S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిజినెస్

12/28/2015 - 07:33

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: భారతీయ మార్కెట్ల నుంచి విదేశీ మదుపరుల పెట్టుబడులు తరలిపోతూనే ఉన్నాయ. దేశ ఆర్థిక వ్యవస్థపై విదేశీ మదుపరులకు భయాలు పెరుగుతుండటం, అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులే దీనికి ప్రధాన కారణం. ఈ క్రమంలోనే దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ పోర్ట్ఫోలియో మదుపరు (ఎఫ్‌పిఐ)ల పెట్టుబడులు అంతకంతకూ వెనక్కి వెళ్లిపోతున్నాయ.

12/28/2015 - 07:32

పరకాల, డిసెంబర్ 27: వరంగల్ జిల్లా చెల్పూర్‌లోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మొదటి దశ విద్యుత్ ప్లాంటులో సోమవారం (నేటి) నుండి వార్షిక మరమ్మతులు చేపట్ట్టనున్నారు. దీంతో ఆదివారం రాత్రి నుండి ప్లాంటులో విద్యుదుత్పత్తిని నిలిపి వేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, విద్యుత్ లోటు ఉండడంతో కెటిపిపి మొదటి దశను వార్షిక మరమ్మతులు చేయకుండా నడిపిస్తున్నారు.

12/28/2015 - 07:31

విశాఖపట్నం, డిసెంబర్ 27: జ్యూట్ మిల్లులు సంక్షోభంలో చిక్కుకుంటున్నాయ. మిల్లు కార్మికుల పరిస్థితి దినదిన గండం నూరేళ్ల ఆయుష్షు చందంగా మారుతోంది. మిల్లు ఎప్పుడు తెరుస్తారో.. ఎప్పుడు మూస్తారో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ఉత్తరాంధ్రలో జ్యూట్ మిల్లులపై ఆధారపడి వేలాది మంది కార్మికులు జీవనం సాగిస్తున్నారు.

12/28/2015 - 07:31

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: దేశీయ ఆటోరంగ దిగ్గజం మారుతి సుజుకి దూకుడు కొనసాగుతోంది. గత నెల నవంబర్‌లో దేశీయ మార్కెట్‌లో అమ్ముడైన ప్యాసింజర్ వాహనాల్లో టాప్-10 మోడల్స్‌లో ఆరు మారుతి సుజుకికి చెందినవే ఉన్నాయి. మారుతి ఆల్టో ఎప్పటిలాగే తొలి స్థానంలో నిలిచింది. 21,995 యూనిట్లు అమ్ముడైంది. గత ఏడాది నవంబర్‌లో 24,201 యూనిట్లు అమ్ముడైయ్యాయి.

12/28/2015 - 07:30

కోల్‌కతా, డిసెంబర్ 27: పెట్రోల్, ఇతర పెట్రోలియం ఉత్పత్తులు ఇప్పట్లో వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) పరిధిలోకి రాబోవని ముఖ్య ఆర్థిక సలహాదారు (సిఇఎ) అరవింద్ సుబ్రమణ్యమ్ అన్నారు. ఆదివారం ఇక్కడ ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా విలేఖరులతో మాట్లాడిన ఆయన జిఎస్‌టి అమల్లోకి వచ్చిన కొంతకాలం వరకు పెట్రోల్, పెట్రో ఉత్పత్తులపై జిఎస్‌టి వర్తించదన్నారు.

12/28/2015 - 07:30

ముంబయి, డిసెంబర్ 27: ముఖేశ్ అంబానీ నేతృత్వంలోగల రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్)లోని టెలికాం విభాగమైన రిలయన్స్ జియో ఇన్ఫోకామ్.. ఆదివారం తమ గ్రూప్ ఉద్యోగులకు జియో బ్రాండ్ పేరిట 4జి సేవలను అందుబాటులోకి తెచ్చింది.

12/28/2015 - 07:29

న్యూఢిల్లీ, డిసెంబర్ 27: ప్రపంచ ఆర్థిక మందగమనంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ పనితీరు ఈ ఏడాది బాగుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) అమలు, ప్రత్యక్ష పన్నుల హేతుబద్ధీకరణ, వ్యాపార నిర్వహణ సులభతరం చేయడం వంటివి కొత్త సంవత్సరంలో తమ ప్రధాన లక్ష్యాలుగా ఆయన పేర్కొన్నారు.

12/28/2015 - 07:29

లండన్, డిసెంబర్ 27: భారత్ ఆర్థిక వ్యవస్థ 2030 తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఓ తాజా అధ్యయనం పేర్కొంది. బ్రిటన్‌కు చెందిన సెంటర్ ఫర్ ఎకనామిక్స్ బిజినెస్ అండ్ రిసెర్చ్ (సిఇబిఆర్) నివేదిక ప్రకారం 2029లో అమెరికా ఆర్థిక వ్యవస్థను చైనా అధిగమించనుంది. ఈ క్రమంలో అమెరికా రెండో స్థానానికి పడిపోగా, భారత్ మూడో స్థానానికి చేరనుంది.

12/27/2015 - 06:31

వరుసగా రెండో వారం లాభాల్లో స్టాక్ మార్కెట్లు
పెట్టుబడుల దిశగా విదేశీ మదుపరులు
వారాంతపు సమీక్ష
=================

12/27/2015 - 06:30

కోల్‌కతా, డిసెంబర్ 26: భారత జిడిపి వృద్ధిరేటు అంచనాను ప్రపంచ బ్యాంక్ సవరించే అవకాశాలున్నాయని బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త కౌశిక్ బసు అన్నారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింప జేసుకోవడంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం విఫలమైన క్రమంలో ఆ ప్రభావం దేశ జిడిపి వృద్ధి అంచనాపై చూపవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

Pages