S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాయణం

02/17/2017 - 01:17

‘సేలం సేనాపతి’గా పేరుమోసిన ఎడప్పాడి కె.పళని స్వామి తమిళనాడు ముఖ్యమంత్రిగా గురువారం పదవీ స్వీకార ప్రమాణం చేయడం ‘పర నియంత్రిత’- రిమోట్ కంట్రోల్డ్- రాజకీయ చరిత్రలో మరో విచిత్ర ఘట్టం!

02/16/2017 - 01:31

‘ఇస్రో’లా ఘన విజయాలు నమోదు చేసే ఓ పది సంస్థలుంటే చాలు ప్రపంచంలో మన దేశమే ‘సూపర్ పవర్’గా ఆవిర్భవించడం ఖాయం. అన్ని దేశాలూ అబ్బురపడేలా ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ‘ఇస్రో’ ప్రవేశపెట్టడం ఓ అద్భుతం. భారత్ గర్వపడేలా ఈ విజయాన్ని సాధించిన ‘ఇస్రో’ శాస్తవ్రేత్తలు అభినందనీయులు. ఈ తాజా ప్రయోగంతో అంతరిక్ష విజ్ఞానంలో భారత్ అద్వితీయ శక్తిగా మరోసారి నిరూపించుకుంది.

02/15/2017 - 01:26

ఆదాయానికి మించి ఆస్తుల కేసులో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత, శశికళ సహా నలుగురిని దోషులుగా నిర్థారిస్తూ సుప్రీం కోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పు ప్రస్తుత రాజకీయ నాయకులకు గుణపాఠం వంటిది. తీర్పు ఇవ్వడంలో ఏళ్ల తరబడి ఆలస్యం జరిగినప్పటికీ, అక్రమాలకు పాల్పడిన వారికి జైలుశిక్ష, జరిమానాలు విధించడం సబబే.

02/14/2017 - 01:11

రాష్ట్రంలో ఉమ్మడి ఎస్.సి కార్పొరేషన్ వల్ల ఎస్‌సి కేటగిరీలోని మాల సోదరులే అన్ని విధాలా అభివృద్ధి చెందుతున్నారు. కాని ఎస్‌సి మాదిగలకు ఏ విధమైన ఉపకారాలు జరగడంలేదు. మాలలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారు. మాదిగలు, చర్మకారులు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారు. నిరుపేదలైన మాదిగలు అన్యాయానికి గురియగుచున్నారు.

02/13/2017 - 00:57

జాతీయ పార్టీల మనుగడ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడాల్సిన దుస్థితి ప్రస్తుతం దేశంలో ఏర్పడింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. సొంతంగా గెలిచే సత్తా లేక యుపిలో సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ వారు పొత్తు కుదుర్చుకున్నారు.

02/11/2017 - 01:14

మతం పేరిట రిజర్వేషన్లు ఇవ్వడాన్ని ఉన్నత న్యాయస్థానాలు ఇదివరకే తప్పుపట్టాయి. మతప్రాతిపదికపై మైనారిటీలంటూ కొందరికి విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని తెలిసినా మన నేతల ధోరణి మారడం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ మైనారిటీల ఓట్ల కోసమే ఇపుడు ‘రిజర్వేషన్ల జపం’ చేస్తున్నారు. మైనారిటీ వర్గాల్లో పేదలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవచ్చు.

02/10/2017 - 00:54

కేంద్ర బడ్జెట్‌కి ఆలంబనగా చేసే ఆర్థిక సర్వేలో ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలపై అధ్యయనం ఉంటుంది. ప్రత్యేక హోదా వున్న 11 రాష్ట్రాల్లో మిజోరాం పరిస్థితి కాస్త మెరుగ్గా వున్నా మిగిలిన రాష్ట్రాల పురోగతి అధ్వానంగా, కొన్ని అధమంగా వున్నాయి. వాటి తలసరి వార్షిక ఆదాయం దయనీయంగా 26 వేల రూపాయలు మాత్రమే. అంతకుముందు ఒక సంస్థ వాణిజ్య అనుకూల రాష్ట్రాలకు ర్యాంక్‌లు ప్రకటించింది.

02/09/2017 - 00:22

తన దేశంలోని వారికి ఉద్యోగాలిస్తానని అంటున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను భారతీయులు నిందించడం సరికాదు. అమెరికాలో మన యువతకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మనం ఏమీ చేయలేం. ఆంధ్రప్రాంతం వారు తమ ఉద్యోగాలను, అవకాశాలను లాక్కుంటున్నారన్న ఉద్యమంతో తెలంగాణ విడిపోయింది. అంతకుముందే పెద్ద మనుషుల ఒప్పందం పేరిట తెలుగువారిని జోన్ల పేరిట విడదీశారు. చదువులు, ఉద్యోగాలు, పదోన్నతులు జోన్లవారీగానే సాగుతున్నాయి.

02/08/2017 - 01:12

తమిళనాడులో పాలనాధికారం ‘చిన్నమ్మ’గా పిలవబడే శశికళ చేతికి వచ్చేసినట్టేనా? పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో శాసనసభాపక్ష నాయకురాలిగా శశికళ ఎన్నిక కావడం అంతా శరవేగంతో జరిగినట్టు కనుపించినా, అనూహ్యమైనది మాత్రం కాదు. జయలలితకు ముప్ఫై ఏళ్ళుగా నీడలా వ్యవహరించిన శశికళకు పార్టీవర్గాల విధేయత విజయవంతంగా బదిలీ అయినట్టే.

02/07/2017 - 01:15

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అర్థవంతంగా నడిచేందుకు విపక్షాలు సహకరించాలి. తమ ఆకాంక్షలు, సమస్యలను దృష్టిలో వుంచుకొని పార్లమెంట్‌లో అనేక అంశాలను చర్చించి మంచి నిర్ణయాలు తీసుకొని అమలుపర్చాలని దేశ ప్రజలు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. ఏదో ఒక విషయంపై ఎప్పటిలాగే తమ వాదనే గెలవాలని రభస చేస్తూ సభలను వాయిదా వేయడం మంచిది కాదు. సమావేశాలు సజావుగా జరిగేలా విపక్ష, అధికారపక్ష ఎంపీలు బాధ్యత వహించాలి.

Pages