S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/10/2016 - 07:15

సూళ్లూరుపేట: మరో చారిత్రక ప్రయోగానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సిద్ధమైంది. మరో కొన్ని గంటల వ్యవధిలోనే ఇస్రో శాస్తవ్రేత్తలు సొంత నావిగేషన్ వ్యవస్థ అధ్యయానికి సర్వసిద్ధం చేశారు. సరికొత్త స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహ ప్రయోగం విజయవంతమైతే మనకు సొంత నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.

03/10/2016 - 07:10

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ను కరవు రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టును 2018లోగా కేంద్రమే పూర్తి చేస్తామంటే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అప్పగిస్తామని ఆయన తెలిపారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఆయన బుధవారం అసెంబ్లీలో సుదీర్ఘంగా ప్రసంగించారు. కొత్త రాష్ట్రానికి కేంద్రం ఇతోధికంగా సహాయం చేయాల్సి ఉందని అన్నారు.

03/10/2016 - 07:09

నరసాపురం: ప్రఖ్యాత వ్యవసాయ శాస్తవ్రేత్త , మాజీ ఎమ్మెల్సీ పద్మశ్రీ డాక్టర్ ఎంవి రావు (87) మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతిచెందారు. ఆయనకు ఒక కుమారుడు, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జన్మించిన డాక్టర్ ఎంవి రావు భారత వ్యవసాయ పరిశోధనా రంగానికి ఎనలేని సేవచేశారు. ఆకుపచ్చ విప్లవ సేనానిగా ఆయన గుర్తింపుపొందారు.

03/10/2016 - 07:07

హైదరాబాద్: 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తర్వాత ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు గురువారం ముచ్చటగా మూడో సంవత్సరం రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించేందుకు రంగం సిద్ధమైంది. ఆర్థిక మంత్రి బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ముందు లాంఛనంగా దీనికి మంత్రివర్గం ఆమోదం కావాల్సి ఉంటుంది. అందువల్ల ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమవుతోంది.

03/10/2016 - 07:07

హైదరాబాద్, మార్చి 9: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్రాహ్మణ సామాజిక వర్గ సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంస్థ లిమిటెడ్‌కు మరిన్ని అదనపు నిధులను సమకూర్చేందుకు సిద్ధంగా ఉందని దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు చెప్పారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో కోన రఘుపతి అడిగిన ప్రశ్నకు మంత్రి బదులు ఇచ్చారు. 2014-15 సంవత్సరానికి రూ. 25 కోట్లు, 2015-16 సంవత్సరానికి రూ.

03/10/2016 - 05:57

హైదరాబాద్: రాజధాని అమరావతిపై అసెంబ్లీ రణరంగమే అయ్యింది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ అధికార, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల పరస్పర దూషణలు, నిందారోపణలు దద్దరిల్లింది. సవాళ్లు, ప్రతి సవాళ్లతో అట్టుడికింది.

03/10/2016 - 05:52

హైదరాబాద్: ఓత్ ఆఫ్ సీక్రసీని ఉల్లంఘిస్తూ రాజధాని అమరావతి సమచారాన్ని సిఎం చంద్రబాబే మంత్రులకు లీక్ చేశారని, ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు తెరలేపారని విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర అభియోగాలు మోపారు. సమాచారం తెలుసుకున్న మంత్రులు అమరావతి చుట్టూ భారీగా భూములు కొనుగోలు చేసిన విషయాలు తమ వద్ద ఆధారాలతో ఉన్నాయన్నారు. మొత్తం వ్యవహారంపై విచారణకు సిబిఐని రంగంలోకి దించితే ఆధారాలు అందిస్తామని స్పష్టం చేశారు.

03/10/2016 - 05:13

హైదరాబాద్: అమరావతి భూముల వ్యవహారంపై విపక్షనేత జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలకు రుజువులు చూపిస్తే, సంబంధిత మంత్రులను తక్షణం డిస్మిస్ చేస్తానని సిఎం చంద్రబాబు సవాల్ చేశారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై మాట్లాడుతూ అవినీతి ఆరోపణలు చేసిన మీవద్ద రుజువులుంటే తక్షణం స్పీకర్‌కు అందించాలని జగన్‌ను డిమాండ్ చేశారు. ఆరోపణలు రుజువైతే మంత్రులను డిస్మిస్ చేస్తానన్నారు.

03/10/2016 - 05:05

పుంగనూరు: చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో బుధవారం విషాదం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్త కన్నకూతురిని లైంగికంగా వేధిస్తుండటంతో తట్టుకోలేక ఆ తలి బిడ్డలపై కిరోసిన్ పోసి తానూ నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఎస్సై హరిప్రసాద్ కథనం ప్రకారం ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఎస్‌కే రహమాన్ పదేళ్ల క్రితం బతుకుదెరువు కోసం భార్యాబిడ్డలతో పుంగనూరుకు వలసవచ్చాడు.

03/09/2016 - 19:36

న్యూదిల్లి:టి-20 ప్రపంచకప్ పోటీల్లో భాగంగా ఈనెల 19న ధర్మశాలలో జరగాల్సిన మ్యాచ్ కోల్‌కతాలో నిర్వహించేందుకు ఐసిసి అనుమతించినప్పటికీ భారత్‌నుంచి తమ జట్టుకు గట్టి భద్రత ఇస్తామన్న హామీ వస్తేనే పాకిస్తాన్ ఆ పోటీలో పాల్గొంటుందని పాకిస్తాన్ ప్రభుత్వం పేర్కొంది. ఇంతవరకు తమకు భారత్‌నుంచి అలాంటి హామీ ఏమీ లభించలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారులు తెలిపారు.

Pages