S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/23/2020 - 06:31

నెల్లూరు, మార్చి 22 : కోవిడ్-19 (కరోనా వైరస్)ను నియంత్రించే చర్యల్లో భాగంగా ప్రధానమంత్రి పిలుపు మేరకు ఆదివారం చేపట్టిన జనతా కర్ఫ్యూ జిల్లాలో విజయవంతంగా కొనసాగింది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ ఈ స్వీయ నిర్బంధం కొనసాగించాలని ప్రధాని పిలుపునిచ్చారు. అయితే జిల్లాలో తెల్లవారుజాము నుంచే ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండిపోయారు.

03/23/2020 - 06:29

పిఠాపురం, మార్చి 22: ఒక పక్క కరోనా మహమ్మారికి అందరూ వణికిపోతుంటే పిఠాపురంలో ఓ కుటుంబం విదేశాల నుండి వచ్చిన వధూవరులకు వివాహం జరిపించడానికి సిద్ధమైంది. విషయం తెలుసుకున్న అధికారులు రంగప్రవేశం చేయడంతో వారికి వైద్యపరీక్షలు నిర్వహించి ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

,
03/23/2020 - 06:27

కర్నూలు/అనంతపురం/కడప, మార్చి 22: కరోనా (కొవిడ్-19)వైరస్ ప్రస్తుతం దేశంలో 2వ దశలో వుందని, ఈ వైరస్ మరింత విస్తరించకుండా అరికట్టేందుకు ప్రజలు కూడా సహకరించాలని దేశ ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపునకు రాయలసీమ ప్రజలు స్పందించి ఆదివారం స్వచ్ఛందంగా గృహ నిర్బంధం పాటించారు. మునుపెన్నడూ లేనివిధంగా ప్రజలు కరోనా భయంతో ఇళ్లను వదిలి బయటకు రాలేదు.

03/23/2020 - 06:03

విజయవాడ, మార్చి 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలంతా ఆదివారం 14 గంటలపాటు జనతా కర్ఫ్యూ పాటించిన సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఒక ప్రకటనలో ధన్యవాదాలు తెలిపారు. ప్రధానంగా అహర్నిశలు సేవలందిస్తున్న వైద్య బృందాలు, వారికి సహకరిస్తున్న పోలీసు యంత్రాంగానికి గవర్నర్ ప్ర త్యేక ధన్యవాదాలు తెలిపారు.

03/23/2020 - 05:59

గుంటూరు, మార్చి 22: విదేశాల నుండి రాష్ట్రానికి వస్తున్న వారిలోనే అధిక శాతం కరోనా వైరస్ లక్షణాలు కన్పిస్తున్నాయని, ఈ దృష్ట్యా ఎవరైనా విదేశాల నుండి వస్తే విధిగా నిబంధనలు పాటించాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పష్టం చేశారు. ఆదివారం ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేస్తూ విదేశాల నుండి వచ్చినవారు వైద్య ఆరోగ్య శాఖకు కచ్చితంగా సమాచారం అందించాలన్నారు. ఈ విషయంలో వారి తల్లిదండ్రులు కూడా సహకరించాలని కోరారు.

03/23/2020 - 05:58

విజయవాడ (రైల్వేస్టేషన్), మార్చి 22: కరోనా వైరస్ కారణంగా ఆదివారం అర్ధరాత్రి 12గంటల నుంచి ఈ నెల 31వరకు భారతీయ రైల్వే అంతటా రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నారని దక్షిణ మధ్య రైల్వే పౌర సంబంధాల ప్రధానాధికారి సీహెచ్ రాకేష్ ఒక ప్రకటనలో తెలిపారు.

03/23/2020 - 01:21

అమరావతి: బలహీన వర్గాల ప్రజలకు గృహ నిర్మాణం పథకంలో ప్రభు త్వం నూతన అధ్యయనానికి శ్రీకారం చుట్టనుంది. దేశంలోనే తొలిసారిగా ఇండో - స్విస్ ఇంధన సామర్థ్య సాంకేతికతను బలహీన వర్గాల గృహ నిర్మాణంలో వినియోగించనున్నారు. సుమారు 30లక్షల ఇళ్లలో ఈ నూతన సాంకేతికత ఉపయోగించటం ద్వారా ఇళ్లలో ఉష్ణోగ్రత 4నుంచి 8డిగ్రీల వరకు తగ్గటంతో పాటు కనీసం 20శాతం మేర విద్యుత్ ఆదా చేయాలని సంకల్పించారు.

03/23/2020 - 01:16

అమరావతి, మార్చి 22: కరోనా నియంత్రణలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రంలో ‘జనతా కర్ఫ్యూ’ స్వచ్ఛందంగా జరిగింది. పూర్తిస్థాయిలో విజయవంతమైంది.. రాష్టవ్య్రాప్తంగా 90శాతం మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించింది. కర్ఫ్యూతో కరోనాను కట్టడి చేయవచ్చనే భావనతో ఎవరికి వారు స్వచ్ఛందంగా ఇళ్లలోంచి బయటకు కదల్లేదు.

03/23/2020 - 01:11

విజయవాడ, మార్చి 22: కరోనా వైరస్‌ను నియంత్రించే చర్యల్లో రాష్ట్రంలోనూ ఈ నెల 31వరకూ లాక్‌డౌన్ చేయనున్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ఐసోలేషన్ ఒక్కటే మార్గమని, ఎవరూ తిరగకుండా ఉంచగలిగితే కట్టడి చేయగలమనే విశ్వాసం వ్యక్తం చేశారు. టెన్త్ పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని, ప్రజారవాణాను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు.

03/22/2020 - 04:35

*చిత్రం... విజయవాడలో బోసిపోయిన ఓ మెగా షాపింగ్ మాల్

Pages