S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

01/10/2017 - 01:13

న్యూఢిల్లీ, జనవరి 9: టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ లాండ్ రోవర్ (జెఎల్‌ఆర్) అమ్మకాలు గత నెల డిసెంబర్‌లో 12 శాతం పెరిగాయి. ఈసారి 55,375 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. మొత్తం 2016 సంవత్సరంలో సంస్థ అమ్మకాలు 5,83,312 యూనిట్లుగా ఉన్నట్లు జెఎల్‌ఆర్ సోమవారం తెలిపింది. అంతకుముందు సంవత్సరం విక్రయాలు 20 శాతం తక్కువగా ఉన్నాయి.

01/10/2017 - 01:12

న్యూఢిల్లీ, జనవరి 9: ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో టాటా స్టీల్ అమ్మకపు ఉక్కు ఉత్పత్తి 28 శాతం పెరిగింది. 3.2 మిలియన్ టన్నులుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరం (2015-16) అక్టోబర్-డిసెంబర్‌లో ఇది 2.5 మిలియన్ టన్నులుగా ఉంది. ఈ మేరకు సోమవారం సంస్థ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు తెలియజేసింది.

01/10/2017 - 01:12

హైదరాబాద్, జనవరి 9: పాత పెద్దనోట్ల రద్దు తరువాత బంగారం కొనుగోళ్ల మాటున నల్లధనం మార్పిడి జరిగినట్టు గుర్తించిన ఆదాయపు పన్ను శాఖ (ఐటి) అధికారులు.. ఇప్పుడు పెట్రోల్ బంకులపై దృష్టిసారించారు. నోట్ల రద్దు తరువాత కూడా చాలాకాలం వరకు పెట్రోల్ బంకుల్లో నగదు లావాదేవీలు అంగీకరించడంతో ఇక్కడ కూడా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్టు ఐటి అధికారులు అనుమానిస్తున్నారు.

01/10/2017 - 01:10

సత్యవేడు, జనవరి 9: తెలంగాణ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ బాలమళ్ళు నేతృత్వంలో పది మందితో కూడిన పారిశ్రామిక వేత్తల బృందం సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా శ్రీసిటీని సందర్శించింది. వీరికి శ్రీసిటీ ప్రెసిడెంట్ రమేష్ సుబ్రహ్మణ్యం స్వాగతం పలికి సెజ్‌లో వౌలిక వసతులు, పారిశ్రామిక ప్రగతిని వివరించారు. బిజినెస్ సెంటర్‌లో సమావేశమై సుదీర్ఘంగా చర్చించిన బృందం..

01/10/2017 - 01:08

ముంబయి, జనవరి 9: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో ముగిశాయి. ఈ ఆర్థిక సంవత్సరం (2016-17) మూడో త్రైమాసికానికి (అక్టోబర్-డిసెంబర్)గాను ఆయా ప్రభుత్వ, కార్పొరేట్ సంస్థలు తమ ఆర్థిక ఫలితాలను ప్రకటించే సమయం ఆసన్నమవడంతో మదుపరులు పెట్టుబడులపట్ల ఆచితూచి వ్యవహరించారు.

01/10/2017 - 01:07

హైదరాబాద్, జనవరి 9: ఈ 2016-17 ఆర్థిక సంవత్సరంలో 18.27 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 15.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సేకరించిన ధాన్యంలో 15.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యా న్ని మిల్లింగ్‌కు ఇచ్చామని సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి పేర్కొన్నారు.

01/10/2017 - 01:06

హైదరాబాద్, జనవరి 9: తెలంగాణ రాష్ట్రంలోని డీలర్లంతా వెంటనే జిఎస్‌టి ఎన్‌రోల్‌మెంట్ అప్లికేషన్లను అందచేయాలని వాణిజ్య పన్నుల కమిషనర్ ఆదేశించారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, డీలర్లకు వాణిజ్య పన్నుల శాఖ ద్వారా ఐడిలు, పాస్‌వర్డ్‌లు పంపించామని, వీటిని అందుకున్న వారంతా, జిఎస్‌టి పోర్టల్‌కు పూర్తి వివరాలు ఇవ్వాలన్నారు.

01/10/2017 - 01:05

ముత్తుకూరు, జనవరి 9: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఓడరేవులోని కస్టమ్స్ కార్యాలయంలో సోమవారం బ్యాగేజ్ స్కానర్‌ను కస్టమ్స్ కమిషనర్ ఎస్‌కె రెహమాన్ పోర్టు సిఇఒ అనిల్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. బ్యాగేజ్ స్కానర్‌తోపాటు మెటల్ డిటెక్టర్‌ను ఏర్పాటు చేశారు.

01/10/2017 - 01:05

న్యూఢిల్లీ, జనవరి 9: పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థ మందగించిందన్నది నిజం కాదని, అధిక పన్ను వసూళ్లే ఇందుకు నిదర్శనమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. గత నెల డిసెంబర్‌లో పరోక్ష పన్ను వసూళ్లు 14.2 శాతం పెరిగాయని చెప్పారు. ఎక్సైజ్ వసూళ్లు 31.6 శాతం, సేవా పన్ను వసూళ్లు 12.4 శాతం పెరిగాయని సోమవారం ఇక్కడ తెలిపారు.

01/10/2017 - 01:04

న్యూఢిల్లీ, జనవరి 9: పాత పెద్ద నోట్ల రద్దును సహకార బ్యాంకులు మనీ లాండరింగ్‌కు చక్కని అవకాశంగా మార్చుకున్నాయని ఆదాయ పన్ను శాఖ తెలిపింది. నోట్ల రద్దు నేపథ్యంలో కోట్లాది రూపాయల మనీ లాండరింగ్‌కు సహకార బ్యాంకులు పాల్పడ్డాయంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తాము తయారుచేసిన ఓ విశే్లషణాత్మక నివేదికలో దేశవ్యాప్తంగా సహకార బ్యాంకుల్లో అక్రమాలు జరిగినట్లు తేలినట్లు చెప్పింది.

Pages