S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

03/16/2020 - 05:01

న్యూఢిల్లీ, మార్చి 14: అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గిన మేరకు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించవలసిన మోదీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఎక్సైజ్ పన్ను పెంచటం ద్వారా తన ఆదాయాన్ని పెంచుకుని వినియోగదారులకు మొండి చెయ్యి చూపించింది. పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ పన్నును 3 రూపాయలు పెంచేసింది.

03/16/2020 - 04:56

విజయవాడ (గాంధీనగర్) మార్చి 15 : ప్రపంచ వ్యాప్తంగా భయభ్రాంతులకు గురిచేస్తున్న కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల ప్రజలను కూడా వణికిస్తోంది. ఈ వైరస్ రోజురోజుకూ వ్యాప్తి చెందుతోందని, దానిని నివారించడానికి దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు చేపడుతున్నారు. ఈనేపథ్యంలో ఏపీలో స్థానిక ఎన్నికల సైతం ఆరు వారాలపాటు వాయిదా పడిన విషయం తెలిసిందే.

03/15/2020 - 05:46

న్యూఢిల్లీ: మొబైల్ ఫోన్ విడిభాగాలపై వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పెరగనుంది. ఫలితంగా మొబైల్ ఫోన్లు మరింత ప్రియం కానున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన శనివారం జరిగిన జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో మొబైల్ ఫోన్ స్పేర్ పార్ట్స్‌పై పన్నును 12 నుండి 18 శాతానికి పెంచాలని తీర్మానించింది.

03/15/2020 - 01:49

హైదరాబాద్, మార్చి 14: అంతర్జాతీయంగా మానవ రహిత విమానాల (డ్రోన్) తయారీలో అగ్రగామిగా ఉన్న డీజేఐ సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. బేగంపేట విమానాశ్రయంలో జరుగుతున్న ఎయిర్ షో కార్యక్రమానికి మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు, ఐటీ శాఖ మ్యు కార్యదర్శి జయేష్ రంజన్, డీజేఐ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు.

03/15/2020 - 00:25

ముంబయి, మార్చి 14: కరోనా వైరస్ మనుషులనేకాదు.. భారత్‌సహా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాల స్టాక్ మార్కెట్లను పట్టిపీడిస్తున్నది. మొత్తం ఆర్థిక వ్యవస్థలనే తల్లకిందులు చేస్తున్నది. భారత స్టాక్ మార్కెట్లకు ఈవారం కరోనా వైరస్ దెబ్బ తప్పలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు షేర్ల ధరలు భారీగా పతనం కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది.

03/13/2020 - 05:57

ముంబయి: కరోనా వైరస్‌ను ఒక మహమ్మారిగా అభివర్ణిస్తూ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూటీవో) చేసిన ప్రకటన భారత స్టాక్ మార్కెట్లను నిలువునా ముంచేసింది. ఎనర్జీ, బ్యాంక్, ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఇండస్ట్రీస్, ఐటీ సెక్టార్ల షేర్లు దారుణంగా నష్టపోయాయి.

03/13/2020 - 05:44

ముంబయి, మార్చి 12: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఎస్ బ్యాంక్‌ను ఒడ్డుకు చేర్చేందుకు ఎస్బీఐ నడుం బిగించింది. 7,250 కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టనున్నట్టు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. తద్వారా ఆ బ్యాంక్ 49 శాతం ఈక్విటీ వాటాలను ఎస్బీఐ సొంతం చేసుకుంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇటీవల ప్రకటించిన రెస్క్యూ ప్లాన్‌లో భాగంగానే ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

03/13/2020 - 05:42

న్యూఢిల్లీ, మార్చి 12: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమయిన ఔషధాలను తయారు చేస్తున్న, పంపిణీ చేస్తున్న కంపెనీలకు తాను 200 డాలర్ల (సుమారు రూ.1,480 కోట్లు) నిధులు సమకూర్చనున్నట్టు ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) గురువారం నాడు తెలిపింది.

03/13/2020 - 05:42

న్యూఢిల్లీ, మార్చి 12: ఎస్ బ్యాంకుపై విధించిన తాత్కాలిక ఆంక్షలు ఆ బ్యాంకుతో సంబంధం ఉన్న అనేక కార్పొరేట్ సంస్థలపై తాత్కాలికంగా ప్రభావం చూపుతుందని, బ్యాంకు సాధారణ సేవల పునరుద్ధరణలో జరిగే జాప్యం సమీప భవిష్యత్తులో దాని కొంతమంది ఖాతాదారుల ద్రవ్యలభ్యతపై ప్రభావం చూపుతుందని రేటింగ్ ఏజెన్సీ ‘ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్’ (ఇండ్-రా) పేర్కొంది.

03/13/2020 - 05:41

న్యూఢిల్లీ, మార్చి 12: ఇన్ఫోసిస్ డిజైన్ చేసిన జీఎస్‌టీ నెట్‌వర్క్‌లో 17 అసంతృప్త అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించింది. జమ్మూకాశ్మీర్‌లో పన్ను చెల్లింపుదారులు మార్పుకు సంబంధించిన సమస్యలు ఎదుర్కోవడం, ఆధార్ తనిఖీ, సర్వర్ విస్తరణ కొరత వంటి సమస్యలు కూడా వీటిలో ఉన్నాయి.

Pages