S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

05/16/2016 - 06:57

న్యూఢిల్లీ, మే 15: విదేశీ మదుపరులు మళ్లీ పెట్టుబడుల ఉపసంహరణ దిశగా నడుస్తున్నారు. గత రెండు వారాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి 178 కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను లాగేసుకున్నారు. నిజానికి ఈ ఏడాది తొలి రెండు నెలల్లోనూ పెట్టుబడుల ఉపసంహరణల ధ్యాసతోనే నడిచిన విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు (ఎఫ్‌పిఐ).. మలి రెండు నెలల్లో మాత్రం పెట్టుబడుల ప్రవాహాన్ని సృష్టించారు.

05/15/2016 - 02:08

న్యూఢిల్లీ, మే 14: భారత్ ఈ వారం మారిషస్‌తో పన్ను సవరణ ఒప్పందంపై సంతకం చేయడం పట్ల విదేశీ పోర్ట్ఫులియో మదుపరుల (ఎఫ్‌పిఐ) నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఎఫ్‌పిఐ ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించి వారి ఆందోళనలపై చర్చించింది.

05/15/2016 - 02:05

ఒంగోలు, మే 14: పొగాకు రైతులకు నష్టం వాటిల్లకుండా రాష్ట్ర ప్రభు త్వం ఆదుకుంటుందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. శనివారం మంత్రి త్రోవగుంట, ఒంగోలు-2, టంగుటూరు పొగాకు వేలం కేంద్రాలను సందర్శించారు. అక్కడ పొగాకు బేళ్లను పరిశీలించారు. పొగాకు రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

05/15/2016 - 02:05

ముంబయి, మే 14: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం లాభాల్లో ముగిశాయి. మదుపరులు సంస్కరణల జోష్‌లో ఉండగా, వరుస రెండు వారాల నష్టాల నుంచి సూచీలు తేరుకున్నాయి. పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివాలా బిల్లు ఆమోదం పొందడం మార్కెట్ సెంటిమెంట్‌కు బలం చేకూర్చిందని నిపుణులు పేర్కొన్నారు.

05/15/2016 - 02:03

న్యూఢిల్లీ, మే 14: బ్యాంకింగ్ రంగంలో మొండి బకాయిలు (నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పిఎ) వచ్చే ఏడాది మార్చికల్లా 6.9 శాతానికి ఎగబాకవచ్చని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అంచనా వేసింది.

05/15/2016 - 02:03

న్యూఢిల్లీ, మే 14: రాబోయే రెండేళ్లలో భారత రక్షణ రంగ ఎగుమతులను 2 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ప్రస్తుతం ఇవి 330 మిలియన్ డాలర్లకుపైగా ఉన్నట్లు శనివారం ఇక్కడ జరిగిన ఓ సెమినార్‌లో మాట్లాడుతూ చెప్పారు. కాగా, కీలకమైన రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యాలపై చాలామంది విఐపిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

05/15/2016 - 02:02

ద్వారకాతిరుమల, మే 14: దేశ విస్తీర్ణానికి తగ్గట్లుగా ఎయిర్ పోర్టులు లేవని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. హైదరాబాద్, బెంగ ళూరు, ఢిల్లీల్లో మాత్రమే మోడరన్ ఎయిర్‌పోర్టులు ఉన్నాయని, తూర్పులో రెండు, పశ్చిమలో మరో రెండు కొత్త ఎయిర్‌పోర్టులు కావాల్సిన అవసరముందన్నారు. కొత్తవాటికోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని, అదే బాటలో ఏపి వెళ్ళాలని సూచించారు.

05/15/2016 - 02:01

విజయవాడ, మే 14: దేశం ఆర్థికంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ నిరక్షరాస్యుల నుంచి సైతం పొదుపును సేకరించడంలో ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసి) దూసుకెళ్తోందని, దేశ ఆర్థిక వ్యవస్థకు వెనె్నముకగా నిలుస్తోందని బీమా ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు అమానుల్లా ఖాన్ అన్నారు. అలాంటి ఈ సంస్థను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

05/15/2016 - 01:59

న్యూఢిల్లీ, మే 14: భారత జిడిపి వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17)లో గత ఆర్థిక సంవత్సరం (2015-16)తో పోల్చితే స్వల్పంగా పెరిగి 7.7 శాతంగా ఉండొచ్చని ఎన్‌సిఎఇఆర్ అంచనా వేసింది. భారత వాతావరణ శాఖ ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగానే కురుస్తాయని చెప్పడమే దీనికి కారణంగా ఆర్థిక విశే్లషణల దిగ్గజం ఎన్‌సిఎఇఆర్ పేర్కొంది. దేశ వ్యవసాయ రంగం వర్షాధారమన్నది తెలిసిందే.

05/15/2016 - 01:57

విశాఖపట్నం, మే 14: విశాఖ నగరం మరో అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు వేదిక కానుంది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోగల సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్థ (మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్టు డెవలప్‌మెంట్ అథారిటీ లేదా ఎంపెడా) ఆధ్వర్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 23 నుంచి 25 వరకు మూడు రోజులపాటు అంతర్జాతీయ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు.

Pages