S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెయన్ ఫీచర్

03/29/2016 - 02:00

1962లో ఇండో-చైనా యుద్ధం, 1969లో రష్యా-చైనా సరిహద్దు ఘర్షణలు, 1979లో చైనా-వియత్నాం ఘర్ణణల్లో పాల్గొన్న చైనా సైన్యం ప్రభుత్వం పట్ల నిస్తేజంగా ఉంది. ప్రస్తుత పాలకుడు జింగ్‌పింగ్ ఈ సవాళ్లను అధిగమించడానికి మానవ మార్గాలను అనే్వషిస్తూ తమ అధికారాన్ని సుప్రతిష్టితం చేసుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు.

03/28/2016 - 02:07

ఎప్పుడో మూతపడిన గోలకొండ పత్రిక తర్వాత, తెలంగాణ ప్రాంతంలో గుర్తింపు పొందిన దిన పత్రికలు ఆంధ్రభూమి, డెక్కన్ క్రానికల్ మాత్రమే. ఉర్దూ, హిందీ వాటిని అట్లుంచితే, 1969-70 ఉద్యమ కాలంలో ఈ రెండిటివైపు తెలంగాణ ప్రజలు చూసేవారు. ఆ ఉద్యమానికి ముందు, తరువాత కూడా తమ ప్రాంత వార్తలు, సమస్యలపై వ్యాఖ్యలకు అవి రెండే ఆధారమయ్యాయి.
-----

03/27/2016 - 01:57

ప్రస్తుత పరీక్షలు నూతన విధానంలో జరగాలి. అంటే పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు స్వేచ్ఛాపూరిత, స్నేహపూరిత వాతావరణంలో కొనసాగాలి. కాని ఇందుకు భిన్నంగా గతంలో లాగే పరీక్షల్ని నిర్వహించి విద్యార్థుల్ని భయాందోళనకు గురిచేయడం జరుగుతున్నది. దీన్ని గుర్తించడానకి, నియంత్రించడానికి ఉపాధ్యాయులకు, ఉపాధ్యాయ సంఘాలకు, ఎలాగో పట్టింపు లేదు.

03/26/2016 - 00:30

ఒవైసీ మాట్లాడితే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌పై విమర్శల దాడికి దిగుతుంటాడు. ‘‘తన సిద్ధాంతాలను బలవంతంగా ఇతరులపై రుద్దుతోంది’’ అంటూ ఆరోపిస్తుంటాడు. తన వాదనకు మద్దతుగా 70 లేదా 80 సంవత్సరాల క్రితం నాటి ఆర్‌ఎస్‌ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తుంటాడు. కానీ వర్తమాన ఆర్‌ఎస్‌ఎస్ లేదా భాజపా నేతలను ఒక్కసారి ప్రశ్నించి చూడండి.

03/25/2016 - 00:05

భారత్ మాతా కీ జై నినాదంపై సెక్యులరిస్టులు చేస్తున్న మరో ‘కృత్రిమ’ వాదం ఇలా ఉంది: ‘‘ సెక్యులర్ రాజకీయాలను, అణచివేయాలన్న ఉద్దేశంతో ఆర్‌ఎస్‌ఎస్ ఉన్నందువల్ల, ఆ నినాదం చేయాలని మాపై ఒత్తిడి తీసుకొని రావద్దు. అటువంటి నినాదాలు చేయాలని దేశ ప్రజలపై ఎవ్వరూ వత్తిడి తీసుకొని రాలేదు.’’ అన్నింటికీ మించి ఈ నినాదం ఆర్‌ఎస్‌ఎస్ స్వకపోల సృష్టి కాదు.

03/24/2016 - 07:28

రాజ్యాంగం ఒక జాతి స్వభావాన్ని వివరించే నిర్వచన పత్రం. ఒక జనసముదాయం, లేదా అనేక జనసముదాయాల సమాహారం జాతిగా వికసించిన తరువాత ఏర్పడే వివిధ వ్యవస్థలలో రాజ్యాంగం అతి ప్రధానమైంది. అందువల్ల రాజ్యాంగం జాతీయతను వ్యక్తం చేసే ఒక మాధ్యమం. ఒక జాతి తన ప్రస్థాన క్రమంలో రాజ్యాంగాన్ని రాసుకుంటుంది, మార్చుకుంటుంది, రద్దు చేసుకుంటుంది, కొత్త రాజ్యాంగాన్ని వ్రాసుకుంటుంది. ఈ రాజ్యాంగ ప్రక్రియకు పూర్వం కూడ జాతి ఉంది.

03/23/2016 - 00:28

కేరళ ఓటర్లు 1977 నుంచి సరికొత్త పంథాను అనుసరించడం మొదలు పెట్టారు. వరుస ఎన్నికల్లో ఎప్పుడూ ఓకే పార్టీకి వారు అధికారాన్ని కట్టబెట్టడం లేదు. త్వరలో కేరళ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల్లో లెప్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (సిపిఎం, సిపిఐ, జనతాదళ్ సెక్యులర్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, ఇతర రాజకీయ పార్టీలు) ప్రభుత్వం అధికారంలోకి వస్తుదని ఎవరైనా అంచనా వేయదలిస్తే అందుకు ఈ ఒక్క కారణం తప్ప మరేమీ కనిపించడం లేదు.

03/22/2016 - 00:33

పార్టీలు కొన్ని సిద్ధాంతాలతో అవతరిస్తాయి. దేశానికి స్వాతంత్య్రం తీసుకొని రావడం కోసం కాంగ్రెస్ పార్టీ పుట్టింది. వచ్చిన స్వాతంత్య్ర ఫలాలను అనుభవించడం కోసం మనుగడ సాగించింది. అవినీతి పుట్టలు పెరిగిపోవడంతో అధికారం కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ వారు ఇలా అంటున్నారు.

03/21/2016 - 00:55

'భరతమాత’, భారత్ మాతాకీ జై’ అనే మాటలపై వివాదం ఎందువల్లనో నిర్వికారంగా ఎంత ఆలోచించినా బోధపడటం లేదు. భారత్ మాతాకీ జై’ అని తన గొంతుమీద కత్తిపెట్టినా అనబోనని, అట్లా అనాలంటూ రాజ్యాంగంలో ఎక్కడా లేదని ఎంఐఎం లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు కాని, వైఖరి వెనుక ఆలోచనలు ఏమిటో వివరించలేదు.

03/19/2016 - 23:34

"మార్కుల్ని ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలని మా తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు..’ అంటూ మాచారెడ్డి మండలంలోని లచ్చాపేట ప్రభుత్వ పాఠశాల పదోతరగతి విద్యార్థి శ్యాం వీడ్కోలు సందర్భంగా సమావేశానికి హాజరైన ఓ విద్యావేత్తకు చేసిన ఫిర్యాదు ఇది. ఎన్ని మార్కులు తెచ్చుకున్నా ఇంకా తెచ్చుకోవాలనేది ఆ మాటల్లోని సారాంశం. ఈ సమావేశానికి కొంతమంది తల్లిదండ్రులు వచ్చినా, శ్యాం తల్లిదండ్రులు మాత్రం రాలేదు.

Pages