S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఉత్తరాయణం
ఇస్లామిక్ సహకార సంస్థ (ఓఏసీ) స్వర్ణోత్సవ వేదికపై భారత్ తన గళాన్ని బలంగా వినిపించడం, ఉగ్రవాద పెనుభూతాన్ని మట్టుపెట్టడంలో ఇస్లామిక్ దేశాల సహకారాన్ని కోరడం హర్షణీయం. సర్ణోత్సవ వేదికపై భారతదేశాన్ని అడుగుపెట్టనీయకుండా తమ తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్న ఉగ్రవాద దేశమైన పాకిస్తాన్కు ఈ తాజా పరిణామం ఒక చెంప దెబ్బ.
దేశ రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించి, అభివృద్ధికి కృషిచేయడమే తన ధ్యేయమని చెప్పి గత ఎన్నికల్లో అధికారం చేపట్టిన ఘనుడు నరేంద్ర మోదీ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తరువాత విదేశీ పర్యటనలపై చూపించిన శ్రద్ధ పరిపాలన మీద చూపించక పోవడంతో పలు సమస్యలు పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నాయి. పెద్దనోట్ల రద్దుతో బ్లాక్మనీ బయటకు వస్తుందని మోదీ చెప్పిన మాటలను ప్రజలు విశ్వసించారు.
ఎన్నికల వేళ కొందరు కాంగ్రెస్ నేతలు గాడ్సే ప్రస్తావన తెస్తారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇటీవల ఓ సభలో మాట్లాడుతూ, ‘గాంధీ భారత్’ కావాలో, ‘గాడ్సే భారత్’ కావాలో ప్రజలు తేల్చుకోవాలని అన్నారు.
ధూమపానానికి వ్యతిరేకంగా మొదటిసారిగా ఇంగ్లండ్లో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ధూమపాన వ్యతిరేక ప్రచారం ఇంగ్లాండ్ నుంచే ఇతర దేశాలకు వ్యాపించిందని చెప్పవచ్చు. 1984లో ఇంగ్లండ్లో ధూమపానానికి వ్యతిరేకంగా ఒక జాతీయ ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ఆనాటి నుండి ఏటా మార్చి నెలలో రెండవ బుధవారం రోజున ధూమపాన వ్యతిరేక దినం పాటిస్తున్నారు.
రహస్యాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. అది తప్పుడు పనులకు సంబంధించినదయితే మరీ మంచిది. అడ్డగోలుగా దబాయించే అవకాశమిస్తుంది. 1889లో మన దేశంలో ‘అధికార రహస్యాల చట్టం’ అమలులోకి వచ్చింది. అప్పుడు దేశీయంగా నిజాల్ని తొక్కిపెట్టడం కోసం బ్రిటిష్ వారికి అవసరమైన రీతిలో ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. స్వాతంత్య్రం వస్తేనేమి? ప్రజాప్రభుత్వాలు అనుకుంటేనేమి?
మొదటిగా ఉత్తరాంధ్ర ఐదు దశాబ్దాల న్యాయమైన కోరిక, విభజన చట్టంలోని హక్కు విశాఖ రైల్వేజోన్ ఏర్పాటుచేసినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదములు. లక్ష కోట్ల బుల్లెట్ రైళ్లు అహ్మదాబాద్కి అలవోకగా ప్రకటించిన కేంద్రంలోని మోడీ సర్కార్ ఆంధ్రప్రదేశ్కి మాత్రం బ్యాలెట్ రైలుని ఎన్నికల ముందు పట్టాలెక్కించింది. అయితే అది కూడా ‘వేలికి ఉంగరం తొడిగి, మెళ్ళో గొలుసు కొట్టేసిన బాపతు’ వ్యవహారం కావడం కించిత్ శోచనీయం.
అటవీ హక్కుల చట్టం అమల్లోకి వచ్చి దశాబ్దం దాటుతున్నా క్షేత్రంలో అమలు ప్రాథమిక దశలోనే ఉంది. చట్టం లక్ష్యం ఇంకా ఆమడ దూరంలోనే ఉంది. కాగా తాజాగా ఈ చట్టంపై నడుస్తోన్న వ్యాజ్యంలో సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశం.. చట్టం యొక్క అసలు స్ఫూర్తికి, ఆదివాసుల హక్కులకు ఏ మాత్రం మేలుచేసేదిగా లేదు. లక్షలాది గిరిజనుల్ని నిలువనీడ లేనివారిగా చేసేదిగా ఉంది.
ప్రజలకు అవసరమైన కూడు, గూడు, గుడ్డ సమకూర్చే దిశగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. కూడుపెట్టే రైతన్నకు ఏటా పదివేలు, నిరుపేదలందరికీ ఇళ్లు సమకూర్చుతోంది. గుడ్డ నేచే నేతన్న పరిస్థితే విషమంగా ఉంది. చిలప నూలుపై కేంద్రం పన్ను విధించింది. కుల వృత్తిని నమ్ముకుని వేరే దారిలేక లక్షల కుటుంబాలు మగ్గం గోతికే పరిమితమయ్యాయి.
నేటి నవ నాగరిక సమాజంలో మహిళల పట్ల లైంగిక వేధింపుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వాటికి అంతమంటూ లేదు. పసికందుల నుంచి ముసలి వాళ్లవరకూ.. బడికెళ్లే చిన్నారులు మొదలు యువతులు, ఉద్యోగినులు, ఆఖరికి మహిళా మంత్రులు కూడా లైంగిక వేధింపులకు గురివుతున్నారంటే.. ఎలాంటి భయంకర పరిస్థితుల మధ్య నేడు మనం బతుకుతున్నామో అర్థం చేసుకోవచ్చు.
మన దేశ రాజ్యాంగం ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగంగా గుర్తింపు పొంది 70 వసంతాలు పూర్తిచేసుకోవడం ఆనందదాయకం. దేశ భవిష్యత్తుకు పునాదులు వేయాల్సిన రాజ్యాంగం నుండి ఆశించిన ఫలాలు అందడం లేదు. ఇందుకు కారణాలను పునరావలోకనం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రజలందరికీ సామాజిక, సాంఘిక, ఆర్థిక న్యాయం కల్పించాలని మన రాజ్యాంగానికి 122కు పైగా సవరణలు చేశారు. ఏ ఫలితాలను ఆశించి సవరణలు చేసినా పరిస్థితిలో మార్పు లేదు.