S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

11/21/2016 - 00:10

న్యూఢిల్లీ, నవంబర్ 20: భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహణ కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటిదాకా దాదాపు 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నిక, తదనంతర పరిణామాల ప్రభావం భారత్‌సహా ప్రపంచ స్టాక్ మార్కెట్లపై కనిపిస్తోంది.

11/20/2016 - 00:55

న్యూఢిల్లీ, నవంబర్ 19: పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వేతన జీవులు, చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వెంటనే తగిన చర్యలు చేపట్టాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని వాణిజ్య సంఘాలు కోరాయి. నల్లధనం, నకిలీ కరెన్సీ నిర్మూలన కోసం ఈ నెల 8వ తేదీ రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాత 500, 1,000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించినది తెలిసిందే.

11/20/2016 - 00:53

న్యూఢిల్లీ, నవంబర్ 19: రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని 198 కోట్ల రూపాయల విలువైన ఓ కాంట్రాక్టును పొందినట్లు దిలీప్ బిల్డ్‌కాన్ శనివారం తెలిపింది. నేషనల్ హైవే 18పైగల రాయచోటి-కడప రోడ్డు ఆధునికీకరణ పనులను చేపడతామని సదరు సంస్థ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌కు చెప్పింది. 18 నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు పూర్తికావచ్చని తెలిపింది.

11/20/2016 - 00:52

అమరావతి, నవంబర్ 19: అది ముఖ్యమంత్రి అధీనంలోని శాఖ. రాష్ట్ర అవసరాలతోపాటు మిగిలిన అన్ని శాఖలకు విద్యుత్ పంపిణీ చేసే శాఖ అది. అయతే వేల కోట్లు బకాయిలు పడిన సర్కారు శాఖలపై విద్యుత్ శాఖ కొరఢా ఝుళిపిస్తోంది. బిల్లులు కట్టకపోతే నిర్మొహమాటంగా కట్ చేస్తామని ట్రాన్స్‌కో బాస్ అజయ్ జైన్ హెచ్చరించారు మరి. ఇదిప్పుడు కలెక్టర్లకు మింగుడుపడటం లేదు. ఆర్ధిక శాఖ నిధులివ్వకపోతే మేమేం చేయాలన్నది వారి ప్రశ్న.

11/20/2016 - 00:51

కర్నూలు, నవంబర్ 19: రైతు ప్రభుత్వాలని గొప్పలు చెప్పుకుంటున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యాయని పార్లమెంట్‌లో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. శనివారం కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి రైతులను కలిసి, వారు ఎదుర్కొంటున్న కష్టాలను ఖర్గే తెలుసుకున్నారు.

11/19/2016 - 01:06

న్యూఢిల్లీ, నవంబర్ 18: దేశంలోని నల్లధనాన్ని వెలికితీయడం కోసం తమ ప్రభుత్వం తెచ్చిన ఆదాయ ధ్రువీకరణ పథకం (ఐడిఎస్) గొప్ప విజయం సాధించిందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. 1997లో అప్పటి ప్రభుత్వం ప్రకటించిన స్వచ్చంధ ఆదాయ ప్రకటన పథకం (విడిఐఎస్) కంటే ఇది ప్రభావవంతంగా పనిచేసిందని, నాటితో పోల్చితే నేడు మూడు రెట్లు అధికంగా ప్రభుత్వానికి ఆదాయం వచ్చిందని శుక్రవారం ఇక్కడ చెప్పారు.

11/19/2016 - 01:02

హైదరాబాద్, నవంబర్ 18: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో డేటావిండ్ మొబైల్ ఫోన్ల తయారీ, ట్యాబ్‌లెట్ తయారీ కేంద్రాన్ని తెలంగాణ ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు శుక్రవారం ప్రారంభించారు. ఇప్పటికే తెలంగాణలో మైక్రోమ్యాక్స్, సెల్‌కాన్ మొబైల్ కంపెనీలు తమ తయారీ కేంద్రాలను ప్రారంభించాయి.

11/19/2016 - 00:59

హైదరాబాద్, నవంబర్ 18: పెద్ద నోట్లను రద్దుచేసి పది రోజులు గడిచి పోయినా బ్యాంకులు, ఎటిఎంల వద్ద క్యూలు మాత్రం తగ్గట్లేదు. అదే విధంగా సామాజిక మాధ్యమాల్లోనూ కరెన్సీ సమస్యలపై సెటైర్ల జోరు ఆగట్లేదు. గంటల తరబడి క్యూలో నిలబడి ఇబ్బంది పడుతున్న నెటిజన్లు ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున సెటైర్లు వేస్తున్నారు మరి.

11/19/2016 - 00:57

హైదరాబాద్, నవంబర్ 18: దేశంలో సూపర్ బైక్స్ పరిశ్రమల్లో అభివృద్ధి చెందిన ఇటాలియన్ సూపర్ బైక్ బ్రాండ్ బెనల్లీ 21 కొత్త షోరూంలను ఏర్పాటు చేసింది. భువనేశ్వర్, ముంబయి, పుణే, వడోదరలో నాలుగు ప్రత్యేక షోరూంలను ఏర్పాటు చేసినట్లు డిఎస్‌కె మోటీ వీల్స్ చైర్మన్ శిరీష్ కులకర్ణి తెలిపారు. ఇక్కడ అన్ని రకాల వాహనాల ఉత్పత్తులను విక్రయస్తామన్నారు.

11/19/2016 - 00:57

హైదరాబాద్, నవంబర్ 18: ప్రతిష్టాత్మక ఇన్‌సైడ్ రివ్యూ ఇండియా ఆపరేషన్స్ సంస్థ హెచ్‌ఆర్ డైరెక్టర్‌గా రేవతి రెడ్డిని నియమించినట్లు ఆ సంస్థ ఎండి శేషారావు తెలిపారు. మార్కెటింగ్, ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్‌ను రేవతి రెడ్డి నిర్వహిస్తారన్నారు. అంతర్జాతీయంగా మానవ వనరుల అధ్యయనంలో రేవతి రెడ్డి నిపుణురాలని చెప్పారు. ఆమె జెంషెడ్‌పూర్ ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐలో హెచ్‌ఆర్ మేనేజిమెంట్ కోర్సును పూర్తి చేశారు.

Pages