S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

09/28/2016 - 04:27

రేణిగుంట, సెప్టెంబర్ 27: రాష్ట్రంలోనే బెస్ట్ విమానాశ్రయంగా రేణిగుంట విమానాశ్రయానికి కేంద్రప్రభుత్వం గుర్తింపు ఇచ్చిందని తిరుపతి సబ్ కలెక్టర్ హిమాంశుశుక్ల తెలిపారు. మంగళవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం-2016ను పురస్కరించుకొని కేంద్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ కలినరీ ఇన్‌స్టిట్యూట్ తిరుపతి శాఖ ఆధ్వర్యంలో 2కె రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

09/28/2016 - 04:26

విజయవాడ, సెప్టెంబర్ 27: రాష్ట్రంలో విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి నగరాల్లో రూ.500 కోట్లతో నాలుగు ఐమాక్స్ ధియేటర్లు, 40 మల్టీఫ్లెక్స్ ధియేటర్లను నిర్మించేందుకు ఎస్‌పిఐ సినిమాస్ సంస్థ ముందుకొచ్చింది. సిఎం క్యాంప్ కార్యాలయంలో ఆ సంస్థ ప్రతినిధులు సిఎం చంద్రబాబును కలిసి ప్రభుత్వంతో గతంలో కుదుర్చుకున్న ఎంవోయు పురోగతిని వివరించారు.

09/28/2016 - 04:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: దేశంలో నిపుణులైన వ్యవసాయ కార్మికుల కొరత చాలా ఎక్కువగా ఉండటంతో 2022 సంవత్సరం నాటికి 24 లక్షల మంది రైతులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఇకార్) నిర్ణయించింది. పాలీహౌస్ నిర్మాణం, బయోగ్యాస్, వర్మీ కంపోస్టు తదితర రంగాల్లో రైతులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.

09/27/2016 - 02:30

ముంబయి, సెప్టెంబర్ 26: ఒక పక్క అమెరికా అధ్యక్ష ఎన్నికల బిగ్ డిబేట్, మరో పక్క ఈ వారంలో జరుగనున్న ఒపెక్ దేశాల సమావేశం వెరసి భారత స్టాక్ మార్కెట్లపై సోమవారం తీవ్రమైన ప్రభావాన్ని చూపాయి. ఫలితంగా గత రెండు వారాల్లో ఎన్నడూ లేని విధంగా ప్రధాన స్టాక్ మార్కెట్ సెనె్సక్స్ 374 పాయింట్లు పడిపోయింది. అంతిమంగా 28,294.28 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 8,800 పాయింట్ల దిగువకు పతనమైంది.

09/27/2016 - 02:29

విజయవాడ, సెప్టెంబర్ 26: రాష్ట్రంలోని విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర విభజన తరువాత అత్యున్నత వౌలిక సదుపాయాలు గల స్మార్ట్ సిటీలను తయారుచేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశలోనే ఆర్థికంగా అభివృద్ధికి దోహదపడే విమానాశ్రయాల అభివృద్ధిపై కూడా దృష్టి పెట్టింది.

09/27/2016 - 02:28

విశాఖపట్నం, సెప్టెంబర్ 26: హుదూద్ తుపాను కారణంగా దెబ్బతిన్న విశాఖలోని ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణ ఎప్పటికి జరిగేనో తెలియని స్థితి నెలకొంది. సవివర నివేదిక ఇచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా, ఆధునీకరణ దిశగా చర్యలు తీసుకోలేదు. విశాఖలో ఫిషింగ్ హార్బర్‌లో దాదాపు 700 మెకనైజ్డ్ బోట్లు చేపల వేట సాగిస్తున్నాయి. హుదూద్ తుపాను సమయంలో జెట్టీ, తదితర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

09/27/2016 - 02:25

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా తదితర సెల్యులార్ ఆపరేటర్లకు, కొత్తగా మార్కెట్లోకి అడుగుపెడుతున్న రిలయన్స్ జియోకి మధ్య వివాదం ముదరడంతో టెలికామ్ నియంత్రణా సంస్థ ట్రాయ్ రంగంలోకి దిగింది. నిబంధనలకు విరుద్ధంగా కాల్‌డ్రాప్స్ సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండటంతో సంబంధిత టెలికామ్ ఆపరేటర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని ట్రాయ్ సోమవారం హెచ్చరించింది.

09/27/2016 - 02:23

హైదరాబాద్, సెప్టెంబర్ 26: కస్టమ్స్ అధీకృత ఆర్థిక నిర్వహణ భాగస్వామ్యం అంశంపై ఎప్ట్యాప్సీ ఈ నెల 27న సదస్సు నిర్వహించనున్నది.

09/27/2016 - 02:23

మచిలీపట్నం, సెప్టెంబర్ 26: కృష్ణా జిల్లాలో బందరు ఓడరేవు నిర్మాణం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటంతో ఈ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించేందుకు విదేశీయులు ఆసక్తి చూపుతున్నారు. దుబాయ్‌కు చెందిన ఓ ప్రైవేట్ కన్సల్టెన్సీ బందరులో మెరైన్ బిజినెస్ చేసేందుకు ముందుకొచ్చింది.

09/27/2016 - 02:20

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశీయంగా సరఫరాలను మెరుగుపర్చి ధరలను అదుపు చేసేందుకు వీలుగా ధాన్యంపై కస్టమ్స్ సుంకం తగ్గిన తర్వాత 20 లక్షల టన్నుల గోధుమలను దిగుమతి చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఫ్లోర్ మిల్లర్లు తెలిపారు.

Pages