S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/14/2020 - 04:33

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: స్విగ్గీ.. నగర యువతకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఇది. అవును, వినియోగదారులకు సమీపంలోని ఏ హోటల్ నుంచి ఏ ఆహారం కావాలో యాప్ ద్వారా ఆర్డర్ తీసుకొని, వాటిని ఆయా హాటళ్లలో తయారు చేయించి సరఫరా చేస్తున్న సంస్థ ఇది. అయితే, స్విగ్గీ ఇప్పుడు ‘బ్రాండ్‌వర్క్స్’ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించింది.

02/14/2020 - 04:31

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 13: మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా) ఇనె్వస్టర్లపై ఒక డిజిటల్ సర్వే చేయడానికి ఒక ఏజెన్సీని నియమించాలని భావిస్తోంది. కొత్త తరం మదుపరుల ఆర్థిక పొదుపు, పెట్టుబడుల విషయంలో వారి వైఖరిని అర్థం చేసుకోవడానికి సెబికి ఈ సర్వే తోడ్పడుతుంది. దీంతోపాటు హౌస్‌హోల్డ్ ఇనె్వస్టర్లపై ఒక అధ్యయనం చేయించడానికి కూడా సెబి కసరత్తు చేస్తోంది.

02/14/2020 - 04:25

గుంటూరు, ఫిబ్రవరి 13: ఆసియా ఖండంలోనే పెద్దదైన గుంటూరు మిర్చియార్డుకు గురువారం ఒక్కరోజే 1,57,250 బస్తాలను రైతులు విక్రయించుకునేందుకు తీసుకువచ్చారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మిర్చి ఎగుమతుల్లో మాంద్యం నెలకొంది. ధరలు పతనమవుతున్న నేపథ్యంలో రైతులు తమ సరుకును అమ్ముకునేందుకు మిర్చియార్డులో బారులు తీరుతున్నారు.

02/13/2020 - 07:31

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం బలపడ్డాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్‌ఈ) సెనె్సక్స్ వరుసగా రెండో రోజు బుధవారం తన ర్యాలీని కొనసాగించి 350 పాయింట్లు పుంజుకుంది. ప్రపంచ స్టాక్ మార్కెట్లలో సానుకూల ధోరణి నెలకొన్న తరుణంలో హెచ్‌యూఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, ఆర్‌ఐఎల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు రాణించడంతో సెనె్సక్స్ బాగా పైకి ఎగబాకింది.

02/13/2020 - 06:54

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: టాటా ట్రస్ట్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా శ్రీనాథ్ నరసింహన్ నియమితులయ్యారు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ నియామకం అమలులోకి వ స్తుంది. శ్రీనాథ్ నరసింహన్‌ను తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా నియమించాలని తమ ట్రస్టీ లు నిర్ణయించారని టాటా ట్రస్ట్స్ బుధవా రం తెలిపింది.

02/13/2020 - 06:53

*సాల్ట్ లేక్ వద్ద మెట్రో రైలు ట్రయల్ రన్. కోల్‌కతాలోని ఈస్ట్-వెస్ట్ మెట్రో అధ్వర్యంలో సాల్ట్ లేక్ నుంచి యువ భారతి క్రీడాంగణ్ వరకు వేసిన ఈ మెట్రో లైన్‌ను రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ గురువారం ప్రారంభిస్తారు.

02/13/2020 - 06:51

*ముంబయిలో బుధవారం జరిగిన నాస్కాం టెక్నాలజీ లీడర్‌షిప్ ఫోరం సదస్సులో మాట్లాడుతున్న టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్. వ్యాపార, వాణిజ్య రంగాల్లో నాయకత్వం ప్రతిభ అవసరాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు.

02/13/2020 - 06:49

*చెన్నై సమీపంలోని శ్రీపెరుంబుదూరులో సియట్ ప్లాంట్‌ను ఆవిష్కరించిన తర్వాత విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సియట్ టైర్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అనంత్ గోయెంక. ఈ కంపెనీకి ఇప్పటికే బంధూప్, ముంబయి, నాసిక్, హలోల్, నాగపూర్‌లో తయారీ కేంద్రాలు ఉన్నాయి. త్వరలో పెరుంబుదూర్ యూనిట్‌లో ఉత్పత్తి ప్రారంభమవుతుంది.

02/12/2020 - 23:20

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12:ఓరియంటర్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లకు మరిన్ని పెట్టుబడులు ఇచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

02/12/2020 - 06:25

ముంబయి: ఈవారం ట్రేడింగ్ మొదటి రోజునే నష్టాలను ఎదుర్కొన్న భారత స్టాక్ మార్కెట్లు మంగళవారం కోలుకున్నాయి. బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్‌ఈ)లో సెన్సెక్స్ 236.52 పాయింట్లు మెరుగుపడి, 41,216.14 పాయింట్లకు చేరగా, జాతీయ స్టాక్ ఎక్ఛ్సేంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో నిఫ్టీ 76.40 పాయింట్లు లాభపడి 12,107.90 పాయింట్లుగా నమోదైంది. సెనె్సక్స్ ప్రారంభంలో పరుగులు తీసినప్పటికీ, ఆతర్వాత నష్టాల్లోకి జారుకుంది.

Pages