S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెయన్ ఫీచర్
మనదేశానికి ఆఫ్ఘానిస్తాన్తో ఉన్న సంబంధ బాంధవ్యాలు ‘‘కాలానికి కట్టుబడనివి’’ అని ప్రధానమంత్రి జూన్ నెల నాలుగవ తేదీన వ్యాఖ్యానించడం చరిత్రకు అనుగుణమైన అంశం. అఫ్ఘానిస్తాన్ ఒకప్పుడు భారతదేశంలో భాగమన్న వాస్తవం నరేంద్ర మోదీ వ్యాఖ్య ను విన్నవారికి స్ఫురించడం సహజం. భౌగోళికమైన అనుబంధం సాంస్కృతికమైన అనుబంధం ముడివడి ఉండడం జనసముదాయం లేదా జనసముదాయాలు ఒకే జాతిగా వికసించడానికి ప్రాతిపదిక.
అపార అనుభవశాలి, రాజకీయ చాణక్యుడు, ప్రతికూల పరిస్థితులను సైతం సానుకూలంగా మార్చుకునే స్థితప్రజ్ఞుడు నారా చంద్రబాబునాయుడు నవ్యాం ధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. ఈ రెండేళ్ల కాలంలో మెరుపులెన్నో మరకలూ అన్ని. ఈ రెండేళ్లలో ఆయన ఎన్ని ప్రశంసలు పొందారో, విమర్శలూ, ఆరోపణలూ అదే స్థాయిలో మూట కట్టుకున్నారు.
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ చరిత్రలో ఇప్పటిరకు కనని, వినని ఒక ప్రక్రియలో పాల్గొన్న జయదేవ్ సింగ్ అనే వ్యక్తి గురించి బహుశా చాలామందికి తెలిసి ఉండదు. ఆయన ప్రస్తుతం ఉత్తరాఖండ్ రాష్ట్రానికి శాసన, పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి ముఖ్య కార్యదర్శిగా కొనసాగుతున్న ఒక బ్యూరోక్రాట్. ఇంతకూ ఆయన చేసిన పనేంటి?
తెలంగాణను ‘దేశంలోనే నెంబర్ వన్’ చేయడం తన లక్ష్యమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు కొంతకాలం క్రితం కొద్దిసార్లు అన్నట్లున్నారు. కాని ఇప్పుడు రాష్ట్రం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా చేసిన వివిధ ప్రసంగాలలోగాని, ఇచ్చిన ఇంటర్వ్యూలలోగాని ఆ మాట ఎక్కడా కనిపించలేదు. దాని అర్థం ఆయన దృష్టి మారిందా? లక్ష్యాలు మారాయనా?
రా ష్ట్ర విభజన జరిగి రెండేళ్లయింది. చూస్తుండగానే రెండేళ్లు సినిమా రీళ్లలా గిర్రున తిరిగిపోయాయి. వెనక్కి తిరిగిచూస్తే పెద్దగా సాధించిందేమీ లేకపోగా, బోలెడంత లోటు. కాకపోతే ఇద్దరు చంద్రుల విషయంలో సాధించిన విజయాల తీరు వేర్వేరు. అదృష్టలక్ష్మి ఇద్దరి విషయంలో సమన్యాయం చూపడం లేదు.
‘గాంధీ, నెహ్రూ పేర్లను తొలగించడం అభివృద్ధికి సూచికకాదు..’ అం టూ శివసేన అధికార పత్రిక సామ్నా మే 28 నాటి సంపాదకీయంలో మోదీ రెండేళ్ల పాలనపై ఓ కథనం రాసింది. దాదాపుగా ఇలాంటి మాటల్ని గత ఆరు దశాబ్దాలుగా ప్రతి ప్రధానమంత్రి ప్రస్తావించారని, చివరికి కొన్ని మాసాలు ప్రధానిగా ఉన్న దేవెగౌడ కూడా తన హయాంలోనే అభివృద్ధి జరిగినట్టు ప్రచారం చేసుకున్నాడంటూ ఆ పత్రిక ఉటంకించింది.
భారతీయ జనతాపార్టీ మొట్టమొదటిసారిగా హిందీ రాష్ట్రాలనుంచి ఈశాన్య ప్రాంతాలకు విస్తరించింది. ఈ ప్రాంతంలోని అతిపెద్ద రాష్టమ్రైన అసోంలో పూర్తి మెజారిటీతో అధికార పగ్గాలను చేపట్టింది. ఈశాన్య ప్రాంతంలోని మిగిలిన ఆరు రాష్ట్రాల మొత్తం జనాభా కంటె అసోం జనాభా రెట్టింపుకంటె అధికం. టీ, ముడిచమురు, అడవులు, నీరు వంటి సహజవనరులు సమృద్ధిగా ఉన్న రాష్ట్రం కూడా.
‘‘తెలంగాణ సాధించామని సంబరపడుతున్నారు. ఈ సంబరాలు ఎక్కువ రోజులు ఉండవు. ఆరునెలలు గడిస్తే కెసిఆర్పై తెలంగాణ ప్రజలు తిరగబడతారు, తిరిగి ఆంధ్రలో కలిపేయమని ఉద్యమిస్తారు.’’ తెలంగాణ ఆవిర్భావ సమయంలో ఉమ్మడి రాష్ట్రం మంత్రిగా ఉన్న టిజి వెంకటేశ్ చెప్పిన మాటలివి. ఆయన కోరుకున్న తెలంగాణ అది.
కోతియుగం, రాతియుగం వంటి కృత్రిమ కాల విభాగాలను చేసినవారికి సహజ చారిత్రకపరిణామ క్రమాన్ని వివరించే ఆవిష్కరణలు అనేకం జరుగుతున్నాయి. అయినప్పటికీ పాశ్చాత్యులు మన నెత్తికెత్తిపోయిన కట్టుకథల ప్రభావం నుంచి మన విద్యావ్యవస్థకు ఇప్పటికీ విముక్తి లభించలేదు.
ఎంతో కాలంగా ఎదురుచూసిన ఉపాధ్యాయ ఉద్యోగ అర్హత పరీక్ష రాసి మృత్యువును ఆహ్వానించిన ఇద్ద రు అభ్యర్థులు. కారణం-సరిగా రాయలేదనే భావన, ఉద్యోగం దొరకదనే వేదన! పిల్లల్ని 3పోటీ2అనే క్రీడ పేరున కోచింగ్ అనే కానె్సంట్రేటెడ్ క్యాంపులో బంధించడానికై తీసుకెళ్ళుతున్న ముగ్గురు పిల్లలతో సహా తల్లిదండ్రులు కామారెడ్డిలో ఘోర ప్రమాదానికి గురి!