S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

08/19/2017 - 00:06

న్యూఢిల్లీ, ఆగస్టు 18: సహజవాయువులాంటి పెట్రోలియం ఉత్పత్తులపై అమ్మకం పన్ను లేదా విలువ ఆధారిత పన్ను(వ్యాట్)ను తగ్గించాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక లేఖ రాశారు. పెట్రోలియం ఉత్పత్తులను గత జూలై 1నుంచి అమలులోకి వచ్చిన వస్తు సేవల పన్ను(జిఎస్‌టి) పరిధినుంచి మినహాయించినప్పటికీ జిఎస్‌టి పరిధిలోకి వచ్చే వస్తువుల్లో ఇన్‌పుట్స్‌గా ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే.

08/19/2017 - 00:05

న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశంలో పెద్ద నోట్ల రద్దు ప్రక్రియ విజయవంతమవడం కొత్తగా ఎంతో మంది పన్నుల వ్యవస్థ పరిధిలోకి వచ్చి ప్రభుత్వ రెవెన్యూ రాబడులు స్థిరంగా పెరిగేందుకు దోహదం చేస్తుందని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో స్పష్టం చేసింది.

08/19/2017 - 00:05

న్యూఢిల్లీ, ఆగస్టు 18: ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్‌ఓ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రావిడెంట్ ఫండ్ (పిఎఫ్) డిపాజిట్లపై చెల్లించే వడ్డీ రేటును త్వరలో జరుగనున్న ట్రస్టీల సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది. దేశంలోని 4.5 కోట్ల మందికిపైగా పిఎఫ్ చందాదారులకు 2015-16లో 8.8 శాతం వడ్డీ చెల్లించిన ఇపిఎఫ్‌ఓ గత ఆర్థిక సంవత్సరం (2016-17)లో దానిని 8.65 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే.

08/19/2017 - 00:04

హైదరాబాద్, ఆగస్టు 18: పరిశ్రమలకు కేటాయించిన భూములను నిర్ణీత కాలపరిమితిలోగా వినియోగంలోకి తీసుకుని వచ్చేందుకు కొత్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు రాష్ట్ర పారిశ్రామిక వౌలిక సదుపాయాల కల్పనా సంస్ధ (టిఎస్-ఐఐసి) చైర్మన్ గ్యాదరి బాలమల్లు తెలిపారు. శుక్రవారం టిఎస్-ఐఐసి చైర్మన్ గ్యాదరి బాలమల్లు అధ్యక్షతన సంస్ధ 13వ పాలకవర్గం (బోర్డు) సమావేశం జరిగింది.

08/19/2017 - 00:03

న్యూఢిల్లీ, ఆగస్టు 18: దేశంలో రెండవ అతిపెద్ద ఐటి కంపెనీ అయిన ఇన్ఫోసిస్ సిఈఓ పదవికి విశాల్ సిక్కా రాజీనామాకు కంపెనీ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎన్‌ఆర్ నారాయణమూర్తి ‘నిరంతర విమర్శలే’ కారణమని ఆ కంపెనీ బోర్డు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. సిక్కా నాయకత్వంలో కంపెనీ రెవిన్యూ పరంగా మంచి ఫలితాలనే సాధించిందని కూడా బోర్డు ప్రశంసించింది.

08/18/2017 - 00:26

ముంబయి, ఆగస్టు 17: అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో గురువారం వరసగా మూడో రోజూ లాభాల బాటలో సాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు చివర్లో అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా ప్రారంభంలో వంద పాయింట్లకు పైగా లాభపడిన బిఎస్‌ఇ సెనె్సక్స్ ఆ లాభాలన్నిటినీ కోల్పోయి చివరికి 24 పాయింట్ల స్వల్ప లాభాలకే పరిమితమైంది. నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజి సూచీ నిఫ్టీ సైతం కేవలం 7 పాయింట్లే లాభపడింది.

08/18/2017 - 00:25

వాషింగ్టన్, ఆగస్టు 17: అభివృద్ధి అవసరాల నిమిత్తం భారత్‌కు దీర్ఘ కాలం పాటు ముడి చమురును సరఫరా చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హామీ ఇవ్వడంతో ఇరు దేశాల మధ్య మళ్లీ చమురు వ్యాపారం మొదలైంది. దీంతో అమెరికా నుంచి తొలుత దిగుమతి అవుతున్న 100 మిలియన్ డాలర్ల విలువైన ముడి చమురు వచ్చే నెలలో మన దేశానికి చేరుకోనుంది.

08/18/2017 - 00:23

న్యూఢిల్లీ, ఆగస్టు 17: అంతర్జాతీయ రిటైల్ మార్కెట్ అభివృద్ధి సూచీ (గ్లోబల్ రిటైల్ డెవలప్‌మెంట్ ఇండెక్స్)లో మన దేశం చైనాను అధిగమించింది. అంతర్జాతీయ బ్రాండ్లకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా భారత రిటైల్ మార్కెట్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతను ఇది స్పష్టం చేస్తోందని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ ‘సిబిఆర్‌ఇ సౌత్ ఏషియా’ తన నివేదికలో పేర్కొంది.

08/18/2017 - 00:21

న్యూఢిల్లీ, ఆగస్టు 17: షాపూర్‌జీ పల్లోంజీ (ఎస్‌పి) గ్రూపుతో అన్ని రకాల వ్యాపార లావాదేవీలను తెగతెంపులు చేసుకునే దిశగా కొత్త చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ ఆధ్వర్యంలోని టాటా గ్రూపు అడుగులు వేస్తోంది. ఎస్‌పి గ్రూపును టాటా సన్స్ సంస్థ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్ర్తి నడుపుతున్న విషయం తెలిసిందే.

08/18/2017 - 00:18

బెంగళూరు, ఆగస్టు 17: దేశంలో రెండవ అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సేవల సంస్థ అయిన ఇన్ఫోసిస్ డైరెక్టర్ల బోర్డు రూ. 13 వేల కోట్లరూపాయల షేర్ల బైబ్యాక్ ప్రతిపాదనపై శనివారం (19న) నిర్ణయం తీసుకోనుంది. షేర్ల బైబ్యాక్ అనేది 36 ఏళ్ల ఇన్ఫోసిస్ చరిత్రలోనే మొదటిసారి .

Pages