S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/29/2017 - 01:07

న్యూఢిల్లీ, జనవరి 28: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి విమానయాన సేవలకు దూరమైన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పతనంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో దాని అధినేత విజయ్ మాల్యా స్పందించారు. కేంద్రంలోని గత ప్రభుత్వ విధానాలు, అప్పటి ఆర్థిక విపత్కర పరిస్థితులపై ట్విట్టర్ ద్వారా మాట్లాడుతూ ఇబ్బందుల్లో ఉన్న ప్రభుత్వరంగ సంస్థ ఎయిరిండియాకు ప్రజాధనాన్ని ప్రభుత్వాలు ఇవ్వొచ్చా? అని ప్రశ్నించారు.

01/29/2017 - 01:06

విశాఖపట్నం, జనవరి 28: పర్యాటక రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఆతిథ్య రంగంతోపాటు ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ అండ్ అడ్వెంచరస్ అంశాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహికులు ముందుకు వస్తున్నారని ఎపి పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నాగులాపల్లి శ్రీకాంత్ తెలిపారు.

01/29/2017 - 01:04

న్యూఢిల్లీ, జనవరి 28: లార్సెన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టి) ఏకీకృత నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 39 శాతం పెరిగి 972 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 700.34 కోట్ల రూపాయలుగా ఉంది.

01/29/2017 - 01:03

కోల్‌కతా, జనవరి 28: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మనీలాండరింగ్ కోసం మెజారిటీ జన్‌ధన్ ఖాతాలు దుర్వినియోగం అయ్యాయనడానికి ఆధారాలు లేవని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం అన్నారు. ‘నోట్ల రద్దు తరువాత అన్ని జన్‌ధన్ ఖాతాల ఆధారంగా మనీలాండరింగ్ జరిగిందనేందుకు ఆధారాలు లేవు. సుమారు 25 శాతం జన్‌ధన్ ఖాతాల్లో అంతకుముందు దాదాపు జమలు లేవు. జీరో బ్యాలెన్స్‌తో ఉన్నాయి.

01/29/2017 - 01:02

అమరావతి, జనవరి 28: పురుగు మందుల వాడకం తగ్గించి మిరపకాయల నాణ్యత, ఉత్పత్తిని పెంచి ఎగుమతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎగుమతులు పెరిగితే విదేశీ మారకద్రవ్యంతోపాటు, రైతులకు గిట్టుబాటు ధరలు వచ్చే అవకాశం ఉన్నందున ఆ కోణంలో మిరప ఉత్పత్తి, నాణ్యత పెంచడానికి గుంటూరు జిల్లాలోని ఉద్యానవన శాఖ తగిన ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది.

01/29/2017 - 01:00

తడ, జనవరి 28: విశాఖ సిఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా సుమారు 600 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టడానికి 13 కంపెనీలు శనివారం శ్రీసిటితో ఒప్పందం చేసుకున్నాయి. శ్రీసిటి ఎండి రవీంద్ర సన్నారెడ్డి, ఆయా సంస్థల ప్రతినిధులు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.

01/28/2017 - 01:33

ముంబయి, జనవరి 27: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ దాదాపు మూడు నెలల గరిష్ఠాన్ని తాకుతూ 174.32 పాయింట్ల లాభంతో 27,882.46 వద్దకు చేరింది. నిరుడు అక్టోబర్ 30 నుంచి ఈ స్థాయికి సెనె్సక్స్ చేరుకోవడం ఇదే ప్రథమం. నాడు 27,930.21 వద్ద స్థిరపడింది.

01/28/2017 - 01:31

హైదరాబాద్, జనవరి 27: హైదరాబాద్ ఆధారిత మినీ రత్న కేటగిరి 1 రక్షణ సంస్థ మిధాని.. గత ఆర్థిక సంవత్సరానికి (2015-16)గాను 35.41 కోట్ల రూపాయల డివిడెండ్‌ను ప్రకటించింది. 2015-16లో పన్నుల అనంతర లాభం 118.03 కోట్ల రూపాయలుగా నమోదవగా, ఇందులో 30 శాతాన్ని ఇప్పుడు డివిడెండ్‌గా ఇస్తోంది మిధాని.

01/28/2017 - 01:30

న్యూఢిల్లీ, జనవరి 27: దాదాపు దశాబ్దకాలం తర్వాత ప్రభుత్వరంగ గ్యాస్ యుటిలిటి సంస్థ గెయిల్ ఇండియా లిమిటెడ్.. బోనస్ షేర్లను జారీ చేసింది. 10 రూపాయల విలువైన మూడు ఈక్విటీ షేర్లకు 10 రూపాయల విలువ కలిగిన ఒక షేర్‌ను బోనస్‌గా ఇవ్వనుంది. దీనికి ఈ నెల 25న జరిగిన సంస్థ బోర్డు సమావేశం ఆమోదం తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటనలో గెయిల్ స్పష్టం చేసింది.

01/28/2017 - 01:30

న్యూఢిల్లీ, జనవరి 27: బహుళ వ్యాపార సంస్థ ఐటిసి లిమిటెడ్ స్టాండలోన్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 2,646.73 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌తో పోల్చితే ఇది 5.71 శాతం అధికం. నాడు సంస్థ లాభం 2,503.76 కోట్ల రూపాయలు. ఆదాయం కూడా 4.69 శాతం పెరిగి 13,569.97 కోట్ల రూపాయలుగా నమోదైంది. నిరుడు 12,961.85 కోట్ల రూపాయలుగా ఉంది.

Pages