S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మెయన్ ఫీచర్
మారుతున్న నాగరికత, సినిమా, టీవీల రాకతో ప్రాచీన కాలం నుండి వస్తున్న మనవైన పలు జానపద కళలు, కళా నైపుణ్యాలు సమాధి అవుతున్నాయి. పైగా ఆయా కళలను నమ్ముకున్న వారిని నిరాదరణకు గురి చేయడమే కాకుండా, వారిని నేరస్థులుగా, సమాజ హితానికి ప్రమాదకారులుగా ముద్రవేసి, ఆధునిక నాగరికత వారి ఛాయలకు చేరకుండా ఒక విధంగా కట్టడి చేస్తున్నాము. ఆ విధంగా సమాజ వివక్షతకు గురవుతున్న వారిలో ‘దొమ్మరులు’ కూడా ఉన్నారు.
గౌతమబుద్ధుని శిష్యుల్లో ప్రసిద్ధుడైన ఆనందుడు ఓసారి మండువేసవిలో ప్రయాణం చేస్తున్నాడు. అతనికి బాగా దాహం వేసింది. నలువైపులకు చూస్తే అల్లంత దూరాన కొందరు స్ర్తిలు నూతి నుండి నీరు తోడుతున్నారు. ‘అమ్మా! దాహం’ అన్నాడు ఆనందుడు. ఆ స్ర్తిమూర్తి వెంటనే నీళ్లు పోసి అతని దాహం తీర్చింది. ఆ తర్వాత ‘నేను మాతంగకన్యను; అంటరాని దానిని’ అన్నది. ‘‘అమ్మా! నేను నిన్ను మంచినీళ్లు మాత్రమే అడిగాను; నీ కులం అడగలేదు.
ఆమె మంగళసూత్రాన్ని లాక్కోవడం ఆశ్చర్యం కాదు! ఆమె చేతికున్న గాజులను కూడా తొలగించారు. ఆమె సుమంగళి..! పాకిస్తాన్లోని కారాగృహాలలో 22 నెలలుగా క్రుంగిపోతున్న తన భర్త కుల్భూషణ్ జాధవ్ను చూడడానికై ‘చేతన్కుల్’ అన్న ఈ మహిళ మన దేశం నుండి వెళ్లింది, ఆమె వెంట జాధవ్ తల్లి అవన్తి కూడా వెళ్లింది!
మనుషుల ఆలోచనా విధానాలు, వ్యవహారశైలి, సంబంధ బాంధవ్యాలలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. అవి కొన్నిసార్లు మానవత్వానికి మాయనిమచ్చగా మిగులుతున్నాయి. ఆవేదనను కలిగిస్తున్నాయి. అనేక ప్రశ్నలను సంధిస్తున్నాయి. మనలో మంచిమార్పు రాకపోతే మునుముందు ఎలా ఉంటాం అన్నది ఆందోళన కలిగిస్తోంది. భారతీయ జీవన విధానంలో పెడధోరణులు ప్రబలడానికి అసలు కారణాలు ఏమిటి? ఆ విపరిణామాల నుంచి బయటపడటం ఎలా? ఇదీ ఇప్పటి ప్రశ్న.
తమిళనాడును పూర్వం మద్రాసు రాష్ట్రం అని పిలిచేవారు. దీని పరిధి చాలా ఎక్కువగా ఉండేది. నిజానికి తమిళనాడును నాయక రాజులు చాలాకాలం పరిపాలించారు. వారు ఆంధ్ర ప్రభువులు. శ్రీకృష్ణదేవరాయలు వారసులు. వీరి రాజధాని తంజావూరు మద్రాసు తెలుగు భాషీయుల ప్రాంతం. కరుణానిధి తెలుగువాడు. సర్వేపల్లి రాధాకృష్ణ పండిట్ తెలుగువాడు. తమిళనాడులో ఉన్న కారణంగా రాధాకృష్ణన్ అని పిలవబడ్డాడు.
మినిష్టరచ్చే మురికిపాయే
మాలవాడలు మంచిగాయే!
వీధివీధిన వెలుతురాయే!!
బీదవారికి పట్టాలంట
బొజ్జ చూపుతు ఇచ్చిపాయే!
చల్లబడెను పల్లె అంతా
పాపమంతా పారిపోగా..!!
ప్రపంచం ఎప్పుడూ విజేత గురించే మాట్లాడుకుంటుంది. కానీ ఇప్పుడు ఓడి గెలిచిన రాహులబ్బాయి గురించీ మాట్లాడుకుంటోంది. అవును. గుజరాత్ ఎన్నికల ఫలితాలు మోదీని మరోసారి ధీరుడిగా నిలబెట్టినా, ఆయనను ఎదుర్కొనేందుకు ఎలాంటి అనుభవం లేని రాహుల్ అనే యువనేత చేసిన పోరాటం కూడా దేశం గుర్తించింది. కేవలం 20 సీట్ల తేడాతో బీజేపీకి చెమటలు పట్టించిన రాహుల్ నాయకత్వ ప్రతిభకు కితాబు ఇవ్వాల్సిందే.
గుజరాత్ ఫలితాలను ఆర్ఎస్ఎస్ ముందే పసిగట్టిందా? మోదీ ఆకర్షణ శక్తి తగ్గుతోందని, మెరుగైన ఫలితాల సాధనకు ఏం చేయాలో ఎన్నికలకంటే ముందుగానే బిజెపి అధినాయకత్వాన్ని సంఘ్ హెచ్చరించిందా అంటే అవుననే చెప్పాలి. ఇప్పుడు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల ఫలితాల తరువాత జాతీయ స్థాయిలో ఎలాంటి మార్పులు ఉంటాయో, 2019 ఎన్నికల్లో బిజెపికి ఎదురయ్యే సవాళ్లు ఏమిటో సంఘ్ పరివారం విశే్లషిస్తోంది.
ముల్లా నసీరుద్దీన్ మంచి హాస్యగాడు. అతనికి ఓసారి పదిలక్షల లాటరీ తగిలింది. ఓ మిత్రుడు వచ్చి ‘‘మీకింత పెద్ద లాటరీ ఎలా తగిలింది?’’ అని ప్రశ్నించాడు. ‘‘నాకు రాత్రి స్వప్నంలో మూడుసార్లు ఏడు నంబర్ కన్పించింది. నేనేమో పద్దెనిమిది నెంబర్పై పందెం కాసాను. అంతే! నాకు పది లక్షల లాటరీ వచ్చింది’’ అన్నాడు. ‘‘మూడు ఏడులు కలిస్తే ఇరవై ఒకటి అవుతాయి కదా, మరి నువ్వేమో పద్దెనిమిదిపై పందెం కాసావు.
‘‘అట జనికాంచె భూమి సురు
డంబర చుంబి శిరత్ సరిత్ ఝరీ
పటల ముహుర్ ముహుర్లుఠదభంగ
తరంగ మృదంగ నిస్స్వన
స్ఫుట నటనానుకూల పరిపుల్ల
కలాపకలాపిజాలమున్
కటక చరత్కరేణ కరకంపిత
సాలము శీతశైలమున్...’’