S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌

03/19/2020 - 01:11

విజయవాడ, మార్చి 18: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వైరస్ వ్యాప్తి కట్టడికి ముందస్తు చర్యల్లో భాగంగా అన్ని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. గురువారం నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, వర్సిటీలు, కోచింగ్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించింది.

03/19/2020 - 01:08

విశాఖపట్నం/అక్కిరెడ్డిపాలెం, మార్చి 18: ఫిలిప్పీన్స్‌లో వైద్య విద్యనభ్యసిస్తూ కౌలాలంపూర్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులు ఎట్టకేలకు విశాఖ చేరుకున్నారు. సుమారు 185 మంది వైద్యవిద్యార్థులు ఫిలిప్పీన్స్ నుంచి కౌలాలంపూర్ మీదుగా స్వస్థలాలకు చేరుకోవాల్సి ఉంది. కరోనా కారణంగా ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు నిషేధం అమలవుతున్న నేపథ్యంలో వీరంతా కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు.

03/19/2020 - 01:06

అమరావతి: రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎన్నికలకు ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. వచ్చే నెలతో నలుగురు అభ్యర్థుల పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో నాలుగు స్థానాలకు ఖాళీ ఏర్పడింది. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులుగా మంత్రులు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వర్ల రామయ్య పోటీలో ఉన్నారు.

03/19/2020 - 01:03

విజయవాడ: దేశంలో కరోనా విజృంభణ ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. బుధవారం వెలువడిన సుప్రీం కోర్టు తీర్పును రాజకీయ నాయకులు ఎవరికి వారు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. ఎన్నికల వాయిదాను విపక్షాలు, ఎన్నికల కోడ్ ఎత్తివేతను అధికార పక్షం స్వాగతిస్తున్నాయి.

03/18/2020 - 13:25

తిరుమల: తిరుమల శ్రీవారి పుష్కరణిని మూసివేశారు. నిత్యం వేలాదిమంది భక్తులు వచ్చే తిరుమలను ఏడు విభాగాలుగా చేసి ఆరోగ్య విభాగం అధికారులు నిత్యం రసాయనాలతో శుభ్రం చేస్తున్నారు. ఇందులో భాగంగా వైకుంఠం క్యూకాంప్లెక్స్, అన్నదాన సత్రం, కల్యాణకట్టలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తిరుమల శ్రీవారి పుష్కరణిని మూసివేసి భక్తుల కోసం ప్రత్యేకంగా స్నానపు గదులను ఏర్పాటుచేశామని తెలిపారు.

03/18/2020 - 06:35

విజయవాడ (సిటీ), మార్చి 17: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోతే కేంద్ర వద్ద నుంచి రావాల్సిన నిధులను ఏదోవిధంగా కేంద్రాన్ని ఒప్పించి తెచ్చుకోవచ్చని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కానీ వైసీపీ నాయకుల బెదిరింపులకు భయపడి రాష్ట్రం నుండి వెనక్కిపోయిన పరిశ్రమలను తిరిగి ఎలా తీసుకొస్తామని మంగళవారం ట్విట్టర్‌లో ప్రశ్నించారు. విశాఖలో రూ.

03/18/2020 - 06:23

చిత్తూరు, మార్చి 17: ఎన్నికల కోడ్ నిబంధనలపై కనీస అవగాహన కూడా లేకుండా చిత్తూరులో అధికారులు వ్యవహరిస్తున్నారు. దివంగత మాజీ ప్రజాప్రతినిధులు, దివంగత రాజకీయ ప్రముఖుల విగ్రహాలకు ముసుగులు వేయకూడదని ఎన్నికల కమిషన్ ఓ వైపు చెబుతున్నా అధికారులు మాత్రం ఈసీ నిబంధనలు పెడచెవిన పెడుతున్నారు.

03/18/2020 - 06:21

గుంటూరు, మార్చి 17: వ్యవస్థలో ఉన్న వ్యక్తులు తప్పుచేస్తే ప్రశ్నించే అధికారం తమకు ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషన్ స్థాయి పెంచేలా కమిషనర్ వ్యవహరించాలే తప్ప సొంత అభిప్రాయాలతో ఎవరినీ ఇబ్బందులకు గురిచేయకూడదన్నారు.

03/18/2020 - 06:20

విజయవాడ, మార్చి 17: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గినా ఆ ప్రయోజనాన్ని వినియోగదారులకు ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పెంచడం గర్హనీయమని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో నిరసన తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్యారెల్ ముడిచమురు ధర 63డాలర్ల నుంచి 33డాలర్లకు తగ్గిందన్నారు.

03/18/2020 - 06:20

గుంటూరు, మార్చి 17: రాష్ట్రంలో ప్రతిపక్షాలు లేకుండా చేయాలన్న కుట్రలో భాగంగా ప్రభుత్వం, పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. మంగళవారం గుంటూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ మాజీ జాతీయ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ 82వ జయంతి వేడుకలు నిర్వహించారు.

Pages