S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

04/19/2016 - 00:40

కృపాల్‌సింగ్ పేరు విన్నారా? అతనిని 1992లో వాఘా వద్ద సరిహద్దులు దాటుతుండగా చూశాను అని పాకిస్తాన్ చెబుతున్నది. గత పాతిక సంవత్సరాలుగా ఇతడు కోట్ లక్‌పాట్ జైలులో (పంజాబ్ ప్రావెన్స్) మగ్గుతున్నాడు. 2016, ఏప్రిల్ 13న అతడిని లాహోర్‌లోని జిన్నా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ మరణించినట్లు ప్రకటించారు. గూఢచారి అంటూ పాక్ ప్రభుత్వం అతనిపై నేరారోపణ చేసింది.

04/18/2016 - 06:28

పలువురు ఊహిస్తున్నది చివరకు జరగనే జరిగింది. బిహార్ ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ 2019 ఎన్నికలకోసం జాతీయ స్థాయిలో మహాకూటమి ఏర్పాటుకు ప్రయత్నించనున్నట్టు బహిరంగంగా ప్రకటించారు. భాజపా తిరిగి అధికారంలోకి రాకుండా నిలువరించడం తమ ఉద్దేశమని, అందుకోసం కాంగ్రెస్,వామపక్షాలతో సహా వీలైనన్ని పార్టీలను ఒకే వేదికపైకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.

04/17/2016 - 05:28

ఇంత అస్తవ్యస్తంగా ఉన్న విద్యారంగం బాగుపడాలంటే, కొఠారీ తోపాటు హైదరాబాద్, అలహాబాద్ హైకోర్టులు ఆదేశించినట్టు అధికారుల, ప్రజా నాయకుల, ఉపాధ్యాయుల పిల్లలందర్ని నైబర్‌హుడ్ పాఠశాలల్లోనే చదివించాలి. మాధ్యమం (మాతృభాషనే శాస్ర్తియమైనది) ఏదైనా అందరికి కామన్ విద్యా బోధన జరగాలి. ఈలెక్కన కెసిఆర్ తను చదువుకున్న దుబ్బాక పాఠశాలకు ఏకంగా దాదపు రూ.11 కోట్లను మంజూరు చేశారు.

04/16/2016 - 00:01

ప్రస్తుతం రష్యా, చైనాల మధ్య సాన్నిహిత్యం బాగా పెరుగుతోంది. పశ్చిమ దేశాలు తమపై విధించిన ఆంక్షలను ఎదుర్కొనడానికి తనకు ప్రత్యామ్నాయం ఉన్నదని, రష్యా ఈవిధంగా నిరూపించడానికి యత్నిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికాపై పూర్తిగా ఆధారపడిన ఐరోపాదేశాలు నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. భవిష్యత్తులో ఈ పరిణామాలు ఏవిధంగా రూపుదిద్దుకుంటాయన్నది చెప్పలేం.

04/14/2016 - 05:38

దేశద్రోహులతో భరతమాత వరాల బిడ్డలు సహజీవనం చేయవలసిన దుస్థితి దాపురించి ఉండడం వర్తమాన వాస్తవం. ఈ వాస్తవం జమ్మూకశ్మీర్ ‘వసం త’ రాజధాని శ్రీనగర్‌లోని జాతీయ సాంకేతిక ఉన్నత విద్యాలయం- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-నిట్- ప్రాంగణంలో మరోసారి ప్రస్ఫుటించింది. ఈ మహావిద్యాలయ ప్రాంగణంలో ముప్పయిశాతం స్థానిక కశ్మీరీ విద్యార్థులు ఇతర ప్రాంతాలవారు. మార్చి 31న భారత జట్టువారు క్రికెట్ ఆటల పోటీలో ఓడిపోయారు.

04/13/2016 - 07:38

వాల్మీకి సంస్కృత రామాయణాన్ని, యథా వాల్మీకంగా పూర్వ కాండలతో సహా ఉత్తర కాండను కూడా తెనింగించిన వాడు ఆంధ్ర వాల్మీకి-కవిసార్వభౌమ వావికొలను సుబ్బారావు (వాసుదాసు). ఒంటిమిట్ట కోదండ రామస్వామికి సరీగ్గా 108 ఏళ్ల క్రితం అంటే 1908, అక్టోబర్ 9,10,11 తేదీల్లో ఈ దేవాలయంలో అంకితమిచ్చారు. నాటి కార్యక్రమానికి ఎందరో ప్రముఖులు హాజరయ్యారు.

04/12/2016 - 00:23

మొన్న కాలిఫోర్నియాలో ఒక సంఘటన జరిగింది. అక్కడి పాఠ్య ప్రణాళిక నుండి భారత్‌ను తొలగించి ఆగ్నేయ ఆసియాను ప్రవేశపెట్టారు. దీనికి అక్కడి భారతీయులు నిరసన తెలియజేశారు. నిజానికి అమెరికాకు భారత్ మిత్రదేశం. ఐనా అమెరికా గతంలో పాకిస్తాన్‌కు, చైనాకు ఇచ్చిన గౌరవం భారత్‌కు ఇవ్వలేదు. ఎందువల్ల? జాన్సన్ కాలం నుంచి జార్జిబుష్ హయాం వరకు, అమెరికా తన ఆయుధ సంపత్తికి పాకిస్తాన్‌ను మార్కెట్‌గా ఉపయోగించుకుంది.

04/11/2016 - 05:06

అభివృద్ధి అంశాలను క్రమంగా ఒక కొలిక్కి తీసుకొస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్, అవినీతిని కూడా పూర్తిగా నియంత్రించనున్నారా? ఆ ప్రసక్తి ఆయన నోటివెంట ఇటీవలి వారాలలోనే రెండుసార్లు వచ్చింది. నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ, ‘‘రాజకీయ అవినీతిని నూటికి నూరు శాతం’’ అరికట్టామని ప్రకటించారు. ఆ మాటను ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పారు.

04/10/2016 - 03:25

ప్రాథమిక పాఠశాలల్లో కనీస విద్యార్హత ల్లేని వారితో ఆంగ్ల మాధ్యమం పాఠశాలల్ని ప్రభుత్వ ఉపాధ్యాయులే ప్రారంభించడం, సంఘాలు చోద్యం చూడడం జరుగుతున్నది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం, ఆంగ్ల పరిజ్ఞానం గల నిష్ణాతులైన ఉపాధ్యాయుల కొరత ఉన్నందునే కెజి టు పిజి ని వాయిదా వేసినట్లు చెబుతుంటే సవాళ్లు విసరాల్సిన ఉపాధ్యాయ సంఘాలు, ఆంగ్ల మాధ్యమాన్ని ప్రారంభించమని మాత్రం కోరుతున్నాయి.

04/09/2016 - 00:08

పంటలు దెబ్బతినడం, తలకు మించిన అప్పుల భారం, దుర్భర దారిద్య్రాన్ని తట్టుకోలేక దేశంలో వేలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంగతులు మాత్రమే మనకు తెలుసు. అటువంటప్పుడు రైతుల్లో కోటీశ్వరులున్నారని ఎవరైనా అంటే మనం వారిని వెర్రిబాగులవాళ్ల కింద జమకట్టడం సహజ మే కదా!

Pages