S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/25/2017 - 01:08

హైదరాబాద్, జనవరి 24: తెలంగాణలో సామ్‌సంగ్ ఇండియా.. సర్వీస్ వ్యాన్లను ప్రారంభించింది. తమ కస్టమర్లకు ఇంటివద్దే ప్రపంచ శ్రేణి సేవలను అందించేలా సామ్‌సంగ్ ఇండియా ఈ నిర్ణయానికొచ్చింది. ఇందులో భాగంగానే 19 సర్వీస్ వ్యాన్లను అందుబాటులోకి తెచ్చింది. తొలి దశలో వీటిని మంగళవారం హైదరాబాద్ నగరానికి పరిచయం చేసింది.

01/25/2017 - 01:08

హైదరాబాద్, జనవరి 24: ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ సేల్స్ ఫోర్స్ కొత్త నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మంగళవారం హైదరాబాద్‌లో ప్రారంభించారు. 2020 నాటికి వెయ్యి ఉద్యోగాలను కల్పించాలనే లక్ష్యంతో ఈ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.

01/24/2017 - 00:35

తిరుపతి, జనవరి 23: దేశ వ్యాప్తంగా విమానాల్లో ప్రయాణించేవారికి వౌలిక వసతులు కల్పించేందుకు రానున్న ఐదేళ్ళలో 17,500 కోట్ల రూపాయలు వ్యయం చేయడానికి ఎయిర్‌పోర్ట్ అథారిటి ఆఫ్ ఇండియా నిర్ణయించిందని కేంద్ర విమానాయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజు చెప్పారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో సోమవారం పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సభ్యులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

01/24/2017 - 00:29

న్యూఢిల్లీ, జనవరి 23: ఎఫ్‌ఎమ్‌సిజి దిగ్గజం హిందుస్థాన్ యునిలివర్ లిమిటెడ్ (హెచ్‌యుఎల్) స్టాండలోన్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో 1,037.93 కోట్ల రూపాయలుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 971.66 కోట్ల రూపాయలుగా నమోదవగా, ఈసారి 6.82 శాతం పెరిగినట్లైంది.

01/24/2017 - 00:26

న్యూఢిల్లీ, జనవరి 23: ప్రభుత్వరంగ మాంగనీస్ మైనింగ్ సంస్థ ఎమ్‌ఒఐఎల్‌లో.. మంగళవారం కేంద్ర ప్రభుత్వం తమ వాటాను అమ్మకానికి పెట్టనుంది. 10 శాతం వాటా విక్రయం ద్వారా ఖజానాకు దాదాపు 480 కోట్ల రూపాయల ఆదాయం చేకూరుతుందని అంచనా. ఒక్కో షేర్ ధరను 365 రూపాయలుగా నిర్ణయించారు. రెండు రోజులపాటు జరిగే ఈ షేర్ల విక్రయం బుధవారం కూడా అందుబాటులో ఉంటుంది.

01/24/2017 - 00:24

న్యూఢిల్లీ, జనవరి 23: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ రుణాల ఎగవేత కేసులో ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఐడిబిఐ బ్యాంక్ మాజీ చైర్మన్‌తోపాటు మరో ముగ్గురు అధికారులను సోమవారం కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ అరెస్ట్ చేసింది. వీరితోపాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన నలుగురు మాజీ ఉద్యోగులనూ అదుపులోకి తీసుకుంది.

01/24/2017 - 00:24

ముంబయి, జనవరి 23: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 82.84 పాయింట్లు పెరిగి 27,117.34 వద్ద స్థిరపడగా, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 42.15 పాయింట్లు అందుకుని 8,391.50 వద్ద నిలిచింది. ఫిబ్రవరి 1న వచ్చే కేంద్ర బడ్జెట్‌పై మదుపరులలో నెలకొన్న ఆశలు మార్కెట్ లాభాలకు కారణమైయ్యాయని మార్కెట్ నిపుణులు ట్రేడింగ్ సరళిని విశే్లషిస్తున్నారు.

01/24/2017 - 00:23

న్యూఢిల్లీ, జనవరి 23: దేశీయ టెలికామ్ సంస్థ టాటా కమ్యూనికేషన్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో భారీ లాభాలను అందుకుంది. సంస్థ లాభం ఏకంగా 12రెట్లు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో 110.74 కోట్ల రూపాయలకే పరిమితమైన టాటా కమ్యూనికేషన్స్.. ఈసారి 1,412.88 కోట్ల రూపాయల లాభాలను దక్కించుకుంది.

01/24/2017 - 00:23

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణ రాష్ట్రంలో తక్కువ నీటితో ఎక్కువ పంటలు పండించే విధానాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, అందుకే ‘పాలీహౌజ్’లను ఎక్కువగా ప్రోత్సహిస్తున్నామని వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. నెదర్లాండ్స్ నుండి వ్యవసాయం, ఉద్యాన రంగాలకు సంబంధించి వచ్చిన అధికారిక బృందంతో ఆయన తన ఛాంబర్‌లో సోమవారం చర్చలు జరిపారు.

01/24/2017 - 00:22

విశాఖపట్నం, జనవరి 23: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో సహకార బ్యాంకులపై కేంద్రం పెట్టిన నిఘాతో అన్నదాతపై ఆంక్షలు వచ్చిపడ్డాయ. పాత బకాయిలు తక్షణమే చెల్లించాలంటూ హుకుం జారీ చేస్తుండగా, చెల్లించిన బకాయిల సొమ్ము ఏ విధంగా వచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఈ వింత ధోరణితో సహకార బ్యాంకులు అయోమయంలో పడుతుండగా, రైతులకు దిక్కుతోచడం లేదు.

Pages