

03/12/2016 - 05:07

బాబుకు లండన్ పారిశ్రామికవేత్తల హామీ త్వరలో అమరావతికి పరిశీలక బృందాలు

Pages