-
విజయవాడ (క్రైం), ఏప్రిల్ 13: రాష్ట్రంలో రవాణా లారీలు రోడ్డెక్కనున్నాయి.
-
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: చమురు, సహజవాయు కార్పొరేషన్ (ఓఎన్జీసీ) తన ఉత్పత్తిలో
-
బెంగళూరు, ఏప్రిల్ 13: కరోనా వైరస్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
బిజినెస్
న్యూఢిల్లీ, జనవరి 24: ఆసియా-పసిఫిక్ దేశాల్లో అత్యధికంగా శ్రీమంతులున్న టాప్-20 నగరాల్లో ముంబయి, ఢిల్లీ ఉన్నాయి. ఒక మిలియన్ డాలర్లు (ప్రస్తుతం భారత కరెన్సీ ప్రకారం దాదాపు ఆరున్నర కోట్ల రూపాయలు), అంతకంటే అధికంగా సంపద ఉన్నవారితో న్యూ వరల్డ్ వెల్త్ సంస్థ రూపొందించిన ఆసియా-పసిఫిక్ 2016 సంపద నివేదిక ప్రకారం టాప్-20లో తొలి స్థానాన్ని జపాన్ రాజధాని టోక్యో దక్కించుకుంది.
న్యూఢిల్లీ, జనవరి 24: వేదాంత రిసోర్సెస్ అధీనంలోని హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ (హెచ్జెడ్ఎల్)లోగల ప్రభుత్వ వాటాను విక్రయించడం సరికాదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు గనుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ప్రస్తుతం దేశీయ లోహ ఉత్పత్తి రంగంలో ఉన్న పరిశ్రమల్లో ప్రభుత్వానికి వాటా ఉన్నది కేవలం హెచ్జెడ్ఎల్లోనేనని గుర్తుచేసింది.
దావోస్, జనవరి 23: దేశ జిడిపి వృద్ధిరేటు పరుగులు పెడుతుందని, సంస్కరణలు కొనసాగుతాయని ప్రపంచ ఆర్థిక మండలి (డబ్ల్యుఇఎఫ్) వేదికగా విశ్వాసం వ్యక్తం చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. తమ ప్రభుత్వ కీలక సంస్కరణ ‘వ్యాపార నిర్వహణ సులభతరం’ మాత్రం ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదన్నారు. గత ఏడాది భారత్లో వ్యాపార నిర్వహణ మెరుగుపడిందని అంతర్జాతీయ గణాంకాలు తేటతెల్లం చేసిన విషయాన్ని గుర్తుచేసిన జైట్లీ..
న్యూఢిల్లీ, జనవరి 23: మధ్యప్రాచ్య దేశాలపై అధికంగా ఆధారపడకుండా ఇతర దేశాల నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకునేందుకు భారత్ ప్రయత్నిస్తున్నది తెలిసిందే. ఈ క్రమంలోనే ఇకమీదట ఆఫ్రికా నుంచి చమురు దిగుమతులను పెంపొందించుకోవాలని యోచి స్తోంది. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇటీవల తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం భారత్ చమురు అవసరాల్లో 80 శాతం దిగుమతుల ద్వారానే తీరుతు న్నాయ.
న్యూఢిల్లీ, జనవరి 23: దేశంలోని 12 ప్రధాన రేవుల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్) సరకు రవాణా 3.18 శాతం వృద్ధిచెంది 447.05 మిలియన్ టన్నులకు పెరిగింది. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈ 12 పోర్టుల్లో గత ఆర్థిక సంవత్సరం (2014-15) ఏప్రిల్-డిసెంబర్ మధ్య 433.26 మిలియన్ టన్నుల సరకు రవాణా జరిగింది.
హైదరాబాద్, జనవరి 23: హెచ్డిఎఫ్సి హోమ్ లోన్స్ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్లో స్థిరాస్తి ప్రదర్శన మొదలైంది. ఈ సందర్భంగా ప్రముఖ డెవలపర్లు ఎంపిక చేసిన 3,500 పైచిలుకు స్థిరాస్తులను ప్రదర్శించారు.
హైదరాబాద్, జనవరి 23: సింగరేణి ఆణిముత్యాలు, ఉద్యోగ మేళా నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) జనగాం నాగయ్య ఆయా ఏరియా అధికారులను ఆదేశించారు. శనివారం సింగరేణి భవన్లో జిఎం అధ్యక్షతన సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.
ముంబయి, జనవరి 23: దేశీయ స్టాక్ మార్కెట్లు గడచిన వారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య స్వల్ప నష్టాలకు లోనయ్యాయి. 20 నెలలకిపైగా కనిష్ట స్థాయి నుంచి కోలుకున్న సూచీలు.. మదుపరుల పెట్టుబడులు-అమ్మకాల మధ్య ఊగిసలాడాయి. ఒకానొక దశలో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెనె్సక్స్ 24 వేల స్థాయిని, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 7,400 స్థాయిని కోల్పోయాయి.
న్యూఢిల్లీ, జనవరి 23: పసిడి నగదీకరణ పథకం (గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్) ద్వారా 900 కిలోలకుపైగా బంగారాన్ని సేకరించినట్లు కేంద్ర ప్రభుత్వ శనివారం వెల్లడించింది. గృహస్తులు, ఆలయాల నుంచి ఈ మొత్తం పుత్తడిని అందుకున్నట్లు తెలిపిన సర్కారు.. భవిష్యత్తులో ఇది మరింత పెరగగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. ‘పసిడి నగదీకరణ పథకం ద్వారా ఇప్పటిదాకా 900 కిలోలకుపైగా బంగారాన్ని అందుకున్నాం.
డావోస్, జనవరి 22: సంస్కరణలు, బాధ్యతాయుతమైన ఆర్థిక ప్రణాళికల ద్వారా ప్రస్తుత అంతర్జాతీయ మందగమనాన్ని భారత్ సమర్థవంతంగా ఎదుర్కోగలదన్న విశ్వాసాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వ్యక్తం చేశా రు.