S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

02/23/2017 - 07:35

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ నేతృత్వంలోని, భారతీయ ఈ-కామర్స్ దిగ్గజాల్లో ఒకటైన స్నాప్‌డీల్.. వ్యయ నియంత్రణ దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే 500-600 మంది ఉద్యోగులను తొలగించనుంది. దీన్ని సంస్థ కూడా ధృవీకరించింది. మరోవైపు సంస్థ వ్యవస్థాపకులైన కునాల్ భల్, రోహిత్ బన్సాల్ తాము వేతనాలు తీసుకోబోమని ప్రకటించారు. అయితే ఎంతకాలం అన్నది తెలియరాలేదు.

02/23/2017 - 07:33

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: కొత్తగా వెయ్యి రూపాయల నోట్లను తెచ్చే ఉద్దేశమేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ బుధవారం స్పష్టం చేసింది. కొత్తగా మళ్లీ 1,000 రూపాయల నోట్లు వస్తున్నాయన్న ఊహాగానాల మధ్య పైవిధంగా స్పందించింది. కాగా, 500 రూపాయల నోట్లు, అంతకంటే తక్కువ విలువైన నోట్ల సరఫరాను పెంచే దిశగానే వెళ్తున్నామని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ చెప్పారు.

02/23/2017 - 07:32

ముంబయి, ఫిబ్రవరి 22: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వేగవంతంగా జరుగుతున్న కొత్త నోట్ల సరఫరాతో ఈ జనవరి-మార్చి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పరుగులు పెట్టగలదన్న విశ్వాసాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ వ్యక్తం చేశారు. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం (2016-17)లో భారత జిడిపి వృద్ధిరేటు మందగించి 6.6 శాతంగా ఉండొచ్చని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎమ్‌ఎఫ్) అంచనా వేసింది.

02/23/2017 - 07:32

ముంబయి, ఫిబ్రవరి 22: దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా లాభాల్లోనే ముగిశాయి. వరుసగా ఐదోరోజు లాభాలను నమోదు చేస్తూ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 103.12 పాయింట్లు ఎగిసి 28,864.71 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 19.05 పాయింట్లు అందుకుని 8,926.90 వద్ద నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ షేర్ విలువ 10.97 శాతం ఎగబాకి 1,207.65 వద్దకు చేరింది.

02/23/2017 - 07:31

విశాఖపట్నం, ఫిబ్రవరి 22: విశాఖ పోర్టును బుధవారం నేపాల్ బృందం సందర్శించింది. కేంద్ర వాణిజ్య మం త్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ దినేష్ సాగర్ భుసాల్, విదేశీ మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ రామ్ ప్రసాద్ సుబేది, ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ దేవి ప్రసాద్ శర్మతోపాటు పోర్టు డిప్యూటి చైర్మన్ పిఎల్ హర్‌నాథ్ నేపాల్ బృందానికి స్వాగతం పలికారు.

02/23/2017 - 07:31

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 22: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి విమానాశ్రయాన్ని పర్యాటకానికి ఆలంబనగా తీర్చిదిద్దుతున్నారు. పర్యావరణ స్నేహపూర్వక విధానాలతో ఈ విమానాశ్రయాన్ని విస్తరించనుండటంతో దేశంలోనే ప్రత్యేకత సంతరించుకుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఎకో ఎయిర్ పోర్టు అని పిలవచ్చు. 200 కోట్ల రూపాయల నిధులతో మొత్తం 1,223 ఎకరాల్లో విమానాశ్రయ విస్తరణ పనులు జరుగుతున్నాయి.

02/22/2017 - 01:04

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ సంచలన 4జి టెలికామ్ సంస్థను మరింత సంచలనాత్మకంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమైన ఆయన ఈ ఏడాది మార్చి 31తో ముగుస్తున్న న్యూ ఇయర్ ఆఫర్ ప్రయోజనాలను మరో ఏడాదిపాటు పొడిగించారు.

02/22/2017 - 01:01

ౄ కేవలం 170 రోజుల్లోనే రిలయన్స్ జియో వినియోగదారుల సంఖ్య 10 కోట్లను దాటింది
ౄ ప్రపంచవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్ వినియోగంలో ప్రథమ స్థానం ఇప్పుడు భారత్‌దే
ౄ ప్రతిరోజూ జియో నెట్‌వర్క్‌పై కస్టమర్లు చూస్తున్న వీడియోల నిడివి దాదాపు 5.5 కోట్ల గంటలు
ౄ జియో వినియోగదారులు రోజూ 200 కోట్ల నిమిషాల వాయిస్, వీడియో కాల్స్ చేస్తున్నారు

02/22/2017 - 01:00

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: కేంద్ర ఐటి మంత్రిత్వ శాఖ.. మంగళవారం యాంటీమాల్వేర్ అనాలసిస్ సెంటర్‌ను ప్రారంభించింది. కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లకు ఇది ఉచితంగా యాంటీవైరస్‌ను అందిస్తుంది. 90 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని ఏర్పాటు చేయగా, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు ఈ సెంటర్ ప్రోత్సాహకంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వ్యక్తం చేశారు.

02/22/2017 - 00:58

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సారథి, భారత సంతతి సిఇఒ సత్య నాదెళ్ల మంగళవారం ఇక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని, కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ను కలిశారు. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న నాదెళ్ల.. రవిశంకర్ ప్రసాద్‌తో మైక్రోసాఫ్ట్ గ్రామీణ డిజిటలైజ్ కార్యక్రమాలు, ఉపాధి కల్పన, ఉద్యోగ సృష్టి తదితర అంశాలపై చర్చించారు.

Pages