S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

04/14/2020 - 04:27

హైదరాబాద్, ఏప్రిల్ 13: కరోనా పై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల వైఫల్యంపై అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ వివరాలను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. అన్నపూర్ణ కేంద్రాలపై సమాచారం ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. వలస కూలీల పరిస్థితుల పై అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. తెల్ల రేషన్ కార్డులు లేని వారికి బియ్యం, డబ్బులు ఇవ్వాలన్నారు.

04/14/2020 - 04:25

హైదరాబాద్, ఏప్రిల్ 13: జాతీయ , రాష్ట్ర స్థాయి ప్రవేశపరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అన్ని ప్రవేశపరీక్షలను వాయిదా వేశాయి. తెలంగాణలో ప్రవేశపరీక్షలకు ఎలాంటి అదనపు రుసుం లేకుండానే గడువును మే 5వ తేదీ వరకూ పొడిగించగా, ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపరీక్షల దరఖాస్తు గడువును ఏప్రిల్ 17వ తేదీ వరకూ పొడిగించారు.

04/14/2020 - 04:24

హైదరాబాద్, ఏప్రిల్ 13: రాష్ట్రంలోని వైన్‌షాప్‌ల ద్వారా మద్యం తరలించి ఎక్కువ ధరలకు అమ్మడం వంటి అంశాలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని, ఇప్పటి వరకు అక్రమంగా మద్యం అమ్మిన వారిపై 675 కేసులు నమోదు చేసినట్లు రాష్ట్ర ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ మంత్రి వీ.శ్రీనివాస్ గౌడ్ అదేశాలు జారీ చేశారు. సోమవారం ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ ఉన్నాతాధికారులతో వివిధ అంశాలపై సమీక్ష జరిపారు.

04/14/2020 - 04:23

హైదరాబాద్, ఏప్రిల్ 13: కరోనా ఎఫెక్ట్ నేపథ్యంతో లాక్‌డౌన్ అమలు జరుగుతున్నందున గత సంవత్సరం మార్చి నెల బిల్లులనే ఈ ఏప్రిల్‌లో చెల్లించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి స్పష్టం చేశారు. విద్యుత్ బిల్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నందున వాటికి సంబంధించిన బిల్లులు ఆన్‌లైన్ ద్వారా చెల్లించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి వినియోగదారులకు సూచించారు.

04/14/2020 - 04:22

హైదరాబాద్, ఏప్రిల్ 13:కరోనా వ్యాధి బాధితుల కోసం సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రిలో 142 ఐసోలేషన్ పడకలను ఏర్పాటు చేశారు. కరోనా వ్యాధి సోకిన వ్యక్తులకు మెరుగైన వైద్య సౌకర్యం అందించడానికి రైల్వే అధికారులు యుద్ధ ప్రాతిపధికన ఐసోలేషన్ పడకలను సిద్ధం చేశారు. కరోనా వ్యాధి సోకిన వ్యక్తులకు అందించే వైద్య సదుపాయ ఏర్పాట్లను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ ఆసుపత్రిని పరిశీలించారు.

,
04/14/2020 - 04:03

రాజమహేంద్రవరం, ఏప్రిల్ 13: కరోనా వైరస్ మహమ్మారి విరుచుకుపడుతున్న నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా గత మూడు వారాలుగా గోదావరి జిల్లాలు కర్ఫ్యూ వాతావరణంలో కాలం వెళ్లబుచ్చుతున్నాయి. ఉదయం 11 గంటల వరకూ నిత్యావసరాల కోసం వస్తున్న వారితో కాస్త జన సంచారం కనిపిస్తున్నప్పటికీ, ఆ తర్వాత రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి.

04/14/2020 - 04:01

గుంతకల్లు, ఏప్రిల్ 13: అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వేస్టేషన్‌లో ఉన్న ఐసోలేషన్ రైల్వేకోచ్‌లను కలెక్టర్ గంధం చంద్రుడు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యవసరమైతే ఈ కోచ్‌లను వినియోగించుకుంటామన్నారు. జిలో 9 కంటోనె్మంట్ జోన్‌లను ఏర్పాటు చేశామన్నారు. పాజిటివ్ కేసులు, కాంటాక్ట్ కేసులను బట్టి హైరిస్క్ జోన్ ఏర్పాటు చేస్తామన్నారు.

04/14/2020 - 03:59

కడియం/ఆలమూరు, ఏప్రిల్ 13: కరోనా మహమ్మారి ప్రజారోగ్యానే్న కాకుండా ప్రత్యక్షంగా ఎన్నో రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తూర్పుగోదావరి జిల్లా కడియం, ఆలమూరు, ఆత్రేయపురం మండలాల్లో వేల ఎకరాల పూల తోటలపై కరోనా ప్రభావం పడింది. లాక్‌డౌన్ నేపథ్యంలో రవాణా స్తంభించడం, కూలీలు పూల తోటలకు రాకపోవడంతో తోటల్లోనే పూలు వాడిపోయి రాలిపోతున్నాయి. వేసవిలో మల్లెపూల దిగుబడి ఎక్కువగా ఉంటుంది.

04/14/2020 - 03:56

అనంతపురం, ఏప్రిల్ 13: కరోనా (కోవిడ్-19) మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పోలిస్తే అనంతపురం జిల్లాలో కోవిడ్-19 పాజిటివ్ కేసులు తక్కువగా నమోదైనా ప్రజలను భయం వెంటాడుతోంది. గత కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోయినా, కాంటాక్ట్ ట్రేసింగ్ (పాజిటివ్ వ్యక్తి కలిసిన వ్యక్తులు, వారు ఎవరెవరిని కలిశారన్న వివరాల సేకరణ) ద్వారా కొత్త కేసులు బయటపడే అవకాశాలున్నాయి.

04/14/2020 - 03:54

కడప, ఏప్రిల్ 13: కడప జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు. ఆదివారం రాత్రి వరకు 31 కేసులు నమోదయ్యాయి. సోమవారం ఎలాంటి కొత్తకేసులు నమోదుకాకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. నమోదైన కేసుల్లో ఢిల్లీ మర్కస్‌కు వెళ్లి వచ్చిన వారు 17 మంది ఉన్నారు.

Pages